-
అధికారం చేతిలో ఉంటే ఇంత దారుణమా...?
సాక్షి, కందుకూరు (ప్రకాశం): ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, అడ్డుకున్న వారిపై దాడులకు దిగుతున్నారు. శనివారం పట్టణంలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. వార్డుల్లో సర్వే చేస్తున్న ఇద్దరు యువకులను వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడ్డుకోవడం, వారిని ఆర్డీఓకు అప్పగించేందుకు తీసుకురావడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తలు పెరిగి ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. సాక్షాత్తు పోలీసుల సాక్షిగా టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పోతుల రామారావు తమ్ముడు ప్రసాద్ వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీపై దాడికి యత్నించాడు. చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. విషయం తెలిసి వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఇదీ..జరిగింది టంగుటూరుకు చెందిన ఇద్దరు యువకులు శనివారం ఉదయం పట్టణంలోని 17వ వార్డు అజ్మల్ హుస్సేన్ హాస్పటల్ ఏరియాలో తెలుగుదేశం పార్టీ తరఫున సర్వే చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి పేర్లు సేకరించడంతో పాటు సమస్యలు అడగడం అలాగే పోస్టల్ బ్యాలెట్లు ఎవరు ఉన్నారు అనే తదితర సమాచారాన్ని సేకరిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సామాన్య ప్రజలతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడికి చేరుకుని యువకులను నిలదీశారు. సర్వేలు ఎందుకు చేస్తున్నారు.. ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం సర్వేలు చేయడం నిషిద్ధమని వారిని ఎన్నికల అధికారి అయిన ఆర్డీఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆర్డీఓకి అప్పగించేందుకు ప్రయత్నించారు. ఈ లోపు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అక్కడికి చేరుకున్నారు. తమ కార్యకర్తలను ఎందుకు తీసుకొచ్చారంటూ వైఎస్సార్ సీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. సర్వే చేస్తుంటే తీసుకొచ్చామంటూ వైఎస్సార్ సీపీ నాయకులు సమాధానం చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీతో పాటు మరికొంత మంది కార్యకర్తలు అక్కడ ఉన్నారు. టీడీపీ వైపు నుంచి ఎమ్మెల్యే పోతుల రామారావు సోదరుడు పోతుల ప్రసాద్, ఉన్నం వీరాస్వామి, ఉప్పుటూరి శ్రీనివాసరావు, కళ్యాణ్ తదితరులు తమ అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. చంపుతానంటూ రఫీకి బెదిరింపులు వైఎస్సార్ సీపీ నేతలపై దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు తీవ్ర బెదిరింపులకు దిగారు. స్వయంగా ఎమ్మెల్యే పోతుల రామారావు సోదరుడు పోతుల ప్రసాద్ వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీపైకి దూసుకెళ్లారు. వేలు చూపుతూ చంపుతానంటూ బెదిరింపులకు దిగాగు. ఇదే సమయంలో అక్కడ ఉన్న సీఐ, ఎస్ఐలు, పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఓ మైనార్టీ నాయకుడిని చంపుతానంటూ బెదిరింపుకు దిగడంపై నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నా పట్టించుకోవడం లేదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసుస్టేషన్కు చేరుకుని టీడీపీ నాయకుల బెదిరింపులపై ఫిర్యాదు చేశారు. కందుకూరులో పాత రోజులు పునరావృతం అవుతున్నాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయినప్పడు ఆ పార్టీ నేతలు వివిధ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడిన విషయాన్ని ఇప్పటికి సామాన్యులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు చేయడం, తాయిలాలు ఎరవేయడం వంటి నీచమైన పనులకు తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. పక్క నియోజకవర్గం కొండపి, టంగుటూరు ప్రాంతాలకు చెందిన యువకులను ఇక్కడికి తీసుకొచ్చి సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతున్నారు. ఎటువంటి సర్వేలు చేసేందుకు వీల్లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నా ఉల్లంఘించి మరీ సర్వేలు చేస్తున్నారు. అయినా ఎన్నికల అధికారులు పట్టించుకుంటున్న పాపాన లేదు. ఇటువంటి గొడవలకు పరోక్షంగా వారే కారణం అవుతున్నారు. ఎమ్మెల్యేనే సర్వే చేయమన్నారు.. పట్టుబడిన ఇద్దరు యువకులు మాట్లాడారు. తాము తెలుగుదేశం పార్టీ తరఫున సర్వే చేస్తున్నామని అంగీకరించారు. టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పోతుల రామారావే సర్వే చేయమంటే చేస్తున్నామని ఒప్పుకున్నారు. వాళ్లు చెప్పిన ప్రకారం ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. వార్డుల్లో సమస్యలు అడగడంతో పాటు వారి ఫోన్ నంబర్లు తీసుకుంటున్నామన్నారు. పోస్టల్ బ్యాలెట్ల వివరాలు కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు. కొన్ని ఇళ్లు సర్వే చేసిన తర్వాత తమను పట్టుకుని ఆర్డీఓ కార్యాలయానికి తీసుకొచ్చారని అందరి ముందు తలలు దించుకుని సమాధానం చెప్పారు. -
ఎమ్మెల్యేపై దాడి.. పరిస్థితి విషమం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో అధికార పీడీపీ ఎమ్మెల్యేపై దాడి జరిగింది. తప్పించుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యేను ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పుల్వామా ఎమ్మెల్యే మహ్మద్ ఖలీద్ బంధ్ ఆదివారం రాత్రి శ్రీనగర్ వెళ్తుండగా ఆయన కారుపై ఆందోళనకారులు రాళ్లతో దాడిచేశారు. దాడి నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ కారును వేగంగా నడిపాడు. దీంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఖలీద్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆర్మీ ఆస్పత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు. పలువురు అధికారపార్టీ నేతలపై ఆందోళనకారులు దాడులకు దిగుతున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం గడిచిన 11 రోజులుగా ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా 3,100 మంది గాయపడ్డారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement