breaking news
CM face
-
వారంలోపు ఢిల్లీకి కొత్త సీఎం: సౌరభ్ భరద్వాజ్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన అనంతరం ఢిల్లీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ సీఎం పీఠంలో ఎవరు కూర్చోబోతున్నారనే చర్చ మొదలైంది. మరోవైపు.. మంత్రి అతిశీ, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్ వంటివారు తదుపరి సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ నేత, రాష్ట్ర మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ‘‘రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్కు సమర్పిస్తారు. రాజీనామా ఆమోదించిన వెంటనే శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటాం. ఎన్నికైన నాయకుడి పేరును లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి అందజేస్తారు. మా పార్టీ ఎమ్మెల్యేలు అంతా మా వెంటే ఉన్నారు. మాకు స్పష్టమైన సంఖ్యా బలం ఉంది. మేము ఎంపిక చేసిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ముఖ్యమంత్రి ఎంపిక మొత్తం ప్రక్రియను వారంలోపు పూర్తి చేస్తాం’’ అని అన్నారు.#WATCH | Delhi Minister and AAP leader Saurabh Bharadwaj says, "Tomorrow, Chief Minister (Arvind Kejriwal) will submit his resignation and as soon as the resignation is accepted, there will be a meeting of the legislative party, the legislative party will elect a leader. The… pic.twitter.com/xmPu3X9gY7— ANI (@ANI) September 16, 2024చదవండి: కౌన్ బనేగా ఢీల్లీ సీఎం? రేసులో వీళ్లే! -
కౌన్ బనేగా ఢీల్లీ సీఎం? రేసులో వీళ్లే!
ఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో.. ఢిల్లీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. తాను నిజాయతీపరున్ని అని ప్రజలు తీర్పు ఇచ్చేదాకా సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే.. కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఢిల్లీ సీఎం పీఠంపై ఆప్ ఎవరీ కూర్చోబెడుతుందనే చర్చ ఇప్పటికే పార్టీ వర్గాల్లో మొదలైంది. సీఎం పదవికీ మంత్రులు అతిషీ, గోపాల్ రాయ్, కైలేశ్ గహ్లోత్, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేర్లు తెరమీదకు వస్తున్నాయి.మనీష్ సిసోడియా ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇవాళ (సోమవారం) సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లనున్నారు. ఇరు నేతలు లిక్కర్ స్కామ్ కేసులో బైయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం సమావేశం కావటం ఇదే తొలిసారి. ఇక.. నిన్న కేజ్రీవాల్ రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇరునేతలు భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపికపై ఇరు నేతలు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఢిల్లీ సీఎం రేసులో మనీష్ సిసోడియా కూడా ఉన్నారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సునీతా కేజ్రీవాల్కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చ ప్రారంభమైంది. రేసులో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కూడా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆప్ వర్గాలు అధికారికంగా స్పందించకున్నా సునీతకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ నాయకుడొకరు చెప్పారు. కేజ్రీవాల్ మాదిరిగానే ఐఆర్ఎస్ అధికారిగా చేసిన ఆమెకు ప్రభుత్వాన్ని నడిపే విధానం క్షుణ్ణంగా తెలుసన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ, హర్యానా, గుజరాత్లో ఆప్ నుంచి సునితా కేజ్రీవాల్ ప్రచారాల్లో ముందుండి నడిపించారు. కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో ఆమె క్రమం తప్పకుండా మీడియా సమావేశాలలో నిర్వహించారు. సీఎం కేజ్రీవాల్ సందేశాలను ప్రజలకు చదివి వినిపించారు. ఢిల్లీ, రాంచీలో ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీల్లో కూడా పాల్గొంన్నారు. తన భర్త కేజ్రీవాల్ను బీజేపీ లక్ష్యంగా చేసుకోవటంపై విమర్శలు గుప్పించారు.అతిషీవిధాన సంస్కరణలు, సామాజిక సమస్యలపై అతిశీ డైనమిక్గా వ్యవహరిస్తారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న అరెస్టు చేసిన ఆప్ పార్టీ వ్యవహారాలను అన్నీ తానై చూశారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటికీ ప్రభుత్వ పనితీరులో కీలక పాత్ర పోషించారామె. క్యాబినెట్ మంత్రుల్లో ఆమె 14 శాఖలకు బాధ్యత వహిస్తున్నారు. విద్య, ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, నీరు, విద్యుత్ మరియు ప్రజా సంబంధాలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను చూస్తున్నారామె. అతిషి ఢిల్లీ అసెంబ్లీలో విద్యకు సంబంధించిన స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. ఆమె బలమైన వాక్చాతుర్యం ఉన్న నేతగా ఆప్లో గుర్తింపు పొందారు. ఈ అనుకూలతలన్ని ఆమెను తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి పోటీదారుల్లో ముందువరసలో నిలబెట్టాయి.గోపాల్ రాయ్ఆప్లో మంత్రి గోపాల్ రాయ్.. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగారు. 49 ఏళ్ల గోపాల్ రాయ్ విద్యార్థి క్రియాశీలక రాజకీయ నేపథ్యం కలిగిన ఉన్నారు. ప్రస్తుతం పర్యావరణం, అటవీ, వన్యప్రాణి, అభివృద్ధి, సాధారణ పరిపాలన వంటి శాఖల మంత్రి ఉన్నారు. గోపాల్ రాయ్ ఢిల్లీలోని శ్రామిక వర్గ సంఘాలతో అనుబంధం ఉంది. కార్మిక హక్కులు, పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు విస్తృతంగా కృషి చేశారు. కాలుష్య నియంత్రణ నుంచి కార్మిక సంక్షేమం వరకు ఢిల్లీ నగరం ఎదుర్కొంటున్న సమస్యల్లో కీలకంగా వ్యవహరించినఅనుభవ ముఖ్యమంత్రి పోటీదారుల్లో ఒకరిగా చేర్చింది.ఆయనపై ప్రచారంలో కాల్పులు జరగగా.. పాక్షికంగా పక్షవాతానికి గురయ్యారు.కైలాష్ గహ్లోత్ఢిల్లీ రాజకీయల్లో కీలకమైన వ్యక్తి ప్రస్తుతం ఆప్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో.. ఢిల్లీ ప్రభుత్వం బస్సు సర్వీసుల విస్తరణ, ఎలక్ట్రిక్ బస్సుల పరిచయం, రహదారి భద్రతను పెంపొందించే ప్రయత్నాలతో రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకోవటంలో గణనీయమైన పురోగతి సాధించింది. 50 ఏళ్ల కైలాష్ గహ్లోత్.. బలమైన పరిపాలనా సామర్థ్యాలను కలిగిన ఆప్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
సై.. అన్న షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: వచ్చేఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో షీలాదీక్షిత్ (78) ముఖ్యమంత్రి అభ్యర్థిగా తలపడనున్నారా? అందుకు షీలా తన అంగీకారాన్ని తెలిపారా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇన్నాళ్లూ ఉత్తరప్రదేశ్ లో క్రియాశీల బాధ్యతలను కాదంటూ వచ్చిన షీలా.. ఎట్టకేలకు తన అనుమతిని తెలిపినట్టు సమాచారం. పార్టీ తనను ఏమైనా చేయాలని ఆదేశిస్తే.. అందుకు తాను సిద్ధంగా ఉంటానని షీలా ఇటీవల తెలిపారు. ఉత్తరప్రదేశ్ కోడలినని చెప్పుకొంటున్న షీలాను రంగంలోకి దించితే బ్రాహ్మణుల ఓట్లు పడే అవకాశం ఉన్నట్టు ఆపార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అధిష్టానానికి సూచించారని, దీంతో అధిష్టానం ఆదేశాలను షీలాదీక్షిత్ కాదనలేకపోయారని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ 2014 లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 2015 లో నితీష్ కుమార్ లకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పని చేశారు. మరోవైపు, ఇందిర మనవరాలు ప్రియాంకగాంధీ సైతం యూపీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ కేవలం అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తూ వచ్చిన ప్రియాంక.. ఈసారి ఎలాగైనా యూపీలో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే కొందరు నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు.