crossroads
-
నేటి నుంచి ఉప్పల్ చౌరస్తా బంద్
హైదరాబాద్: ప్రతిరోజూ అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను ఆదివారం నుంచి మూసివేయనున్నారు. ఇక్కడి విద్యుత్ జంక్షన్ సమీపంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రింగ్రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు శనివారం అధికారులు ప్రకటించారు. వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనా హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్, ఐఓíసీ, చెంగిచర్ల మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాలి. చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాం«ధీ పార్కు నుంచి లిటిల్ ఫ్లవర్ వెనక నుంచి వరంగల్ రహదారికి చేరుకోవచ్చు. అలాగే.. బోడుప్పల్ నుంచి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద భగాయత్ లే అవుట్ నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్లు 812, 813 నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జీ కిందుగా యూ టర్న్ తీసుకుని ఉప్పల్ వైపు రావాల్సి ఉంటుందని జోనల్ కమిషనర్ రాధిక గుప్తా సూచించారు. ప్రస్తుతం ఉప్పల్ జోనల్ కార్యాలయం పక్కన ఉన్న వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట బస్సుల స్టాప్ను తాత్కాలికంగా నల్ల చెరువు కట్ట సమీపానికి మార్చినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట వెళ్లే ప్రయాణికులంతా నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాప్ నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. -
ఇన్సూరెన్స్ మార్కెట్లో ఎందుకింత ఒత్తిడి?
డిజిటల్ స్వీకరణ, నియంత్రణ మార్పులు, విదేశీ పెట్టుబడులు భారత బీమా రంగాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. అయాన్ (Aon) విడుదల చేసిన ‘గ్లోబల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఇన్సైట్స్ రిపోర్ట్’ ప్రకారం.. కొన్ని విభాగాల్లో కొనుగోలుదారులకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, సైబర్, ప్రాపర్టీ బీమాల్లో ఒత్తిడి పెరుగుతోంది.చాలా బీమా విభాగాలు ఇప్పటికీ “సాఫ్ట్ మార్కెట్”లో ఉన్నాయి. అంటే పోటీ ధరలు విస్తృత కవరేజ్ లభిస్తున్నాయి. అయితే, సైబర్ బీమాలో క్లెయిమ్స్ సంఖ్య, వ్యయం గణనీయంగా పెరగడంతో బీమా సంస్థలు కఠిన అండరైటింగ్ విధానాలు, అధిక డిడక్టిబుల్స్ అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ, భారతదేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటలైజేషన్ కారణంగా సైబర్ బీమా అత్యధిక వృద్ధి అవకాశాలు కలిగిన రంగంగా మారింది.ప్రాపర్టీ బీమాలో 2025లో అమలులోకి వచ్చిన క్వాసీ-టారిఫ్ ధర విధానాలు డబుల్ డిజిట్ ప్రీమియం పెరుగుదలకు దారితీశాయి. దీంతో ఖర్చు తగ్గించుకునే అవకాశాలు కొనుగోలుదారులకు తగ్గాయి. మరిన్ని రీ-ఇన్సూరెన్స్ సంస్థలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, ఈ విభాగంలో అస్థిరత కొనసాగనుంది.ఇదిలా ఉండగా, భారత బీమా మార్కెట్లో సామర్థ్యం పెరుగుతోంది. కొత్త బీమా సంస్థలు, విదేశీ రీ-ఇన్సూరర్లు ప్రవేశించడం, అలాగే బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల పోటీ, ఆవిష్కరణలు పెరిగాయి.ఈ పరిణామాలపై స్పందించిన అయాన్ ఇండియా చీఫ్ బ్రోకింగ్ ఆఫీసర్ శాంతనూ సక్సేనా.. “2025లో భారత బీమా మార్కెట్ వేగంగా ఎదుగుతున్న, అవకాశాలతో నిండిన వాతావరణాన్ని చూపిస్తోంది. ఇది కొనుగోలుదారులకు మరింత ఎంపికలను అందిస్తోంది” అని పేర్కొన్నారు. -
మళ్లీ క్రాస్రోడ్స్ చదివితే...
‘మీరు డ్రింక్స్ తాలూకు సువాసననీ... చల్లదనాన్నీ... అవి మీ శరీరంలోకి మెల్లగా ప్రవేశించే విధానంలోని డెలికేట్ ఫీలింగ్ని పూర్తిగా ఎంజాయ్ చెయ్యాలి’ అంటాడు నజఫ్ అలీఖాన్ తన కొడుకు, ఇంకా అతని పదిహేనుమంది మిత్రులను ఉద్దేశించి ‘లిక్కర్ లెసన్’ కథలో. ప్రతి కథ అని కాదు కానీ కొన్ని కథలకు ఒక సువాసన వుంటుంది. చల్లదనమో వెచ్చదనమో ఒక గుణం వుంటుంది. అది మీ శరీరంలోకో, మనస్సులోకో, నరనరానికో అలా ఎక్కిపోతుంది. మీ మనసుకు, వుంటే ఆత్మకు హాయినిస్తుంది. దాని కిక్కు చాలాకాలం మనుతుంది కూడా. అది గొప్ప కథ చేసే పని అని నాకనిపిస్తుంది. ఇరవై సంవత్సరాల క్రితం నేను ఇరవైలలో వున్నప్పుడు చదివిన కథాసంకలనం కె.సదాశివరావు ‘క్రాస్రోడ్స్’. ఇరవై సంవత్సరాల లంబీ గ్యాప్ తరువాత ఇప్పుడు కొత్త రూపుతో కొత్తగా చేతికొచ్చింది క్రాస్రోడ్స్. నా నలబైలలో ఇప్పుడు ఈ కథలు చదువుతుంటే ఆ ఇరవైల్లోని ఆనందమే మళ్లీ కొత్తగా అందుతోంది. పాత హాయిని జ్ఞప్తికి తెస్తోంది. సదాశివరావు కథలు మళ్లీ చదువుతుంటే అల్లం శేషగిరిరావును చదువుతున్నంత ఆనందం వేస్తున్నది. మధురాంతకం రాజారాంని చదివినంత హాయిదనం కూడా వేస్తున్నది. ఒక మధ్యలో అయితే భరాగో సరదా సంబరం కూడా. ఆ పై పూర్ణచంద్ర తేజస్వి వాక్యాల వెంట నడిచినంత సునాయాసం కూడా. సంవత్సరానికో, ఆర్నెళ్లకో ఒకే ఒక మంచి కథ కూడా దొరకని కరువుకాలంలో ఈ కథా సంకలనం అంటే థేంక్యూ సదాశివరావుగారు అన్నమాట. అన్వర్ (‘క్రాస్రోడ్స్’తో పాటు, కె.సదాశివరావు ఇతర పుస్తకాలు ‘ఆత్మాఫాక్టర్’(సైన్స్ ఫిక్షన్ కథలు), ‘పాలపుంత’ (నోబెల్ సాహిత్య వ్యాసాలు), ‘కావ్యకళ’ (అనువాద కవితలు) కొత్తగా మళ్లీ వచ్చాయి, ‘ఎమెస్కో’ ద్వారా.)


