breaking news
dallas texas
-
డల్లాస్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..
డల్లాస్: జాతిపిత మహాత్మా గాంధీ 148వ జయంతి వేడుకలను మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్( ఎమ్జీఎమ్ఎన్టీ) ఆధ్వర్యంలో ఆదివారం డల్లాస్ నగరంలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ‘గాంధీ పీస్ వాక్’లో వందలాది మంది ప్రజలు పాల్లొన్నారు. శాంతికి నిదర్శనంగా పిల్లలు, పెద్దలందరూ తెల్లని దుస్తులు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇర్వింగ్ నగర మేయర్ ప్రొటెం ఆలన్ మేఘర్, హుస్టన్ నగరం నుంచి కాన్సుల్ ఆఫ్ ఇండియా ఆర్.డి జోషిలు హాజరయ్యారు. ఇర్వింగ్ నగర్ మేయర్ ప్రొటెం ఆలన్ మేఘర్ మాట్లాడుతూ.. ప్రత్యేక అతిధిగా వచ్చి, గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనడం తనకు గర్వంగా ఉందన్నారు. చాలా ఏళ్లుగా సిటీ గవర్నమెంట్ తో కలిసి పని చేస్తూ, ఇలాంటి కమ్యూనిటీ సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎమ్జీఎమ్ఎన్టీ బోర్డు సభ్యులను ఆయన అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలన్నింటికి తమ పూర్తి మద్దతు, సహాయం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్జీఎమ్ఎన్టీ చైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, డైరెక్టర్ శ్రీమతి, సెక్రటరీ రావుకల్వల, ఐ.ఏ ఎన్.టి అధ్యక్షుడు సల్మాన్ ఫర్షోరి, ఎమ్జీఎమ్ఎన్టీ బోర్డు సభ్యులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. -
డల్లాస్లో మూడవ అంతర్జాతీయ యోగా డే
డల్లాస్ టెక్సాస్: ఎంజీఎంఎన్టీ, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 25, 2017, (ఆదివారం) ఉదయం 7:30 - 9:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. యోగా చేయడానికి కావలసిన మాట్స్ ను పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఉచిత ప్రవేశం, అల్పాహార ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే వారు ముందుగా వచ్చి ఒక పద్దతిలో తమ వాహనాలను పార్క్ చేసుకోవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులు మాట్ రినాల్డి, ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టోప్ఫర్ ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారు. ఈ యోగా ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని యోగా, ధ్యానంలో ఉన్న మెలకువలను నేర్చుకొని దైనందిన జీవితంలో క్రమం తప్పకుండా చేస్తూ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవాలని ఆయన కోరారు. వివరాల కోసం ఎంజీఎంఎన్టీ.ఓఆర్జీ (www.mgmnt.org), ఎంజీఎంఎన్టీ బోర్డు సభ్యులను సంప్రదించండి. డాక్టర్ ప్రసాద్ తోటకుర - 817-300-4747, పియుష్ పటేల్ - 214-850-9828, రావు కల్వల -732-309-0621, సల్మాన్ ఫర్షోరి - 469-585-2104, తయాబ్ కుందవాలా - 469 -733-0859, శ్రీమతి షబ్నం మోడ్గిల్-214-675-1754, జాన్ హామండ్ - 972-904-5904, కమల్ కౌషల్ - 972-795-2328 , లాల్ దస్వాని – 214-566-3111