-
కేంద్ర ప్రభుత్వ మిషన్ అంత్యోదయ సర్వే, 2వ స్థానంలో వైజాగ్
గిరిజనుల జీవన చిత్రానికి ప్రతి రూపాలు సంతలు.. ఇవి వారి ఆత్మీయ అనురాగాలకు ప్రతీకలు. మన్యం వాసుల దైనందిన జీవితంలో సంతకు ఎంతో ప్రాధాన్యముంది. తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులైనా, సేకరించిన అటవీ ఉత్పత్తులైనా గిరిపుత్రులు సంతకు తెచ్చే విక్రయిస్తుంటారు. గిరిజనుల జీవితాల్లో వినోదం, వ్యాపారం, వ్యవహారం..అన్నింటికీ ఏకైక వేదిక సంత. విశాఖ మన్యంలో రోజుకో ప్రాంతంలో నిత్య జాతర వాతావరణాన్ని తలపించేలా వారపు సంతలు జరుగుతుంటాయి. తాజాగా దేశవ్యాప్తంగా సంతలపై ఎక్కువగా ఆధారపడే అత్యధిక గ్రామాలున్న జిల్లాల జాబితాలో విశాఖపట్నం స్థానం సంపాదించుకుంది. సాక్షి, విశాఖపట్నం/పాడేరు రూరల్: దేశంలో సంతలపై ఆధారపడే అత్యధిక గ్రామాలున్న జిల్లాల జాబితాలో విశాఖపట్నం రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ మిషన్ అంత్యోదయ–2019లో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి చెందిన భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థ ఏడాదిపాటు దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. విశాఖ ఏజెన్సీలోని 776 గ్రామాలు నిత్యావసరాలతో పాటు ఇతర వస్తువుల కొనుగోలుకు వారపు సంతలపైనే ఆధారపడుతున్నాయని పేర్కొంది. 937 ఏజెన్సీ గ్రామాలతో ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా తొలి స్థానంలో ఉంది. దేశంలోని 95 వేల గ్రామాలు వారపు సంతలపైనే ఆధారపడుతున్నాయని సర్వేలో వెల్లడైంది. సర్వే పూర్తి వివరాలను ఇండియన్ డేటా పోర్టల్లో అందుబాటులో ఉంచింది. 776 గిరిజన గ్రామాలకు ముఖ్యాధారం.. విశాఖ జిల్లాలో మొత్తం 11 గిరిజన మండలాల పరిధిలోని 776 ఏజెన్సీ గ్రామాలకు ఈ సంతలే ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్నాయి. గిరిజన గ్రామాలే కాకుండా సమీపంలో ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా ఏజెన్సీలో నిర్వహించే వారపు సంతలకు ఎక్కువగా వెళ్తుంటారు. విశాఖ ఏజెన్సీలో మొత్తం 35 నుంచి 40 ప్రాంతాల్లో ఆయా వారాల్లో సంతలు నిర్వహిస్తుంటారు. వీటిలో ప్రధానంగా పాడేరు నియోజకవర్గ పరిధిలో.. పాడేరు (శుక్రవారం), మద్దిగరువు (గురువారం), సంతబయలు (మంగళవారం), గుత్తులపుట్టు (గురువారం), వి.మాడుగుల (మంగళవారం), అన్నవరం (సోమవారం), చింతపల్లి (బుధవారం), జీకే వీధి (గురువారం), పెదవలస (శుక్రవారం), దారకొండ (ఆదివారం), ఆర్వీనగర్ (సోమవారం)లో వారపుసంతలు జరుగుతాయి. అరకు నియోజకవర్గ పరిధిలో..అరకు (శుక్రవారం), పెదబయలు (సోమవారం), హుకుంపేట (శనివారం), కించమండ (సోమవారం). సుంకరమెట్ట (ఆదివారం), బూసిపుట్టు (మంగళవారం), ముంచంగిపుట్టు (శనివారం), రూడకోట (సోమవారం), అనంతగిరి (సోమవారం), డముకు (బుధవారం), కాశీపట్నం (బుధవారం)లో వారపు సంతలు జరుగుతుంటాయి. అన్నీ దొరికే అంగడి... దశాబ్దాల చరిత్రతో పల్లె జీవనానికి ప్రతీకలుగా సంతలు మారాయి. సగటు మనిషికి అవసరమైన అన్ని వస్తువులూ సంతలో అందుబాటులో ఉంటున్నాయి. నిత్యావసరాలు, పండ్లు, కూరగాయలు, దుస్తులు, సాగుకు అవసరమయ్యే సామాగ్రి, పసుపు, రాజ్మా, కాఫీ, మిరియాలు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పశువులు.. గుండు పిన్ను నుంచి స్మార్ట్ ఫోన్ వరకూ అన్ని వస్తువులూ సంతల్లో లభ్యమవుతుంటాయి. మార్కెట్లో దొరకని చాలా వస్తువులు సంతల్లో లభ్యమవుతుండటం గమనార్హం. ప్రధానంగా గిరిజన మహిళల కట్టుబొట్టుకు అవసరమైన వస్తువుల్ని వ్యాపారులు అందుబాటులో ఉంచుతారు. ఒక్కో సంతలో రూ.20 లక్షల వరకూ కనీస వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగే సీజన్లో సంతల్లో రూ.50 నుంచి రూ.కోటి వరకు వ్యాపారం జరుగుతుండటం విశేషం. చదవండి: ఉత్పత్తి ఉరకలెత్తేలా, రాష్ట్రానికి క్యూ కడుతున్న ఉక్కు కంపెనీలు -
పోలవరం నిర్వాసితుల ఫిర్యాదులు నిజమే
విజయసాయిరెడ్డి ప్రశ్నకు గిరిజన శాఖ సహాయ మంత్రి సమాధానం సాక్షి, హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులైన వారికి పునరావాస సహాయక చర్యల అమలులో లోపాలున్నాయని వారి తరఫున ‘రేలా’ సంస్థ నుంచి ఢిల్లీలోని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనని కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి జశ్వంత్ భాభోర్ తెలిపారు. వీటిపై ఆఫిడవిట్ను కూడా దాఖలు చేశామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఎఫ్ఆర్ఏ-2006 చట్టం ప్రకారం పునరావాస సహాయక చర్యలు చూడాల్సింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలేనన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement