CSK vs KKR
-
వరుణ్ చక్రవర్తి ఖాతాలో భారీ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఖాతాలో భారీ రికార్డు చేరింది. నిన్న (మే 7) సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా (మ్యాచ్ల ప్రకారం) 100 వికెట్ల మైలురాయిని తాకిన స్పిన్నర్గా అమిత్ మిశ్రా, రషీద్ ఖాన్ సరసన నిలిచాడు. వరుణ్, మిశ్రా, రషీద్ తలో 83 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించారు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల వీరుడు యుజ్వేంద్ర చహల్కు 100 వికెట్లు తీసేందుకు 84 మ్యాచ్లు అవసరం కాగా.. ఐపీఎల్లో నాలుగో అత్యధిక వికెట్ల వీరుడు సునీల్ నరైన్కు 86 మ్యాచ్లు అవసరమయ్యాయి.ఓవరాల్గా (స్పిన్నర్లు, పేసర్లు కలుపుకుని) ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వరుణ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. వరుణ్, మిశ్రా, రషీద్తో పాటు ఆశిష్ నెహ్రా కూడా 83 మ్యాచ్ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఓవరాల్గా అత్యంత వేగంగా 100 ఐపీఎల్ వికెట్లు తీసిన రికార్డు కగిసో రబాడ పేరిట ఉంది. రబాడ కేవలం 64 మ్యాచ్ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు. రబాడ తర్వాత లసిత్ మలింగ (70 మ్యాచ్లు), హర్షల్ పటేల్ (81), భువనేశ్వర్ కుమార్ (81) అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకారు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన బౌలర్లు కగిసో రబడ - 64 మ్యాచ్లు లసిత్ మలింగ - 70 మ్యాచ్లుహర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ - 81 మ్యాచ్లువరుణ్ చకరవర్తి, ఆశిష్ నెహ్రా, రషీద్ ఖాన్, అమిత్ మిశ్రా - 83 మ్యాచ్లుమ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓ మోస్తరు స్కోర్ను (180) కాపాడుకునే క్రమంలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు (జడేజా, బ్రెవిస్) తీశాడు. ఈ మ్యాచ్లో వరుణ్తో పాటు సునీల్ నరైన్ (4-0-28-0) కూడా రాణించినా కేకేఆర్ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో వైభవ్ అరోరా ఏకంగా 30 పరుగులు సమర్పించుకుని కేకేఆర్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. వైభవ్ 3 వికెట్లు తీసినా 3 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. వైభవ్ వేసిన 11వ ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ తాండవం చేశాడు. మూడు సిక్సర్లు, మూడు బౌండరీలు బాది అప్పటిదాకా కేకేఆర్ చేతుల్లో ఉన్న మ్యాచ్ను సీఎస్కే వైపు తిప్పాడు. బ్రెవిస్ ఔటయ్యాక శివమ్ దూబే (45), ధోని (17 నాటౌట్) ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి సీఎస్కేకు సీజన్లో మూడో విజయాన్ని అందించారు. -
IPL 2025: చరిత్ర సృష్టించిన ధోని
సీఎస్కే స్టాండ్ ఇన్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్లో 200 మందిని ఔట్ చేయడంలో భాగమైన తొలి వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మే 7) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఓ క్యాచ్, ఓ స్టంపౌట్ చేసిన తర్వాత ధోని ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో సీఎస్కే, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీల తరఫున 276 మ్యాచ్లు ఆడిన ధోని 153 క్యాచ్లు, 47 స్టంపింగ్లు చేశాడు. ధోని తర్వాత దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్కీపర్గా ఉన్నాడు. డీకే.. ఢిల్లీ డేర్ డెవిల్స్, ఆర్సీబీ, కేకేఆర్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీల తరఫున 236 మ్యాచ్లు ఆడి 174 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఇందులో 137 క్యాచ్లు, 37 స్టంపింగ్లు ఉన్నాయి. ధోని, డీకే తర్వాత అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లలో వృద్దిమాన్ సాహా, రిషబ్ పంత్, రాబిన్ ఉతప్ప తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లు..200 - MS ధోని (CSK/RPS) - 153 క్యాచ్లు, 47 స్టంపింగ్లు174 - దినేష్ కార్తీక్ (DD/RCB/KKR/GL/MI/KXIP) - 137 క్యాచ్లు, 37 స్టంపింగ్లు113 - వృద్ధిమాన్ సాహా (GT/SRH/PBKS/CSK/KKR) - 87 క్యాచ్లు, 26 స్టంపింగ్లు100 - రిషబ్ పంత్ (DC/LSG) - 76 క్యాచ్లు, 24 స్టంపింగ్లు90 - రాబిన్ ఉతప్ప (KKR/CSK/RR/MI/RCB/PWI) - 58 క్యాచ్లు, 32 స్టంపింగ్లుఓవరాల్గా కూడా ధోనిదే అగ్రస్థానంఓవరాల్గా చూసినా పొట్టి క్రికెట్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లలో ధోనినే మొదటి స్థానంలో ఉన్నాడు. యావత్ టీ20 ఫార్మాట్లో ధోని 316 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ధోని తర్వాత క్వింటన్ డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. డికాక్ తన టీ20 కెరీర్లో 307 డిస్మిసల్స్లో భాగమయ్యాడు.నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ధోని ఎట్టకేలకు కెప్టెన్గా రెండో విజయాన్ని సాధించాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కేకు ఈ సీజన్ల ఇది మూడో గెలుపు. ఈ గెలుపు వల్ల సీఎస్కేకు ఒరిగింది ఏమీ లేనప్పటికీ.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మాత్రం దెబ్బకొట్టింది. ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కడం అనుమానమే. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. టాప్-5లో ఉన్న గుజరాత్ (16), ఆర్సీబీ (16), పంజాబ్ (15), ముంబై (14), ఢిల్లీ (13) కేకేఆర్ కంటే మెరుగైన పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ సీజన్లో సీఎస్కేతో పాటు సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ పోటీ నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. లక్నో (10), కేకేఆర్ (11) కూడా నిష్క్రమణ అంచుల్లో ఉన్నాయి.నిన్నటి మ్యాచ్లో ధోని వికెట్కీపింగ్లోనే కాకుండా బ్యాటింగ్లోనూ రాణించి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కీపింగ్లో రఘువంశీ, నరైన్ను ఔట్ చేయడంలో భాగమైన ధోని.. ఛేదనలో కీలక సమయంలో సిక్సర్ కొట్టి తన జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ ఇన్నింగ్స్లో ధోని ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి, చివరి దాకా క్రీజ్లో నిలబడ్డాడు. ఫలితంగా సీఎస్కే సీజన్లో మూడో విజయం నమోదు చేసింది. -
పో.. పో!.. వరుణ్ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ
కోల్కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)కి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో మ్యాచ్లో అనుచిత ప్రవర్తనకు గానూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి మొట్టికాయలు వేసింది. మ్యాచ్ ఫీజులో ఇరవై ఐదు శాతం మేర కోత విధించింది.అంతేకాదు.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ వరుణ్ చక్రవర్తి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. ఐపీఎల్-2025లో భాగంగా కేకేఆర్ బుధవారం చెన్నైతో తలపడిన విషయం తెలిసిందే.రహానే రాణించినాసొంత మైదానం ఈడెన్ గార్డెన్స్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (11) విఫలం కాగా.. సునిల్ నరైన్ (26) ఫర్వాలేదనిపించాడు.వన్డౌన్లో వచ్చిన అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ (48) ఆడగా.. మనీశ్ పాండే (36 నాటౌట్), ఆండ్రీ రసెల్ (38) కూడా రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగలిగింది.చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు నూర్ అహ్మద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. పేసర్ అన్షుల్ కాంబోజ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడుఇక కేకేఆర్ విధించే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఆదిలోనే ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, డెవాన్ కాన్వే డకౌట్ కావడంతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ 31 పరుగులతో రాణించగా.. ఆరో స్థానంలో వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ దంచికొట్టాడు.కేవలం 25 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన బ్రెవిస్.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. అయితే, హాఫ్ సెంచరీతో జోరు మీదున్న ఈ సౌతాఫ్రికా చిచ్చర పిడుగును కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పెవిలియన్కు పంపాడు.వరుణ్ రౌండ్ ది వికెట్ బౌల్ చేయగా.. బ్రెవిస్ ముందుకు వచ్చి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లాంగాన్ మీదుగా వెళ్లిన బంతి రింకూ సింగ్ చేతిలో పడటంతో.. బ్రెవిస్ ఇన్నింగ్స్కు తెరపడింది. అత్యంత కీలకమైన ఈ వికెట్ తీసిన తర్వాత వరుణ్ చక్రవర్తి..‘‘ పో.. పో’’ అంటూ వేలు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.pic.twitter.com/vhf3iwOR8o— Knight Vibe Media (@Kkrmediareels) May 7, 2025 డీమెరిట్ పాయింట్ కూడా ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి వరున్ చక్రవర్తికి జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం వరుణ్ చక్రవర్తి లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని.. అందుకే అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది.ఇక బ్రెవిస్ విధ్వసంతో గెలుపు దిశగా వచ్చిన చెన్నై.. శివం దూబే (45), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(17 నాటౌట్) కారణంగా విజయతీరాలకు చేరింది. కేకేఆర్పై రెండు వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్లో మూడో గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. ఈ విజయంతో చెన్నైకి వరుస ఓటముల తర్వాత ఊరట లభించగా.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.చదవండి: అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాతే..: ధోనిElation for the men in yellow 🥳@ChennaiIPL make it 1⃣-1⃣ against #KKR in the season with a 2⃣ wicket win at Eden Gardens💛 Updates ▶ https://t.co/ydH0hsBFgS #TATAIPL | #KKRvCSK pic.twitter.com/6MTmj6NPMH— IndianPremierLeague (@IPL) May 7, 2025 -
అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాతే..: ధోని
