breaking news
China delegation
-
భారత్కు చైనా షాక్.. బంగ్లాతో బిగ్ డీల్!
ఢాకా: బంగ్లాదేశ్–చైనా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇరు దేశాల తాజా సంయుక్త ప్రకటనలో మోంగ్లా పోర్ట్ ఆధునీకరణ, అభివృద్ధి ప్రాజెక్టుల్లో చైనా భాగస్వామ్యం మరింత పెరగనున్నట్లు వెల్లడైంది. ఈ పరిణామం దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.బంగ్లాదేశ్–చైనా ప్రకటన ప్రకారం, మోంగ్లా పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపు, వాణిజ్య సౌకర్యాల విస్తరణలో చైనా సహకారం కొనసాగనుంది. అయితే, ఇది బంగాళాఖాతం ప్రాంతంలో చైనా ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే ఒప్పందంలో భాగంగానే తీస్టా నది సమగ్ర నిర్వహణ ప్రాజెక్ట్లో కూడా చైనా సహకారం అంశం చోటు చేసుకోవడం భారత్లో వ్యూహాత్మక ఆందోళనలకు కారణమైంది. ఈ ప్రాజెక్ట్ ప్రాంతం భారత్లోని సిలిగురి కారిడార్కు సమీపంలో ఉండటంతో భద్రతా పరంగా సున్నితమైనదిగా పరిగణించబడుతోంది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బంగ్లాదేశ్ చైనా భాగస్వామ్యాన్ని ప్రధానంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ కోణంలో చూస్తున్నప్పటికీ, దీని ద్వారా బంగాళాఖాతం ప్రాంతంలో శక్తి సమతుల్యతలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. భారత్ ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పటికీ, అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అయితే సముద్ర వాణిజ్య మార్గాలు, ప్రాంతీయ భద్రత, మరియు ఈశాన్య భారత వ్యూహాత్మక పరిస్థితులపై దీర్ఘకాల ప్రభావం ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిణామం తక్షణ రాజకీయ మార్పు కంటే దక్షిణాసియాలో చైనా ప్రభావ విస్తరణకు మరో సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.మోంగ్లా పోర్ట్ ప్రాజెక్ట్ ప్రాధాన్యం?మోంగ్లా పోర్ట్ బంగ్లాదేశ్లో రెండో అతిపెద్ద సముద్ర వాణిజ్య కేంద్రం. ఈ పోర్ట్ అభివృద్ధి ద్వారా బంగ్లాదేశ్కు దిగుమతి, ఎగుమతి సామర్థ్యం పెరుగుతుంది. కంటైనర్ హ్యాండ్లింగ్ వేగం మెరుగవుతుంది. బంగాళాఖాతం వాణిజ్య మార్గాల్లో రవాణా సామర్థ్యం పెరుగుతుంది. అలాగే, చైనా కంపెనీల భాగస్వామ్యం పెరగడం వల్ల ఈ ప్రాజెక్ట్లో పెట్టుబడులు, సాంకేతిక సహకారం పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే దీని ద్వారా చైనా సముద్ర వాణిజ్య నెట్వర్క్లో తన స్థానం బలపడే అవకాశం ఉంది.చైనా ఎందుకు ఆసక్తి చూపుతోంది?ఈ ఒప్పందం చైనాకు మూడు ప్రధాన ప్రయోజనాలు కల్పించవచ్చు:1. బంగాళాఖాతం ప్రభావంబంగాళాఖాతం ప్రాంతంలో చైనా ఆర్థిక–లాజిస్టిక్ ఉనికి పెరుగుతుందిసముద్ర వాణిజ్య మార్గాలపై ప్రభావం పెరగవచ్చు2. ప్రాంతీయ కనెక్టివిటీ నెట్వర్క్బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) భాగంగా పోర్ట్ అభివృద్ధిదక్షిణాసియాలో రవాణా–వాణిజ్య హబ్లపై ప్రభావం3. దీర్ఘకాల వ్యూహాత్మక స్థానంఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై నియంత్రణ పెంపు -
ఢిల్లీ హోటల్లో హైడ్రామా సృష్టించిన జీ20 చైనా బృందం
న్యూఢిల్లీ: భారత్లో అత్యంత వైభవంగా జరిగిన జీ20 సమావేశాలకు దాదాపు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశాలు విజయవంతంగా ముగిశాక వారంతా తమతమ దేశాలకు తిరిగి పయనమయ్యారు. అయితే సమావేశాలు ముగిసిన మూడు రోజులకు ఢిల్లీ తాజ్లో జరిగిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జీ20 సమావేశాల్లో హాజరయ్యేందుకు వచ్చిన చైనా ప్రతినిధుల బృందం బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలు కనిపించడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని నిలదీయగా బ్యాగులను స్కాన్ చేయడానికి నిరాకరించారు. భారత అధికారులు జోక్యం చేసుకున్నాక 12 గంటల పాటు సాగిన ఈ హైడ్రామాకు తెరపడింది. సమావేశాల సమయంలో చైనా ప్రతినిధుల బృందం తాజ్ ప్యాలెస్లో బస చేశారు. హోటల్ కు వస్తూనే వారి బ్యాగులను తనిఖీ చేయగా రెండు బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలు కనిపించడంతో వారిని అక్కడే నిలిపివేశారు తాజ్ సెక్యూరిటీ సిబ్బంది. ఆ రెండు బ్యాగులలో దౌత్య సంబంధమైన సామాన్లు ఉన్నట్లు చైనా బృందం వెల్లడించగా అనుమానమొచ్చి హోటల్ సెక్యూరిటీ బ్యాగులను స్కానర్ పై ఉంచాల్సిందిగా కోరారు. అందుకు వారు నిరాకరించడంతో 12 గంటలపాటు పెద్ద డ్రామా నడిచింది. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి అధికారులు కల్పించుకున్నాక వారి లగేజీని చైనా ఎంబసీకి తరలించడానికి వారు అంగీకరించడంతో హైడ్రామాకు తెరపడింది. భారత్లో జరిగిన ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గైరుహాజరవ్వగా ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా ప్రతినిధిగా హాజరయ్యారు. ఢిల్లీ తాజ్ హోటల్లో బస చేసిన చైనా ప్రతినిధి బృందానికి ఆయనే నాయకత్వం వహించారు. ఇది కూడా చదవండి: Libya Floods: లిబియాలో వరద బీభత్సం -
అమరావతికి అండాదండ
చైనా బృందం వెల్లడి సీఆర్డీఏ అధికారుల బేటీ విజయవాడ : నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన చైనా ప్రతినిధి బృందంతో సోమవారం విజయవాడలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. ఏపీ సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ బాబు.ఎ, నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్తో చైనాకు చెందిన జీఐఐసీ (గ్విజో మారిటైం సిల్క్రూట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్) ప్రణాళిక, డిజైనింగ్, వ్యాపార రంగ నిపుణుల బృందం సభ్యులు సమావేశమయ్యారు. ఈ బృందానికి నేతృత్వం వహించిన జీఐఐసీ ఉపాధ్యక్షుడు చీఫ్ ఇంజినీర్ గువాన్ గ్జియోక్వింగ్ మాట్లాడుతూ.. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. దానికి అణుగుణంగా తుది బృహత్ ప్రణాళిక రూపకల్పనలో ఇండస్ట్రియల్ ప్లానింగ్, పవర్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్టక్చర్ ప్లానింగ్ అంశాల్లో సహకరించేందుకు అనుభవజ్ఞులైన నిపుణులతో తమ బృందం వచ్చిందని చెప్పారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి రాజధాని అమరావతి కీలకంగా మారుతుందని చెప్పారు. బౌద్ధ ధర్మానికి వారసత్వ నగరంగా అమరావతి పేరుగాంచిందని, చక్కని ప్రణాళికతో నిర్మాణం కానుందని పలువురు అధికారులు చైనా బృందానికి వివరించారు. జీఐఐసీ ప్లాన్ అండ్ డిజైన్ బృందానికి చెందిన పర్యావరణ పరిరక్షణ నిపుణులు యాంగ్ చాంగ్లీ, షాంగ్ కాయ్, పవర్ ప్లానింగ్ నిపుణులు ల్యూఈ, పవర్ సిస్టమ్స్ ప్లానింగ్ నిపుణులు లీజీ, మున్సిపల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్లానింగ్, వాటర్ సప్లయి, డ్రైనేజీ విభాగం నిపుణులు వాంగ్ గోడోంగ్, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ నిపుణులు లీషియాన్, ఇండస్ట్రియల్ ప్లానింగ్ నిపుణులు తాంగ్ షిబిన్, జ్యూ రుయ్, వాణిజ్య బృందం సభ్యుడు జీఐఐసీ భారత ప్రతినిధి న్యు పేయ్ పాల్గొన్నారు.


