-
నిజామాబాద్లో .. కళాకారుల ధూం ధాం
సాక్షి, నిజామాబాద్ కల్చరల్: ఎన్నికల వేళ పల్లెలు, పట్టణాల్లో జానపదాలు హోరెత్తుతున్నాయి. కళాకారుల ఆటపాటలు మార్మోగుతున్నాయి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... అంటూ కళాకారులు ఎన్నికల ప్రచారంతో దుమ్ము రేపుతున్నారు. ఆగట్టునుంటావ నాగన్న.. ఈ గట్టుకొస్తావా.. అంటూ ఓటర్లలో చైతన్యం కలిగించే పాటలు పాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కాళాకారులు కీలకంగా మారారు. నియోజక వర్గాల్లో 20 వరకు కళాబృందాలు ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున కాలికి గజ్జె కట్టి ఆడుతూ పాడుతున్నారు. నిజామాబాద్ అర్బన్తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్,డిచ్పల్లి, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కళాకారులను రంగంలోకి దించారు. తమ తరఫున విసృత ప్రచారం చేసేలా వారికి వాహనాలను సమకూర్చి పల్లెల్లోకి పంపించారు. దీంతో కళాకారులు గ్రామాలకు వెళ్తూ తమ ఆటపాటలతో ప్రజలను ఆకట్టుకొంటూనే, తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్ షోలతో పాటు బస్తీలు, కాలనీ కూడళ్లలో కళా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కళాకారులకు డిమాండ్ ఎన్నికల వేళ కళాకారులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. 5 నుంచి 10 మంది ఉండే బృందాలకు రోజు రూ.10 వేల నుంచి రూ.15 వేలు చెల్లిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే 15 రోజుల ముందు నుంచి వచ్చే నెల 5 వరకు ప్రచారం చేసేలా భారీ మొత్తంలో కళాకారులతో ఒప్పందాలు చేసుకుని, ప్రచారం చేయిస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి సుమారు 50 మంది కళాకారులు ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు తెలుస్తోంది. మస్తు గిరాకీ.. ఎన్నికల పుణ్యమా అని అన్ని వర్గాల కళాకారులకు చేతినిండా పని లభిస్తోంది. ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న తరుణంలో డప్పు కళాకారులతో పాటు అడ్డాకూలీలకు, వంట మనుషులు, టెంట్ హౌస్ సామగ్రి, పూలు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, అద్దె వాహనాలు, ఫొటోగ్రాఫర్లు... ఇలా అందరూ ఉపాధి పొందుతున్నారు. ఇంతకుముందు శుభ, అశుభ కార్యక్రమాల సమయంలోనే డప్పు కళాకారులకు పని ఉండేది. కానీ, ఎన్నికల ప్రచారంలో వీరి అవసరం ఎక్కువగా ఉండటంతో కళాకారులతో పాటు పొరుగు జిల్లాల కళాకారులకు డిసెంబర్ 5వ తేదీ వరకు చేతినిండా పని దొరికింది. నేతలొస్తున్నారంటే పూలదండలతో స్వాగతం పలకాల్సిందే. దీంతో పూలదండలు తయారుచేసే వారి వ్యాపారం జోరందుకుంది. ఇక, అద్దె వాహనాలన్నీ ఆయా పార్టీల అభ్యర్థుల వద్దే ఉంటున్నాయి. కొందరు ముందస్తు గానే వాటిని బుక్ చేసుకున్నారు. డిమాండ్ తీవ్రంగా ఉండడంతో కొంత మంది అభ్యర్థులకు వాహనాలు పంపించడం కుదరడం లేదని ట్రావెల్ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఎన్నికల నిర్వహణ కోసం విధులు నిర్వహిస్తున్న అధికారులకు సైతం వాహనాలు అవసరం ఉండటంతో అద్దె వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కార్యకర్తలు, ముఖ్య నేతల భోజనాలకు కొందరు సొంతంగా వంటలు తయారు చేస్తుండటంతో వంటసామగ్రితో పాటు వంటమనుషులకు పని దొరుకుతోంది. అలాగే సభలు, సమావేశాల సందర్భంగా టెంట్హౌస్లకు గిరాకీ పెరిగింది. ఫొటోగ్రాఫర్లకు, విడియోగ్రాఫర్లకు ఇన్నాళ్లు గిరాకీ కోసం ఎదురుచూడాల్సి ఉండగా, ఎన్నికల నేపథ్యంలో వారు కూడా బిజీగా మారారు. ఇవే కాకుండా ఫ్లెక్సీ, కరపత్రాల తయారీ కోసం గ్రాఫిక్ డిజైనర్లు, డీటీపీ ఆపరేటర్లు, ప్రింటర్లకు ఎన్నికల వేళ ఉపాధి అవకాశాలు రెట్టింపయ్యాయి. -