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఒక్క విజయం.. ఒకే ఒక్క విజయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఊరట కలిగించింది. వరుస పరాజయాలు, పరాభవాల తర్వాత బుధవారం నాటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)పై గెలిచింది. తద్వారా ఈ సీజన్లో ఎట్టకేలకు మూడో గెలుపు నమోదు చేసింది. ఏదీ కలిసిరాలేదుఈ నేపథ్యంలో కేకేఆర్పై విజయానంతరం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ సీజన్లో మేము కొన్ని మ్యాచ్లో మాత్రమే గెలిచాం. ఇది మాకు మూడో విజయం. ఏదేమైనా గెలవడం సంతోషంగానే ఉంటుంది కదా!అయితే, ఈ ఏడాది మాకూ ఏదీ కలిసిరాలేదు. ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మా జట్టులో 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ల సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపైనే ప్రస్తుతం నా దృష్టి కేంద్రీకృతమై ఉంది.వచ్చే ఏడాదైనా సరైన సమాధానం లభిస్తుందని భావిస్తున్నాం. ఏ బ్యాటర్ను ఏ స్థానంలో పంపాలి.. ఎవరైతే పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేస్తున్నారన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’’ అని ధోని పేర్కొన్నాడు.అతడికి కృతజ్ఞతలుఅదే విధంగా.. ‘‘ఈ మ్యాచ్లో గెలుపునకు బ్రెవిస్ కారణం. అందుకు అతడికి కృతజ్ఞతలు. అతడి వల్లే ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. చక్కటి షాట్లతో బ్రెవిస్ అలరించాడు. అతడు బాదిన రెండు సిక్సర్ల వల్ల మాపై ఒత్తిడి తగ్గి విజయం దిశగా పయనం సాధ్యమైంది’’ అని ధోని సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ను ప్రశంసించాడు.అప్పుడే రిటైర్మెంట్ఇక తన ఐపీఎల్ భవితవ్యం గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాకిప్పుడు 43 ఏళ్లు. ఇప్పటికి చాలా ఏళ్లుగా నేను క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. అయితే, ఈ లీగ్లో నా చివరి సంవత్సరం ఏది అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేను.నిజానికి ఏడాదిలో కేవలం రెండు నెలలు మాత్రమే ఇక్కడ క్రికెట్ ఆడతాం. ఒక్కసారి ఐపీఎల్ ముగిసిపోతే మరో 6-8 నెలలు నాకు విశ్రాంతి దొరుకుతుంది. నా శరీరం ఎంత వరకు ఒత్తిడిని తట్టుకుందనే అంశం మీదే అంతా ఆధారపడి ఉంది. ఇప్పటికైతే రిటైర్మెంట్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకుల నుంచి లభించే ప్రేమ, ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అని ధోని పేర్కొన్నాడు.బ్రెవిస్ విధ్వంసం కాగా ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్తో మ్యాచ్లో టాస్ ఓడిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన రహానే సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లో నూర్ అహ్మద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో చెన్నైకి ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, డెవాన్ కాన్వే డకౌట్ అయ్యారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ఉర్విల్ పటేల్ 31 పరుగులతోరాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 52) అద్బుత అర్ధ శతకంతో చెలరేగాడు.ఆఖర్లో శివం దూబే (45), ధోని (17 నాటౌట్) రాణించడంతో.. చెన్నై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ సీజన్లో ఇప్పటికి 12 మ్యాచ్లు ఆడిన చెన్నైకి ఇది మూడో గెలుపు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ధోని సేన అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.ఐపీఎల్-2025: కోల్కతా వర్సెస్ చెన్నై👉వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా👉టాస్: కోల్కతా.. తొలుత బ్యాటింగ్👉కోల్కతా స్కోరు: 179/6 (20)👉చెన్నై స్కోరు: 183/8 (19.4)👉ఫలితం: రెండు వికెట్ల తేడాతో కోల్కతాపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నూర్ అహ్మద్ (చెన్నై స్పిన్నర్- 4/31).Last over maximums 🤝 MS Dhoni A never ending story 💛Updates ▶ https://t.co/ydH0hsBFgS #TATAIPL | #KKRvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/fyQcVOIusT— IndianPremierLeague (@IPL) May 7, 2025 -
IPL 2025: బ్రెవిస్ విధ్వంసం.. కేకేఆర్పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. డెవాల్డ్ బ్రెవిస్ (52) విధ్వంసకర ఇన్నింగ్స్తో తన జట్టును తిరిగి గెలుపు ట్రాక్లో పెట్టాడు. మధ్యలో దూబే (45) బాధ్యతాయుతంగా ఆడి సీఎస్కే విజయతీరాలవైపు మళ్లించాడు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన తరుణంలో అప్పటిదాకా కామ్గా ఉన్న ధోని (17 నాటౌట్) సిక్సర్ కొట్టి సీఎస్కేకు గెలుపుకు చేరువ చేశాడు. నాలుగో బంతికి కంబోజ్ బౌండరీ కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఈ గెలుపు వల్ల సీఎస్కేకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టింది. బ్రెవిస్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులువైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ శివాలెత్తిపోయాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లు సహా 30 పిండుకున్నాడు. ఈ ఒక్క ఓవర్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఓటమి ఖాయమనుకున్న సీఎస్కే ఒక్కసారిగా గెలుపు ట్రాక్లోకి వచ్చింది.బ్రెవిస్ 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. -
IPL 2025: కేకేఆర్పై సీఎస్కే విజయం
కేకేఆర్పై సీఎస్కే విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. డెవాల్డ్ బ్రెవిస్ (52) విధ్వంసకర ఇన్నింగ్స్తో తన జట్టును తిరిగి గెలుపు ట్రాక్లో పెట్టాడు. మధ్యలో దూబే (45) బాధ్యతాయుతంగా ఆడి సీఎస్కే విజయతీరాలవైపు మళ్లించాడు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన తరుణంలో అప్పటిదాకా కామ్గా ఉన్న ధోని (17 నాటౌట్) సిక్సర్ కొట్టి సీఎస్కేకు గెలుపుకు చేరువ చేశాడు. నాలుగో బంతికి కంబోజ్ బౌండరీ కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఈ గెలుపు వల్ల సీఎస్కేకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టింది. సీఎస్కే గెలవాలంటే 30 బంతుల్లో 40 పరుగులు చేయాలి15 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 140/6గా ఉంది. ధోని (3), దూబే (24) క్రీజ్లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన సీఎస్కే12.1వ ఓవర్- 11వ ఓవర్లో 30 పరుగులు రాబట్టిన బ్రెవిస్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రింకూ సింగ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్రెవిస్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులువైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ శివాలెత్తిపోయాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లు సహా 30 పిండుకున్నాడు. ఈ ఒక్క ఓవర్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఓటమి ఖాయమనుకున్న సీఎస్కే ఒక్కసారిగా గెలుపు ట్రాక్లోకి వచ్చింది. 11 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 123/5గా ఉంది. బ్రెవిస్ 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. దూబే 12 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సీఎస్కే5.2వ ఓవర్- సీఎస్కే 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రవీంద్ర జడేజా (19) క్లీన్ బౌల్డయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే4.6వ ఓవర్- 56 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో రఘువంశీకి క్యాచ్ ఇచ్చి అశ్విన్ (8) ఔటయ్యాడు.టార్గెట్ 180.. 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సీఎస్కే180 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్కే 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆయుశ్ మాత్రే, డెవాన్ కాన్వే డకౌట్ కాగా.. ఉర్విల్ పటేల్ 31 పరుగులకు ఔటయ్యారు. అశ్విన్ (4), జడేజా క్రీజ్లో ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 37/3గా ఉంది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, మొయిన్ అలీ, హర్షిత్ రాణా తలో వికెట్ తీశారు. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన కేకేఆర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నామమాత్రపు స్కోర్కు పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. రసెల్ ఔట్16.6వ ఓవర్- 149 పరుగుల వద్ద కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. డేంజరెస్గా కనిపిస్తున్న ఆండ్రీ రసెల్ (38) నూర్ అహ్మద్ బౌలింగ్లో బ్రెవిస్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 124/4రసెల్ 18, మనీశ్ పాండే 17 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. రహానే ఔట్12.2వ ఓవర్- 103 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి రహానే (48) ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 101/3రహానే (31 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్ పాండే (13 బంతుల్లో 14) క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్నూర్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి నరైన్ ఔట్ కాగా.. నాలుగో బంతికి రఘువంశీ (1) పెవిలియన్కు చేరాడు. నరైన్ను స్టంపౌట్ చేసిన ధోని, రఘువంశీ క్యాచ్ కూడా పట్టుకున్నాడు. 8 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 73/3గా ఉంది. రహానే (32), మనీశ్ పాండే (1) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ధాటిగా ఆడుతుంది. 7 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది.8వ ఓవర్ తొలి బంతికి నూర్ అహ్మద్ బౌలింగ్లో సునీల్ నరైన్ (26) స్టంపౌటయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్, సీఎస్కే తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ ఓ మార్పు చేసింది. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో మనీశ్ పాండే తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్కే ఈ మ్యాచ్లో ప్రయోగాల బాట పట్టింది. ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, అశ్విన్ తుది జట్టులోకి వచ్చారు.ఈ సీజన్లో సీఎస్కే కథ ముగిసిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్ల్లో రెండే విజయాలు సాధించింది.కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 5 విజయాలతో 11 పాయింట్లు సాధించింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ వచ్చింది. కేకేఆర్ ఈ మ్యాచ్తో కలుపుకుని ఆడాల్సిన మూడు మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.తుది జట్లు..కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే(c), అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తిఇంపాక్ట్ సబ్స్: హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, లువ్నిత్ సిసోడియా, అన్రిచ్ నోర్ట్జే, మయాంక్ మార్కండేచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే, ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, రవిచంద్రన్ అశ్విన్, MS ధోని(w/c), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానాఇంపాక్ట్ సబ్స్: శివమ్ దూబే, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్, దీపక్ హుడా -
టెస్టు మ్యాచ్ ఆడుతున్నారా?.. ఇప్పటికైనా పృథ్వీ షాను తీసుకోండి!
