Charity party
-
కప్పు టీ.. కోటిన్నర విరాళం: ఆశ్రమం కోసం అద్భుతం
ఒక్క కప్పు టీ తాగితే ఎంత అవుతుంది? పది రూపాయలు.. మహా అయితే వంద రూపాయలు! కానీ అదే టీ కప్పు కోటిన్నర రూపాయల నిధిని సమకూర్చింది. కేరళలోని కోజికోడ్ జిల్లా ఎడచేరిలో జరిగిన ఈ అద్భుతం.. మనుషుల్లో ఇంకా మమకారం మిగిలేవుందని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారని మరోసారి నిరూపించింది. అప్పుల్లో కూరుకుపోయిన ఒక ఆశ్రమాన్ని కాపాడుకునేందుకు ఊరంతా ఏకమై చేసిన ఈ ‘ఛాయ్ ఛాలెంజ్’ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.అంచనాలను తలకిందులు చేసిన జనప్రవాహంఅనాథలు, వృద్ధుల సంరక్షణ కోసం నెలకు రూ.25 లక్షలు ఖర్చు చేసే ‘తణల్’ ఆశ్రమం ఆర్థిక ఇబ్బందుల్లో పడటంతో, నిర్వాహకులు ‘ఛాయ్ తణల్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం 5,000 మంది వస్తారని భావిస్తే, ఏకంగా 18,000 మంది తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎడచేరి వీధులన్నీ జనసంద్రమయ్యాయి. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినా సరే.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కిలోమీటర్ల మేర క్యూ కట్టి మరీ ప్రజలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒక్కరోజే నగదు రూపంలో రూ. 57.42 లక్షలు రాగా, హామీలతో కలిపి మొత్తం రూ. 1.41 కోట్లు సమకూరడం విశేషం.ఒంటిపై నగలను కూడా విరాళంగా ఇచ్చి..ఈ సేవా యజ్ఞంలో కేవలం డబ్బు మాత్రమే కాదు, మనసున్న మనుషులు తమ సర్వస్వాన్ని అందించారు. కొందరు మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసి నిర్వాహకుల చేతిలో పెట్టి కన్నీళ్లు పెట్టించారు. వచ్చిన వారందరికీ టీతో పాటు సుమారు 13,000 అరటికాయ బజ్జీలు (పళమ్ పోరి) వడ్డించారు. బజ్జీలు అయిపోతే సమోసాలు, అవి కూడా అయిపోతే బిస్కెట్లు అందించారు. ఇలా ఏదీ అందకపోయినా, ఆశ్రమానికి సాయం చేయాలన్న తపనతో జనం క్యూలోనే నిలబడ్డారు.సంగీత హోరులో సాగిన సేవప్రముఖ గాయకులు ప్రేమ్కుమార్ వడకర, సల్వాన్ వడకర తమ పాటలతో అక్కడ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. గానలహరి మధ్య ప్రజలు ఉత్సాహంగా విరాళాలు అందజేశారు. వార్షికంగా రూ.నాలుగు కోట్ల ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ‘తణల్’ ఆశ్రమానికి, ఈ ఒక్కరోజు స్పందన కొండంత అండగా నిలిచింది. ఒక టీ కప్పు సాక్షిగా కోజికోడ్ ప్రజలు రాసిన ఈ మమతానురాగాల కథ దేశవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఇది కూడా చదవండి: ‘పాక్లో జమ్మూ?’.. నాలిక్కరుచుకుని నేపాల్ క్షమాపణలు! -
‘యువి కెన్’ ఫౌండేషన్ కార్యక్రమంలో సందడి చేసిన భారత ప్లేయర్లు (ఫోటోలు)
-
డబుల్ పేరిట డబ్బులు దండుకుని
సాక్షి, మహబూబాబాద్/ ఇల్లందు/ గూడూరు: ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు, గిరిజనుల అమాయకత్వం, పేదరికాన్ని ఆసరా చేసుకుని స్వచ్ఛంద సంస్థ ముసుగులో తక్కువ ధరకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని వారి నుంచి రూ.20 కోట్ల మేర డబ్బులు దండుకున్నారు. ఇళ్లు కట్టేస్తున్నామని ఐరన్, సిమెంట్ పంపిణీ చేసి ఉడాయించేశారు. ఇంటిసామగ్రి తెస్తామని చెప్పి వెళ్లిన వారు రెండేళ్లుగా పత్తా లేకపోవడంతో బాధితులు చివరికి పోలీసుల్ని ఆశ్రయించగా అసలు విషయం బయటకొచ్చింది. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థ పేరుతో వచ్చి... పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి హోలీవర్డ్ సొసైటీ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ 2020లో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో కొంతమంది ఏజెంట్లను నియమించుకుంది. కేవలం రూ.4,50,000లకే 693 చదరపు అడుగుల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏజెంట్లను ఏజెన్సీ ప్రాంతాల్లోకి పంపించి ప్రచారం చేయించింది. వీరి మాటల్ని నమ్మేందుకుగాను పలుచోట్ల స్వచ్ఛంద సంస్థకు చెందిన అనుచరుల ఇళ్లను చూపించేవారు. తాము నిర్మించబోయే ఇళ్లకు 120 గజాల స్థలం ఉంటే చాలని, మొదటి కిస్తీగా రూ.1,65,000 చెల్లిస్తే సరిపోతుందని ప్రచారం చేయడంతో వీరిని నమ్మి డబ్బులు కట్టేందుకు మూడు జిల్లాల నుంచి గిరిజనులు ముందుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15వేల నుంచి రూ.1,80,000 వరకు కట్టించుకున్నారు. ఇలా డబ్బులు చేతికిరాగానే ఇళ్లు కట్టేస్తున్నామని చెబుతూ కొంతమందికి ఐరన్, సిమెంట్ తెచ్చి పిల్లర్లు వేసి మిగతా వారిని కూడా నమ్మించారు. దీంతో మిగిలిన వారూ డబ్బులు చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ విధంగా మూడు జిల్లాల్లో మొత్తం రూ.20 కోట్ల మేర వసూళ్లు చేశారు. రెండో కిస్తీ కట్టాకే మిగతా నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పి సంస్థకు చెందిన ఏజెంట్లను ఉద్యోగాల నుంచి తీసేశారు. తర్వాత సంస్థ అడ్రస్ను కూడా మార్చేశారు. సంస్థకు చెందిన ఫోన్లను కూడా స్విచ్ఛాఫ్ చేసేశారు. రెండేళ్లుగా వీరంతా పత్తా లేకుండాపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన కొంతమంది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిగిలినవారు కూడా ఆయా జిల్లాల్లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు. -
నైట్ ఫర్ కాజ్
పార్టీలందు చారిటీ విందు వేరయా... సిటీలో లేటెస్ట్గా స్టార్ట్ అయిన ట్రెండ్ చారిటీ పార్టీ. గచ్చిబౌలిలోని హయత్ హైదరాబాద్లో శనివారం అర్ధరాత్రి దాకా సాగిన ఎబిసి నైట్ ఈవెంట్... ఒక డిఫరెంట్ స్టైల్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్. దీనికి అటెండైన గెస్ట్స్లో సిటీజనులతో ఈక్వల్గా విదేశీయులు కూడా బిగ్ నెంబర్స్లో పార్టిసిపేట్ చేశారు. సిటీ రాక్ బ్యాండ్ క్లాసిక్ ట్యూన్స్ బ్యాగ్రౌండ్లో ఇటాలియన్ క్యుజిన్ కు తోడుగా పిటార్స్ వైన్ సిప్ చేస్తూ ఉల్లాసంగా గడిపిన గెస్ట్స్ సెలైంట్ ఆక్షన్లో అంతే క్యూట్గా పాల్గొన్నారు. సిటీకి చెందిన రెస్టారెంట్ ఓనర్లు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఫుల్ జోష్తో కలర్ఫుల్గా మెరిసింది.