ఉపాధ్యాయుల ఉగాది సంబరాలు
నారాయణపురం (ఉంగుటూరు): సమాజానికి దిశా నిర్ధేశకులుగా నిలిచే ఉపాధ్యాయులు ఉగాది ఉత్సవం పేరిట తెలుగు సాంస్కృతిక పరిరక్షకులుగా నిలవడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం రాత్రి ఉంగుటూరు మండలం నారాయణపురం శ్రీనివాస రైతు సేవా భవనంలో ఉంగుటూరు మండల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో హేవళంబి నామ తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం భీమవరానికి చెందిన ప్రసిద్ధ పంచాంగకర్త పెదగాడి మోహనరవి శంకర్ తెలుగు సంవత్సర రాశి ఫలాలను వివరించారు. నూతన పంచాంగాన్ని రచించి, ఆవిష్కరించి పంచాంగ శ్రవణం చేశారు. నాలుగేళ్ల నుంచి ఉంగుటూరు మండల ఉపాధ్యాయులు తెలుగు భాషా సాంస్కృతిక వైభవాన్ని రేపటి తరానికి అందించేలా చేస్తోన్న కృషి ఎనలేనిదన్నారు. తెలుగు వారి తొలి పండుగ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జటావల్లభుల సాయిరాం ఉగాది ప్రాధాన్యతను వివరిస్తూ.. తెలుగు వారి తొలి పండుగ ఉగాది సంప్రదాయాల వెనుక ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందన్నారు. అనంతరం తెలుగు పండితురాలు సీహెచ్ దుర్గ, పంచాగకర్త మోహన రవి శంకర్, సాయిరాంలను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. హాజరైన వారందరికీ నూతన పంచాంగాలు అందజేశారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆరగించి ఉపాధ్యాయులు తెలుగు సంప్రదాయ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు ఎంఈవో డి. శుభాకరరావు, తాడేపల్లిగూడెం ఎంఈవో వి.హనుమ, ప్రధానోపాధ్యాయులు సీహెచ్ వెంకట రత్నం, జి.చంద్రారావు, అప్పసాని శేషగిరిరావు, ఉపాధ్యాయ ఉగాది ఉత్సవ కమిటీ సభ్యులు ఉప్పిలి వేంకటేశ్వరరావు, సీతాల సత్యనారాయణ, బాలేశ్వరరావు, పరిమి సత్తిరాజు, కె.ఫణీంద్రనా««థ్, పుప్పాల నరసింహారావు, కె. హరికృష్ణ, జి.ఆనందరావు, కె.శ్రీరామకృష్ణ, పిరిడి ప్రసాద్, మూకల ప్రసాద్లతో పాటు మండలంలోని ఉపాధ్యాయులంతా తమ కుటుంబ సభ్యులతో ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న నల్లజర్ల రోడ్డు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఏలూరుకు చెందిన గరికపాటి ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో 5వ వార్షిక నాటిక పోటీలు సందేశాత్మక ప్రదర్శనలతో ఆహూతులను ఆకట్టుకున్నాయి. స్థానిక వైఎంహెచ్ఏ హాలులో రెండోరోజు శనివారం ప్రదర్శించిన నాటికల్లో నల్లజర్ల రోడ్డు, కృష్ణబిళం, దగ్ధగీతం నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ ఆఫీసర్ పి.సీతారామారావు, నగరపాలక సంస్థ కమిషనర్ వై.సాయిశ్రీకాంత్, గుప్త విద్యా దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షుడు తల్లాప్రగడ సుబ్బారావు, గరికపాటి సంస్థ అధ్యక్షుడు గరికపాటి కాళిదాసు, మైలవరపు గురుశర్మ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement