breaking news
Comprehensive family survey-2014
-
కిక్కిరిసిన బస్టాండ్
నిజామాబాద్ నాగారం: సమగ్ర సర్వే సందర్భంగా చాలా మంది స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా బస్సులు కేటాయించకపోవడంతో ప్రయాణికులు అష్టాకష్టాలు పడుతూ గమ్యాలను చేరుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, ముం బాయి, కరీంనగర్ తదితర ప్రాంతాలలో ఉన్న జిల్లా వా సులు ఇంటి దారి పట్టారు. దీంతో శనివారం నుంచి వన్ వే నడుస్తోంది. అంటే, ప్రయాణికులు అక్కడి నుంచి ఇక్కడి వస్తున్నారు. తప్పితే ఇక్కడి నుంచి అటు వెళ్లేవారి సంఖ్య నామమాత్రంగా ఉంది. మాములు రోజులలో నడిచే వాహనాలలోనే జనం నిండుగా ఉండేవారు. ఇపుడు మరింత రద్దీ పెరిగిపోయింది. హైదరాబాద్కు ‘పల్లెవెలుగు’ సర్వే పుణ్యమా అని పల్లె వెలుగు బస్సులు ఎక్స్ప్రెస్గా మారాయి. ప్రతి డిపో నుంచి పల్లె వెలుగు బస్సులను హైదరాబాద్కు పంపిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారిని సొంత గ్రామాలకు త్వరగా చేర్చడానికే పల్లెవెలుగు బస్సులు వేశామని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు. ఇంద్ర, గరుడ, సూ పర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్కు నడుస్తున్నాయి. అయినా సరిపోకపోవడంతో పల్లెవెలుగు బస్సులు వేశారు. ప్రయాణికులు కూడా ఏ బస్సు అని ఆలోచన చేయడం లేదు. మన జిల్లా బస్సు ఉంది చాలు అంటూ ఎక్కేస్తున్నారు. తప్పని ఇక్కట్లు ప్రయాణికులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు. నిజామాబాద్ బస్టాండ్లో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రత్యేకంగా బస్సులు కేటాయిం చకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బస్సులు సరిపడా లేకపోవడంతో జనం ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. -
సమగ్ర కుటుంబ సర్వే-2014కు ఇంకా 24 గంటలు
ప్రగతినగర్: సమగ్ర కుటుంబ సర్వే-2014కు ఇంకా 24 గంటల సమయం మాత్రమే మిగిలింది. మంగళవారం జరిగే ఈ సర్వేలో జిల్లాలోని 6.25 లక్షల కుటుంబాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేయనున్నారు. ఇందుకోసం దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పది విభాగాలలో 80 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ప్రతి గ్రామానికి ఒక రూట్ ఆఫీసర్ను నియమించారు. వీరు మంగళవారం ఉదయం మెటీరియల్తో కూడిన కిట్ బ్యాగులను ఎన్యూమరేటర్లకు అందించనున్నారు. సర్వే కోసం 27,500 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2,300 మంది ప్రయివేటు ఉపాధ్యాయులు, 800 మంది బ్యాంకు సిబ్బందిని వినియోగించనున్నారు. వీరందరికి జిల్లాలోని 56 కేంద్రాలలో రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ప్రతి మండలాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. ఇంటింటికి కరపత్రా లు పంపిణీ చేశారు. స్టిక్కర్లను అతికించారు. గ్రామాలలో పోస్టర్లు వేశారు. మండల ప్రత్యేకాధికారులు సర్వే కు బాధ్యులుగా వ్యవహరించనున్నారు. సర్వే అనంత రం సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి మండలానికి 25 నుంచి 50 వరకు కంప్యూటర్లను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 25 నుంచి 30 ఇళ్ల సమాచారాన్ని సేకరించాలని సూచించారు.