breaking news
Champion Movie
-
చిరు జీవికైనా.. చిరంజీవికైనా అదొక్కటే ముఖ్యం: టాలీవుడ్ నటుడు
టాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మూవీ ప్రమోషన్స్ చేస్తేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారని అన్నారు. ఆది సాయికుమార్ నటించిన శంబాలకు అద్భుతంగా ప్రమోషన్స్ చేయడం వల్లే సక్కెస్ సాధించారని అన్నారు. నేను చేసింది చిన్న రోలే అయినా.. ఏప్రిల్ నుంచే ప్రమోషన్స్ ప్రారంభించారని అన్నారు.శ్రీకాంత్ తనయుడు ఛాంపియన్ మూవీ కూడా చాలా బాగుందని హర్షవర్ధన్ అన్నారు. కానీ జనాల్లోకి తీసుకెళ్లడంలో కొంత వెనకపడ్డారని తెలిపారు. ఈ వీడియో నిర్మాతలు కూడా చూడాలని అన్నారు. ఛాంపియన్ లాంటి మంచి సినిమాకు ఇంకా గొప్పగా ప్రమోషన్స్ చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరు జీవికైనా.. చిరంజీవికైనా పబ్లిసిటీ ఒక్కటే ప్రధామమని పేర్కొన్నారు. మూవీ ప్రమోషన్స్ బాగా చేస్తేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారనేది వందశాతం నిజమన్నారు. ప్రమోషన్స్పై హర్షవర్ధన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘శంబాల’ సినిమా దెబ్బకి ‘ఛాంపియన్’ సినిమా కనిపించకుండా పోయింది...చిరు జీవికైనా.. చిరంజీవికైనా పబ్లిసిటీ ఒక్కటే...ఈ వీడియో ప్రొడ్యూసర్ #AswaniDutt చూడాలి- Actor #HarshaVardhan#Shambala #Champion #ManaShankarVaraPrasadGaru pic.twitter.com/FDhGLvMksW— TeluguOne (@Theteluguone) January 22, 2026 -
'గిర గిర గింగిరాగిరే.. తుర్రు తుర్రు తోకపిట్టవే'.. ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ఛాంపియన్. గతేడాది క్రిస్మస్ కానుకగా రిలీజై సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తెలంగాణలోని బైరాన్ పల్లి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఛాంపియన్లో తన నటనతో రోషన్ మంచి మార్కులు కొట్టేశారు.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీలో ఓ సాంగ్ సినీ అభిమానులను ఊపేసింది. గిర గిర గింగిరాగిరే అంటూ కుర్రకారును ఊర్రూతలూగించింది. రామ్ మిరియాల ఆలపించిన ఈ పాట సోషల్ మీడియాలో ఊపేసింది. తాజాగా ఈ సూపర్ హిట్ ఫుల్ వీడియో సాంగ్ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సాంగ్లో రోషన్- అనస్వర రాజన్ తమ డ్యాన్స్తో అదరగొట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్ను మీరు కూడా చూసేయండి.కాగా.. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని భారీ బడ్జెట్తో ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ నిర్మించారు. ఇందులో సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజైన మూడురోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
‘ఛాంపియన్’లో ఈ నటుడిని గుర్తుపట్టారా?
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడు రోషన్ మేకా హీరోగా నటించిన తాజా చిత్రం ఛాంపియన్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలై పాజిటిట్ టాక్ని సంపాదించుకుంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఓ ఆటగాడి నేపథ్యంలో చూపిస్తూనే.. ఓ చక్కని ప్రేమ కథను చెప్పారు. ఈ చిత్రంలోని రంగయ్య పాత్ర అందరిని ఆకట్టుకుంది. తక్కువ నిడివే ఉన్నప్పటికీ..సినిమా చూసినవాళ్లకు ఆ పాత్ర కూడా గుర్తిండిపోతుంది. బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా నిలిచిన ఆ కారెక్టర్లో నటించింది విజయ్ దేవరకొండ మేనమామ యశ్ రంగినేని.నిర్మాతగా హిట్ సినిమాలు!యశ్ రంగినేని నిర్మాతగా టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రానీ నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.నటన పై ఇష్టంతో..నిర్మాతగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. యశ్కి నటన అంటే చాలా ఇష్టం. అందుకే వచ్చిన అవకాశం వదులుకోలేదు. ఛాంపియన్లో వీరయ్య పాత్ర కోసం తనను సంప్రదించగానే.. కథ నచ్చి వెంటనే ఓకే చెప్పేశాడట. ఓ చదువు రాని వ్యక్తిగా, గ్రామీణ జీవితాలకు, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా వీరయ్య పాత్రలో యశ్ రంగినేని ఒదిగిపోయారు. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రహించడం, లోలోపల అగ్ని జ్వాలలు రగిలేట్టుగా భావాలతో ఉండే ఈ పాత్రలో యశ్ రంగినేని చక్కగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లో సక్సెస్ ఫుల్గా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. -
'ఛాంపియన్' కలెక్షన్స్.. జోష్ పెంచిన రోషన్
క్రిస్మస్ కానుకగా విడుదలైన ఛాంపియన్ సక్సెస్బాటలో నడుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకాంత్ తనయుడు రోషన్.. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఛాంపియన్లో తన నటనతో రోషన్ మంచి మార్కులు అందుకున్నారు. దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఈ మూవీని భారీ బడ్జెట్తో ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ నిర్మించారు. ఇందులో రోషన్ సరసన అనస్వర రాజన్, సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది తదితరులు నటించారు.కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ‘ఛాంపియన్’’ అంటూ రివ్యూలు రావడంతో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటిరోజు రూ. 4.50 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. మూడురోజుల్లో రూ. 8.89 కోట్లు రాబట్టి క్రిస్మస్ విజేతగా దూసుకుపోతుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటించారు.మహానటి, సీతారామం వంటి భారీ విజయాల తర్వాత స్వప్న దత్ నిర్మించిన ఛాంపియన్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, వారు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ పరంగా రాబట్టడం లేదు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ మూవీలో చూపించారు. హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దౌర్జన్యాలకు తెలంగాణలోని గ్రామాలు ఏ విధంగా వణికిపోయాయో ఇందులో చూపించారు. -
‘ఛాంపియన్’ మూవీ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఛాంపియన్’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు వచ్చింది.తొలి షోకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ..మొదటి రోజు అత్యధికంగా రూ. 4.5 కోట్లు రాబట్టింది. అయితే రెండో రోజు మాత్రం కలెక్షన్స్ తగ్గిపోయాయి. శుక్రవారం ఈ సినిమాకు రూ. 2.4 కోట్ల కలెక్షన్స్ లభించాయి. మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ ఫుట్బాల్ ఆటగాడిగా నటించి, మెప్పించాడు. అనస్వర రాజన్ హీరోయిన్గా నటించగా.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. (ఛాంపియన్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ఛాంపియన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
శ్రీకాంత్ తనయుడి ఛాంపియన్.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఛాంపియన్'. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.(Champion Movie Box Office Collections)తొలిరోజే ఛాంపియన్ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.4.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ఛాంపియన్ మూవీ పోస్టర్ను పంచుకుంది. కాగా.. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు.A HOUSEFULL festive day at the cinemas ❤️🔥People’s #CHAMPION opens big with 4.5 CRORE+ worldwide GROSS on Day 1 💥Experience the historic journey on the big screen now.@IamRoshanMeka @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1 @MickeyJMeyer @AshwiniDuttCh… pic.twitter.com/jL0uSEGcjm— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 26, 2025 -
17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి
పట్టుమని పాతికేళ్లు లేవు. అయితేనేం సొంత భాషలో హీరోయిన్గా స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఆపై బాలీవుడ్లోనూ ఓ మూవీ చేసింది. ఇప్పుడు 'ఛాంపియన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇంతకీ ఈ మలయాళ బ్యూటీ ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ ఏంటి?పైన చెప్పిందంతా కూడా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ గురించే. కేరళలోని కరివెల్లూరులో పుట్టిన ఈమెకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ 15 ఏళ్ల వయసులో 'ఉదాహరణం సుజాత' అనే మూవీలో మంజు వారియర్ కూతురిగా నటించింది. 2019లో వచ్చిన 'తన్నీర్ మథన్ దినంగళ్' చిత్రం అనస్వరకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఇదే ఏడాది వచ్చిన 'అధ్యరాత్రి'లో ఈమె తల్లి, కూతురిగా ద్విపాత్రాభినయం చేసింది. ఈ రోల్స్ చేసేనాటికి ఈమె వయసు 17 ఏళ్లే కావడం విశేషం.(ఇదీ చదవండి: హారర్ సినిమా 'ఈషా' రివ్యూ)2022లో వచ్చిన 'సూపర్ శరణ్య' సినిమా అనస్వరకు చాలా పేరు తీసుకొచ్చింది. ఇందులోనే మమిత బైజు కూడా యాక్ట్ చేసింది. ఇదే ఏడాది తమిళంలోకి 'రాంగీ'తో ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే వర్కౌట్ కాలేదు. 2023లో 'యారియన్ 2'తో బాలీవుడ్కి కూడా పరిచయమైంది. ఇది కూడా కలిసి రాలేదు. దీంతో తమిళ, హిందీలో మరో చిత్రంలో నటించలేదు. కేవలం మలయాళానికి మాత్రమే పరిమితమైపోయింది.2023లో వచ్చిన 'నెరు' సినిమాతో అనస్వర ఎంత మంచి నటి అనేది అందరికీ తెలిసింది. కళ్లు లేని అమ్మాయిగా, తనపై అత్యాచారం చేసివాడిని పట్టించే పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీకిగానూ ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డ్స్ ఈమెని వరించాయి. గతేడాది వచ్చిన 'గురువాయూర్ అంబలనడయిల్', ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'రేఖాచిత్రం' ఈమెలోని ప్రతిభని మరింత బయటపెట్టాయి.శ్రీకాంత్ కొడుకు హీరోగా చేసిన 'ఛాంపియన్'తో అనస్వర.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. కానీ అంతకంటే ముందే తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయం. నెరు, రేఖాచిత్రం, సూపర్ శరణ్య తదితర చిత్రాల్ని ఓటీటీల్లో మనోళ్లు ఇప్పటికే చూశారు. వాళ్లందరికీ ఈ బ్యూటీ టాలెంట్ ఏంటనేది తెలుసు. అందం, అమాయకత్వం, డ్యాన్స్.. ఇలా అన్నీ అదరగొట్టే ఈమెకు 'ఛాంపియన్' ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ) -
డ్యాన్స్ తో డామినేట్ చేస్తున్న రోషన్
-
ఒక్కోటి ఒక్కో జానర్.. ఈ వారం అయినా అద్భుతం జరిగేనా?
ఈ ఏడాది చివరి వారం టాలీవుడ్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాల జాతరే కనిపిస్తోంది. క్రిస్మస్ సెలవులు దొరకడంతో పాటు పెద్ద సినిమాలేవి విడుదల కాకపోవడంతో భారీ ఎత్తున చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నెల 25న ఛాంపియన్, శంబాల, ఈషా, దండోరా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నాలుగు సినిమాల జోనర్స్ వేరు వేరుగా ఉండడం గమనార్హం. ఇయర్ ఎండ్లో యాక్షన్, హారర్, మిస్టరీ,సోషియయో ఫాంటసీ.. ఇల రకరకాల సినిమాలను ఆడియన్స్ని పలకరించబోతున్నాయి. ఇప్పటికే అన్నింటిపైన మంచి అంచనాలే ఏర్పడ్డాయి.శ్రీకాంత్ తనయుడు రోషన్ చాలా గ్యాప్ తర్వాత ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం తెలంగాణలోని బైరాన్ పల్లిలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. డిసెంబర్ 25న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.గతకొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆది సాయికుమార్.. ఈ సారి మిస్టీరియస్ థ్రిల్లర్ శంబాలతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఇప్పటికే శంబాలా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసి హైప్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆది హిట్ ట్రాక్ ఎక్కుతాడని దర్శకనిర్మాతలు బలంగా చెబుతున్నారు. ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్ థ్రిల్లర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్హిట్ కొట్టిన అఖిల్రాజ్తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు బాగానే భయపెట్టాయి. ఇదే భయంలో థియేటర్స్లో పుట్టిస్తే.. సినిమా హిట్ అవ్వడం ఖాయం.మరో చిన్న చిత్రం ‘దండోరా’ కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. శివాజీ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీతో పాటుగా నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. వీటితో పాటు మలయాళం డబ్బింగ్ సినిమా వృషభ కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. మోహల్ లాల్ కీలక పాత్ర వహించిన ఈ చిత్రంపై కూడా టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి వీటిల్లో ఏ చిత్రం విజయం అవుతుందో? ఇయర్ ఎండ్లో ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తాయో చూడాలి. -
శ్రీకాంత్ తనయుడి సినిమా.. భారీ ధరకు ఓటీటీ డీల్.!
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ఛాంపియన్. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీ ట్రైలర్ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై బజ్ మరింత పెరిగింది. రిలీజ్కు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు దాదాపు రూ.16 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. పెద్ద స్టార్స్ లేకపోయినా ఈ రేంజ్లో డీల్ సెట్ చేశారంటే మూమూలు విషయం కాదు. ఇప్పటికే రోషన్ మరో సినిమాకు రెడీ అయిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. -
కావాలనే గ్యాప్ తీసుకున్నా..
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా, ఒక మంచి అనుభూతిని పంచే చిత్రంగా చాంపియన్ చిత్రం నిలుస్తుందని హీరో రోషన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో అనస్వర రాజన్ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఆదివారం రాత్రి బీచ్ రోడ్డులో గ్రాండ్గా మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ నటనలో పరిణతి సాధించేందుకే ‘పెళ్లి సందడి’ తర్వాత కావాలనే విరామం తీసుకున్నానని తెలిపారు. 1948 నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ వార్ డ్రామాలో తాను ఫుట్బాల్ ఆటగాడిగా కనిపిస్తానని, తనను తాను కొత్తగా మలుచుకున్నానని పేర్కొన్నారు. పీటర్ హెయిన్ మాస్టర్ పర్యవేక్షణలో అద్భుతమైన పోరాట ఘట్టాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వివరించారు. కథానాయిక అనస్వర రాజన్ మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ సినిమా పక్కా బ్లాక్బస్టర్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ చిత్రంలోని ‘గిర గిరా’ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయిందని, సినిమా కూడా అందరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నటి ఊహతో పాటు చిత్ర బృందం పాల్గొంది. -
'అల్లు అర్జున్ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న రెండో చిత్రం ఛాంపియన్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్లో అంచనాలు పెంచేసింది. రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ పీరియాడికల్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనస్వర రాజన్ తెలుగు ఇండస్ట్రీని గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.తెలుగులో తాను చూసిన మొదటి సినిమా రామాయణం ఆధారంగా వచ్చిన శ్రీరామరాజ్యం అని తెలిపింది. మా నానమ్మ ఆ సినిమా చూస్తుంటే చూశానని వెల్లడించింది. అయితే అది తెలుగు మూవీ అని నాకప్పుడు తెలియదని పేర్కొంది. ఆ తర్వాత మలయాళంలో డబ్ చేసిన అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువ చూసేదాన్ని అనస్వర రాజన్ తెలిపింది. అప్పుడు అల్లు అర్జున్ తెలుగు హీరో అని నాకు తెలియదు.. ఆయనను మలయాళ హీరోనే అనుకున్నానని పంచుకుంది. రామ్ చరణ్ మగధీర సినిమా చూశాకే నాకు తెలుగు చిత్రాలు, యాక్టర్స్ గురించి తెలిసిందని కామెంట్స్ చేసింది. అప్పటి వరకు నేను తెలుగు సినిమాలను చూస్తున్నానని నాకే తెలియదని అనస్వర చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో చంద్రకళ పాత్ర అనే పాత్రలో అలరించనుంది.కాగా.. అనస్వర రాజన్ ప్రస్తుతం తెలుగులో ఇట్లు మీ అర్జున అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఛాంపియన్ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇదేనని ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది. కాగా.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఛాంపియన్ మూవీ తెరకెక్కించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. -
హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!
-
మగధీరలా చాంపియన్ పెద్ద హిట్ కావాలి: రామ్ చరణ్
‘‘చాంపియన్’ సినిమా కోసం మూడున్నరేళ్లు పట్టిందని రోషన్ చెప్పాడు. మేము కూడా కొన్ని సినిమాలకు మూడు, నాలుగైదేళ్లు ఉన్నాం. అయితే ఎన్ని రోజులు తీశాం అన్నది కాదు. ‘చాంపియన్’ ట్రైలర్ చూస్తుంటే సినిమా అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. నా సెకండ్ ఫిల్మ్ ‘మగధీర’ ఎంత పెద్ద హిట్ అయిందో... రోషన్కి ‘చాంపియన్’ అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో రామ్చరణ్ చెప్పారు. రోషన్, అనస్వరా రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ బ్యానర్స్పై ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. గురువారం జరిగిన ‘చాంపియన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్చరణ్ మాట్లాడుతూ– ‘‘ఎన్టీఆర్కి మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’, అల్లు అర్జున్కి తొలి చిత్రం ‘గంగోత్రి’, మహేశ్బాబుకి ‘రాజకుమారుడు’, నాకు ‘చిరుత’... ఇలా మాకు ముఖ్యమైన వ్యక్తి అశ్వినీదత్గారు. మేం కెరీర్ మొదలు పెట్టినప్పుడు అందరి నిర్మాతలకంటే ముందు ధైర్యంగా వచ్చి... అఫ్కోర్స్... మా వెనక ఫ్యామిలీ ఉండొచ్చు కానీ, మేం ఎలా యాక్ట్ చేస్తామో తెలీదు, మమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియని టైమ్లో వచ్చి, నటుడిగా పరిచయం చేసి మరచిపోలేని జర్నీ ఇచ్చిన దత్గారికి, ఆయన ఫ్యామిలీకి థ్యాంక్స్. ఇప్పుడు రోషన్ కూడా ‘చాంపియన్’తో వస్తున్నాడు. తను హాలీవుడ్ హీరోలా, యూరోపియన్ యాక్షన్ హీరోలా ఉన్నాడు... అందంగా ఉన్నాడు. ‘చాంపియన్’ చిత్ర నిర్మాతలు స్వప్న, ప్రియాంక ఇంత ప్యాషనేట్గా, హార్డ్ వర్క్తో పని చేస్తుండటం ఆశ్చర్యంగా లేదు. ఎందుకంటే దత్గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి. నాగ్ అశ్విన్గారితో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ (‘కల్కి 2898 ఏడీ’) మూవీ ఇచ్చారు. అవకాశం ఉంటే స్వప్న సినిమాస్లో ఓ సినిమా చేద్దామనుకుంటున్నాను. ఇంత ప్యాషనేట్ పీపుల్స్తో పని చేస్తే సరదాగా షూటింగ్కి వెళ్లి వచ్చేయొచ్చు. ఇక ‘చాంపియన్’కి ప్రదీప్ అద్వైతంగారి కష్టం కనిపిస్తోంది. రోషన్ పరిణతి ఉన్న నటుడిలా నటించాడంటే తనని పాత్ర కోసం చాలా బాగా తీర్చిదిద్దారు. అనస్వర మలయాళీ అయినా తెలుగు నేర్చుకుని, డబ్బింగ్ చెప్పడం చూసి ఇంప్రెస్ అయ్యాను. అన్ని విభాగాల వాళ్లు ఎంతో కష్టపడి పని చేశారు. ఈ సినిమాని ఈ నెల 25న చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు. -
‘ఛాంపియన్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
చంద్రకళ మనసుల్లో నిలిచిపోతుంది
‘‘చాంపియన్’ కథ విన్నప్పుడు ఎమోషనల్గా అనిపించింది. సినిమాలో నేను చేసిన చంద్రకళ పాత్ర చాలా బాగుంటుంది. డైరెక్టర్ ప్రదీప్గారి సపోర్ట్తో నా క్యారెక్టర్కి ఏం కావాలో అన్నీ పర్ఫెక్ట్గా చేశాను. నా పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది’’ అని మలయాళ భామ అనస్వరా రాజన్ చెప్పారు. రోషన్, అనస్వరా రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనస్వరా రాజన్ మాట్లాడుతూ – ‘‘వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్లాంటి సంస్థలు నిర్మించిన సినిమాతో తెలుగులో పరిచయం కావడం నా అదృష్టం. తెలుగు ప్రేక్షకులు నేను వేరే భాషలో చేసిన సినిమాలు చూసి, ఎన్నో అద్భుతమైన మెసేజ్లు పంపారు. తెలుగులో నా తొలి సినిమాని కూడా అంతే గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. తెలుగు సినిమా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ ఫిల్మ్ మేకర్స్,ప్రొడ్యూసర్స్ సపోర్టివ్గా ఉంటారు. ఒక్కసారి ఇక్కడ పని చేస్తే మళ్లీ మళ్లీ తెలుగు సినిమాలు చేయాలనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో ‘ఇట్లు మీ అర్జున’ సినిమా చేస్తున్నాను. ‘చాంపియన్’ మూవీ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇది’’ అని పేర్కొన్నారు. -
మరో కాలానికి వెళ్లడం ఆసక్తిగా ఉంటుంది
రోషన్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చాంపియన్ ’. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్, స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రం సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్(Mickey J Meyer) మాట్లాడుతూ – ‘‘స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథతో ‘చాంపియన్’ సినిమా రూపొందింది. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం నాకు ఇలా ఇష్టం. ఎందుకంటే ఒక టైమ్ నుంచి మరో టైమ్లోకి వెళ్లి మరో కాలాన్ని చూడడమనేది ఆసక్తికరంగా ఉంటుంది. ‘మహానటి’ సినిమా నాకు అలాంటి అనుభూతినే ఇచ్చింది. ‘చాంపియన్’లో నిజాం బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ‘సల్లంగుండాలి, గిర గిర గిర గింగిరాగిరే..’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ జానపదంతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్ను మిళితం చేసి ఒక జానర్ను క్రియేట్ చేసే అవకాశం ఈ కథ కల్పించింది. ఈ కథలో హీరోకు సికింద్రాబాద్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. నేను కూడా సికింద్రాబాద్లోనే పెరిగాను. నాకు ఆ కల్చర్ పై అవగాహన ఉంది. యాక్టర్గా, డ్యాన్సర్గా... ఇలా రోషన్ ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ప్రదీప్ చక్కగా డైరెక్ట్ చేశాడు’’ అని చెప్పారు. -
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో!
మూడు దశాబ్దాల తర్వాత నందమూరి కల్యాణ్ చక్రవర్తి( వెండితెరపై కనిపించనున్నారు. రోషన్, అనస్వరా రాజన్ హీరో హీరోయిన్లుగా, కల్యాణ్ చక్రవర్తి కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ మూవీ ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని కీలకమైన రాజి రెడ్డి పాత్రలో నందమూరి కల్యాణ్ చక్రవర్తి(Nandamuri Kalyan Chakravarthy) నటించినట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘‘1980లలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన కల్యాణ్ చక్రవర్తి మా ‘ఛాంపియన్’ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. చిరంజీవిగారి ‘లంకేశ్వరుడు’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన తర్వాత, ఆయన నటన నుంచి విరామం తీసుకుని, మళ్లీ 35 ఏళ్ల తర్వాత తెరపై కనిపించబోతున్నారు’’ అని యూనిట్ పేర్కొంది.


