breaking news
Credit rating organization
-
భారత్ క్రెడిట్ రేటింగ్కు సవాళ్లు
భారత్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు 2025లో క్రెడిట్ రేటింగ్కు సవాళ్లను విసిరే అవకాశం ఉందని మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే అమెరికా–చైనా సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు భారత్ ఎకానమీకి కలిసి వచ్చే వీలుందని కూడా నివేదిక వివరించింది. ఆసియా పసిఫిక్ సావరిన్స్పై రేటింగ్స్ దిగ్గజం నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే..వృద్ధి – ద్రవ్యోల్బణం మధ్య సమతౌల్యం ఏర్పడుతోంది. ప్రపంచ, ప్రాంతీయ ఆర్థిక పరిస్థితుల్లో కొంత సరళతర పరిణామాలు నెలకొన్నాయి. భారత్ దేశీయ డిమాండ్కు ఆయా అంశాలు బలాన్ని చేకూర్చుతున్నాయి. అమెరికా ప్రతిపాదిత వాణిజ్య రక్షణాత్మక చర్యలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఎకానమీ ఉత్పత్తి విస్తృత స్థాయిలో బలహీనపరవచ్చు. భారత్లో ద్రవ్యలోటు సవాళ్లు క్రమంగా తగ్గుముఖం పడతాయని మేము విశ్వసిస్తున్నాం. మూడీస్ బీఏఏ– రేటింగ్లో ఉన్న తోటి దేశాలతో పోలి్చతే భారత్ రుణ పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో రెవెన్యూ పెరిగినప్పటికీ సవాళ్లు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: ఐపీవోకు ఆరు కంపెనీలు రెడీతైవాన్ జలసంధి లేదా కొరియన్ ద్వీపకల్పంలో సైనిక సంఘర్షణల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు ఆసియా పసిఫిక్ ప్రాంతంపై ప్రతికూలత చూపుతాయి.ఈ ఉద్రిక్తతలు వాణిజ్యం, పెట్టుబడిఅంశాలపైప్రభావ చూపిస్తాయి. వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడులను అమెరికా కఠినతరం చేస్తే, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడవచ్చు. ఇది ప్రాంతీయ వృద్ధిని దెబ్బతీయవచ్చు. అయితే ఇది భారత్, కొన్ని ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది.భౌగోళిక, ప్రాంతీయ రాజకీయ సవాళ్లు పలు దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలా లేక ద్రవ్య లోటు కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలా? అన్న అంశాలపై ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. -
బిల్లులతో రేటింగ్కు సంబంధం లేదు
► చెల్లింపుల్ని రేటింగ్లో చేర్చటం ఇంకా చర్చల్లోనే ఉంది ► క్రెడిట్ కార్డులు, గృహ రుణాలకు డి మాండ్ పెరిగింది ► సిబిల్ రిపోర్ట్తో రిటైల్ రుణాల్లో డిఫాల్టర్స్ తగ్గారు ► సిబిల్ సీనియర్ వీపీ హర్షలా చందోర్కర్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : క్రెడిట్ స్కోర్ లెక్కించడంలో టెలిఫోన్, మొబైల్, విద్యుత్, బీమా, వాటర్ వంటి బిల్లుల చెల్లింపులను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదని క్రెడిట్ రేటింగ్ సంస్థ సిబిల్ స్పష్టం చేసింది. ఈ చెల్లింపులను పరిగణనలోకి తీసుకోవాలన్న అంశం ఇంకా చర్చల దశలోనే ఉందని, దీనికి ఇంకా నియంత్రణ సంస్థల నుంచి అనుమతి రావాల్సి ఉందని సిబిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్షలా చందోర్కర్ తెలిపారు. క్రెడిట్ రేటింగ్ ఇవ్వడంలో కేవలం క్రెడిట్ కార్డులు, రుణాల చెల్లింపులను మాత్రమే ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. వ్యక్తిగత సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, బీమా పథకాలు క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేయలేవని తెలియజేశారు. ‘‘ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు గానీ, ఏ రకమైన రుణాలను గానీ తీసుకోకపోయి ఉంటే వారి గురించి సిబిల్ ఎలాంటి నివేదికా ఇవ్వదు’’ అని చందోర్కర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశీయ రుణాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించే నిమిత్తం గురువారమిక్కడ విలేకరులతో ఆమె మాట్లాడారు. గత నాలుగేళ్ళుగా గృహ, ఆటో రుణాలతో పాటు క్రెడిట్ కార్డుల వినియోగం కూడా దేశంలో పెరుగుతోందన్నారు. ‘గతేడాది తొలి 3 నెలల్లో 8 లక్షల క్రెడిట్కార్డులు జారీ అయ్యాయి. ఈ ఏడాది అదే సమయంలో 10.8 లక్షల కార్డులు జారీ అయ్యాయి. డిమాండ్ వృద్ధికి ఇదే నిదర్శనం’ అని చెప్పారామె. క్రెడిట్ కార్డులకు ముంబైలో డిమాండ్ అధికంగా ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లున్నాయని తెలియజేశారు. తగ్గుతున్న ఎన్పీఏలు బ్యాంకులు సిబిల్ రిపోర్ట్ ఆధారంగా రుణాలు ఇస్తుండటంతో ఎన్పీఏలు గణనీయంగా తగ్గుతున్నట్లు చందోర్కర్ చెప్పారు. బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో 80 శాతం క్రెడిట్ స్కోర్ 750 దాటినవే ఉండటంతో రుణ ఎగవేతలు బాగా తగ్గాయన్నారు. 2010లో క్రెడిట్ కార్డుల డిఫాల్టర్స్ శాతం 3.27 శాతం నుంచి 1.06 శాతానికి, గృహ రుణాల్లో డిఫాల్టర్లు 1.06 శాతం నుంచి 0.57 శాతానికి తగ్గినట్లు చెప్పారు. ఇప్పటి వరకు సిబిల్లో 22 కోట్లమంది ఖాతాదారులు ఉంటే, వీరు తీసుకున్న రుణాల సంఖ్య 40.6 కోట్లుగా ఉందన్నారు. ప్రస్తుతం సిబిల్ క్రెడిట్ డేటాను 1,400 సంస్థలు వినియోగించుకుంటున్నాయని ఆమె వెల్లడించారు.