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆట తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో మ్యాచ్లో కనీస పోరాట పటిమ కనిపించలేదని.. సీఎస్కే చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన అని ఘాటుగా విమర్శించాడు. ఇప్పటికైనా మూస పద్ధతి, ముతక ఆట తీరుకు చరమగీతం పాడాలని సూచించాడు.వరుసగా ఐదు ఓటములుకాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో సీఎస్కే పరాజయ పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గెలుపొందిన చెన్నై జట్టుకు.. ఆ తర్వాత విజయమే కరువైంది. వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓటమి పాలైన సీఎస్కే.. శుక్రవారం కేకేఆర్ చేతిలోనూ పరాజయాన్ని చవిచూసింది.సొంత మైదానం చెపాక్లో ఈ సీజన్లో వరుసగా మూడో ఓటమిని నమోదు చేసింది. ఒక ఐపీఎల్ సీజన్లో చెన్నై ఇలా వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోవడం.. తమకు కంచుకోటైన చెపాక్లో హ్యాట్రిక్ పరాజయాలు చవిచూడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సారథి, మాజీ చీఫ్ సెలక్టర్ సీఎస్కే తీరును ఎండగట్టాడు.పృథ్వీ షాను తీసుకోండి‘‘సీఎస్కే చరిత్రలోనే ఇదొక చెత్త ఓటమి. పవర్ ప్లేలో అయితే.. ఏదో టెస్టు మ్యాచ్కు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆడారు. ప్రతి ఒక్కరు అదే తీరు. సమయం మించిపోతోంది. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన పృథ్వీ షా వంటి ఆటగాళ్లను ఎందుకు తీసుకోకూడదు?!ఇలాంటి సమయంలో అలాంటి వాళ్లే అవసరం. ఈ విషయం గురించి మీరు ఎందుకు ఆలోచించరు?.. లేదా ఇలాంటి గందరగోళం, పేలవమైన ఆట తీరు కూడా వ్యూహంలో భాగమే అంటారా?’’ అంటూ చిక్కా ఓ వైపు సూచనలు ఇస్తూనే.. మరోవైపు.. సీఎస్కే నాయకత్వ బృందానికి చురకలు అంటించాడు.మహేంద్ర సింగ్ ధోని మరోసారికాగా ఈ సీజన్లో ఐదు మ్యాచ్లకు సారథ్యం వహించిన సీఎస్కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్తో మ్యాచ్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని మరోసారి కెప్టెన్సీ చేపట్టాడు. టోర్నీలో మిగిలిన మ్యాచ్లలో అతడే సీఎస్కేను ముందుండి నడిపించనున్నాడు.మరోవైపు.. ఒకప్పుడు స్టార్గా వెలుగొందిన ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. క్రమశిక్షణా రాహిత్యం, వరుస వైఫల్యాల కారణంగా ప్రస్తుతం కఠిన దశను ఎదుర్కొంటున్నాడు. జాతీయ జట్టుకు ఎప్పుడో దూరమైన పృథ్వీ.. ఐపీఎల్-2025 మెగా వేలంలోనూ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.రూ. 75 లక్షల కనీస ధరఒకప్పుడు కోట్లు పలికిన ఈ ఆటగాడు రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చినా పది ఫ్రాంఛైజీలలో ఒక్కటీ పృథ్వీ షాను పట్టించుకోలేదు. అయితే, తనదైన రోజున అద్భుతంగా ఆడే ఈ ఓపెనింగ్ బ్యాటర్ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని.. క్రిష్ణమాచారి సీఎస్కేకు సూచించడం గమనార్హం.కాగా పృథ్వీ షా ఐపీఎల్లో ఇప్పటి వరకు ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడి 1892 పరుగులు చేశాడు. చివరగా 2024లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం -
KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో తమ ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గెలుపొందిన ఈ ఫైవ్ టైమ్ చాంపియన్.. ఆ తర్వాత పరాజయ పరంపర కొనసాగిస్తోంది. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.తద్వారా ఈ సీజన్లో వరుసగా ఐదు పరాజయాలు నమోదు చేసింది. సీఎస్కే చరిత్రలో ఇలాంటి పరాభవం ఇదే తొలిసారి. అది కూడా చెన్నైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథ్యంలో ఈ చేదు అనుభవం ఎదుర్కోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీఎస్కే ఆట తీరు, ధోని కెప్టెన్సీ తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి తీవ్రంగా విమర్శించాడు.ప్రత్యర్థి తెలివిగా ఆడితే.. వీరు మాత్రందిగ్గజ ఆటగాడు, కెప్టెన్ అయిన ధోని నుంచి ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదని.. అసలు వాళ్లకు మెదడు పనిచేయడం మానేసిందా అన్నట్లుగా మ్యాచ్ సాగిందని మనోజ్ తివారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్పై ప్రత్యర్థి తెలివిగా ఆడి గెలుపొందితే.. చెన్నై జట్టు మాత్రం తెల్లముఖం వేసిందని ఎద్దేవా చేశాడు.‘‘సీఎస్కే పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ముఖ్యంగా గత మూడు- నాలుగు మ్యాచ్లలో వారి ప్రదర్శన మరీ నాసిరకంగా ఉంది. ఆటగాళ్ల షాట్ల ఎంపిక చెత్తగా ఉంటోంది. గత 20- 25 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న వాళ్లకు కూడా ఏమైంది?అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా?అసలు వారి ప్రణాళికలు ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. మీ జట్టులో ప్రస్తుత పర్పుల్ క్యాప్ విజేత నూర్ అహ్మద్ ఉన్నాడు. కానీ అతడిని మీరు ఎప్పుడు బౌలింగ్కు పంపించారో గుర్తుందా? ఎనిమిదో ఓవర్.. అవును ఎనిమిదో ఓవర్..ప్రత్యర్థి జట్టులోని సునిల్ నరైన్ తన తొలి బంతికే వికెట్ తీసిన విషయం మీకు తెలియదా? దీనిని బట్టి పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందనే అంచనా రాలేదా? అలాంటపుడు మీ పర్పుల్ క్యాప్ విజేతను ముందుగానే ఎందుకు బౌలింగ్కు పంపలేదు?సాధారణంగా ధోని ఇలాంటి పొరపాట్లు చేయడు. చాలా ఏళ్లుగా అతడిని గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి తప్పు అయితే ఎన్నడూ చేయలేదు. కానీ ఈరోజు ఏమైంది? ఓటమి తర్వాతనైనా మీరు పొరపాట్లను గ్రహిస్తారనే అనుకుంటున్నా.అసలు మెదడు పనిచేస్తోందా?!మామూలుగా అయితే, అశ్విన్ లెఫ్టాండర్లకు రౌండ్ ది స్టంప్స్ బౌల్ చేస్తాడు. కానీ ఈరోజు అతడు కూడా ఓవర్ ది స్టంప్స్ వేశాడు. ధోని వంటి అనుభవజ్ఞుడైన, దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఉన్న జట్టులో ఇదేం పరిస్థితి? వాళ్లు మెదళ్లు పనిచేయడం ఆగిపోయాయా?’’ అంటూ మనోజ్ తివారి క్రిక్బజ్ షోలో సీఎస్కే, ధోనిపై విమర్శల వర్షం కురిపించాడు.కాగా చెపాక్లో కేకేఆర్తో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. కోల్కతా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులే చేసింది. స్పిన్నర్లు సునిల్ నరైన్ మూడు, వరుణ్ చక్రవర్తి రెండు, మొయిన్ అలీ ఒక వికెట్ తీయగా.. పేసర్లు వైభవ్ అరోరా ఒకటి, హర్షిత్ రాణా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ధనాధన్.. 10.1 ఓవర్లలోనే ఇక సీఎస్కే బౌలింగ్ అటాక్ను పేసర్ ఖలీల్ అహ్మద్ ఆరంభించగా.. స్పిన్నర్ నూర్ అహ్మద్ను ఎనిమిదో ఓవర్లో రంగంలోకి దింపారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నూర్ తన ఓవర్లో కేవలం రెండు పరుగులే ఇచ్చినా.. మరో రెండు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ గెలుపు ఖరారైంది.సీఎస్కే విధించిన 104 పరుగుల లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి కేకేఆర్ పూర్తి చేసింది. ఓపెనర్లలో క్వింటన్ డికాక్ (23) రాణించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సునిల్ నరైన్ మెరుపు ఇన్నింగ్స్ (18 బంతుల్లో 44) ఆడాడు. కెప్టెన్ అజింక్య రహానే (17 బంతుల్లో 20).. రింకూ సింగ్ (12 బంతుల్లో 15)తో కలిసి కేకేఆర్ను గెలుపుతీరాలకు చేర్చాడు.చదవండి: వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని Game set and done in a thumping style ✅@KKRiders with a 𝙆𝙣𝙞𝙜𝙝𝙩 to remember as they secure a comprehensive 8️⃣-wicket victory 💜Scorecard ▶ https://t.co/gPLIYGiUFV#TATAIPL | #CSKvKKR pic.twitter.com/dADGcgITPW— IndianPremierLeague (@IPL) April 11, 2025 -
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వరుస పరాజయాలతో చతికిలపడ్డ సీఎస్కే.. తాజాగా మరో ఓటమిని చవిచూసింది. కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో శుక్రవారం నాటి మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి వరుసగా ఐదో ఓటమితో పాటు.. సొంత మైదానం చెపాక్లో హ్యాట్రిక్ పరాజయాన్ని నమోదు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కాగా.. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సీఎస్కేను ముందుండి నడిపించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.పూర్తిగా విఫలమైపోయాంఅయితే, కెప్టెన్గా పునరాగమనం చేసిన వేళ ధోనికి ఇలా ఊహించని, ఘోర పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందిస్తూ.. ‘‘గత కొన్ని రోజులుగా మాకు ఏదీ కలిసి రావడం లేదు. మా ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటిని అంగీకరించకతప్పదు.ఈరోజు మేము స్కోరు బోర్డుపై సరిపడా పరుగులు నింపలేకపోయాం. గత మ్యాచ్లలో రెండో ఇన్నింగ్స్లో మేము తడబడ్డాం. కానీ ఈసారి తొలి ఇన్నింగ్స్లోనే మేము దారుణంగా విఫలమయ్యాం. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమైపోయాం.పవర్ ప్లేలో 31 పరుగులు మాత్రమే వచ్చాయన్నది వాస్తవం. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటానికే ప్రాధాన్యం ఇస్తాం. గత రెండు మ్యాచ్లలో మీరు ఈ విషయం గమనించే ఉంటారు. మా బలాలు ఏమిటో మాకు తెలుసు. అందుకు అనుగుణంగానే మేము ఆడతాం.వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడాఇతరులను అనుకరిస్తూ.. వారితో పోటీ పడుతూ.. వారిలాగానే ఆడాలనుకోవడం సరికాదు. స్కోరు బోర్డును చూస్తూ పవర్ప్లేలో అరవై పరుగులు చేయాలనే ఆతురత ఒత్తిడిని పెంచుతుంది. మా ఓపెనర్లు అచ్చమైన క్రికెట్ షాట్స్ ఆడతారు. పరిధులు దాటి హిట్టింగ్ మాత్రమే ఆడాలనే దృక్పథం మాకు లేదు. మాకు అది చేతకాదు కూడా.భాగస్వామ్యాలు నెలకొల్పుతూ మధ్య ఓవర్ల సమయానికి పటిష్ట స్థితిలో ఉండాలని భావిస్తాం. ఒకవేళ ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే మిడిలార్డర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకుంటుంది. మా ప్రణాళికలు ఇలాగే ఉంటాయి’’ అని ధోని పేర్కొన్నాడు. కాగా సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత ధోనికి ఉంది. కానీ ఇప్పుడిలా చేదు అనుభవం ఎదుర్కోవడంతో తాము తీవ్ర నిరాశకు గురైనట్లు తలా తెలిపాడు.103 పరుగులు మాత్రమేకాగా చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాపార్డర్లో ఓపెనర్లు రచిన్ రవీంద్ర (4), డెవాన్ కాన్వే (12).. వన్డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (16) మూకుమ్మడిగా విఫలమయ్యారు.మిడిల్లో విజయ్ శంకర్ (21 బంతుల్లో 29), శివం దూబే (29 బంతుల్లో 31) ఫర్వాలేదనిపించగా.. అశ్విన్ (1), రవీంద్ర జడేజా (0), దీపక్ హుడా (0), కెప్టెన్ ధోని (1) తీవ్రంగా నిరాశపరిచారు. కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు సునిల్ నరైన్ మూడు, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లతో అదరగొట్టగా.. మొయిన్ అలీ కాన్వే రూపంలో కీలక వికెట్ దక్కించుకున్నాడు.10.1 ఓవర్లలోనే ఫినిష్పేసర్లలో వైభవ్ అరోరా ఒకటి, హర్షిత్ రాణా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక సీఎస్కే విధించిన స్పల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (16 బంతుల్లో 23), సునిల్ నరైన్ (18 బంతుల్లో 44) రాణించగా.. కెప్టెన్ అజింక్య రహానే (17 బంతుల్లో 20), రింకూ సింగ్ (12 బంతుల్లో 15) కలిసి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. చదవండి: SRH vs PBKS: సన్రైజర్స్కో విజయం కావాలి! Game set and done in a thumping style ✅@KKRiders with a 𝙆𝙣𝙞𝙜𝙝𝙩 to remember as they secure a comprehensive 8️⃣-wicket victory 💜Scorecard ▶ https://t.co/gPLIYGiUFV#TATAIPL | #CSKvKKR pic.twitter.com/dADGcgITPW— IndianPremierLeague (@IPL) April 11, 2025 -
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
ఐపీఎల్-2025 (IPL 2025)లో వరుస పరాజయాలతో చతికిల పడ్డ చెన్నై సూపర్ కింగ్స్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మరోసారి నాయకుడిగా వ్యవహరించనున్నాడు.కోల్కతా నైట్ రైడర్స్తో శుక్రవారం జరిగే మ్యాచ్ సందర్భంగా ధోని సీఎస్కే తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సొంత మైదానం చెపాక్లో సీఎస్కే ఆటగాళ్లు ప్రాక్టీస్లో తలమునకలయ్యారు. ఇక ధోని సైతం నెట్స్లో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా శ్రమించాడు.ఆ సమయంలో కేకేఆర్ మెంటార్ డ్వేన్ బ్రావో మైదానంలోకి వచ్చి సీఎస్కే ఆటగాళ్లను పలకరించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా అతడికి ఎదురువెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ద్రోహి వచ్చేశాడు చూడండిఇంతలో నెట్స్లో ఉన్న ధోని మాత్రం.. బ్రావోను చూసి.. ‘‘ఇదిగో.. ద్రోహి వచ్చేశాడు చూడండి’’ అంటూ తనదైన శైలిలో స్వాగతం పలికాడు. ఇందుకు.. ‘‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. చాలా చిత్రమైనది’’ అని బ్రావో బదులిచ్చాడు. నవ్వుతూ వెళ్లి ధోని హగ్ చేసుకున్నాడు. ఆ వైబ్ను మిస్సవుతున్నాంఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ఎంఎస్- డీజే.. ఆ వైబ్ను మిస్సవుతున్నాం’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇక ఈ వీడియోను చూసి సీఎస్కే అభిమానులు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. బ్రావో చెన్నై ఫ్రాంఛైజీని వీడి వెళ్తాడని అస్సలు ఊహించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.సీఎస్కేతో సుదీర్ఘ బంధంకాగా వెస్టిండీస్కు చెందిన డ్వేన్ బ్రావో 2011- 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ 2018- 2022 మధ్య కాలంలో ఈ కరేబియన్ ఆల్రౌండర్ సీఎస్కేకు ఆడాడు. 2011, 2018, 2021, 2022లో ట్రోఫీ గెలిచిన చెన్నై జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.అంతేకాదు.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బ్రావో 2023లో బౌలింగ్ కోచ్గా చెన్నై జట్టుకు సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో చెన్నై ముఖచిత్రం, కర్త, కర్మ, క్రియ అయిన ధోనితో బ్రావోకు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే, 2025 సీజన్ ఆరంభానికి ముందు పరిస్థితులు మారిపోయాయి.గౌతం గంభీర్ స్థానంలోసీఎస్కేను వీడిన తర్వాత బ్రావో.. కేకేఆర్ ఫ్రాంఛైజీతో జట్టుకట్టాడు. గౌతం గంభీర్ స్థానంలో డిఫెండింగ్ చాంపియన్ మెంటార్గా బాధ్యతలు చేపట్టాడు. ఇక సీఎస్కే- కేకేఆర్ మధ్య శుక్రవారం మ్యాచ్ నేపథ్యంలో చెన్నై ఆటగాళ్లను కలవగా ధోని ఇలా సరదాగా స్పందించడం విశేషం.కాగా 41 ఏళ్ల పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్రావో ఐపీఎల్లో 161 మ్యాచ్లు ఆడి 183 వికెట్లు తీశాడు. అదే విధంగా.. 1560 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో కేకేఆర్ అజింక్య రహానే కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడి కేవలం రెండే గెలిచింది. మరోవైపు.. సీఎస్కే ఆడిన ఐదింట.. గత నాలుగు మ్యాచ్లలోనూ ఓటమిపాలైంది.చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది!MS🫂DJ : MISS THIS VIBE! 💛✨#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/IlSd876zes— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2025