breaking news
Central Information Minister
-
Corona: ‘ఇండియన్ వేరియంట్’ కంటెట్ తొలగించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఒక్కో రాష్ట్రం లాక్డౌన్ ఆంక్షలను పొడగిస్తున్నాయి. అయితే కరోనా వైరస్కు సంబంధించి ‘ఇండియన్ వేరియంట్’ అని సూచించే ఎటువంటి సమాచారమైనా సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని శుక్రవారం కేంద్ర సమాచార సాంకేతిక (ఐటి) మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా సంస్థలకు లేఖ రాసింది. ఇక B.1.617 అనేది ‘ఇండియన్ వేరియంట్’ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాల్లేవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వేరియంట్ను కేవలం B.1.617గా డబ్ల్యూహెచ్ఓ వర్గీకరించిందని పేర్కొంది. ‘ఇండియన్ వేరియంట్’ అని ప్రస్తావించడం అసత్యాన్ని వ్యాప్తి చేయడం వంటిదేనని తెలిపింది. ఇది దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఇలాంటి వాటి వ్యాప్తి చేస్తే నోటీసులు పంపాలని కేంద్ర ప్రభుత్వం రాయిటర్స్ వార్త సంస్థను సూచించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్లను వైద్యులు, ఆరోగ్య నిపుణులు సాధారణంగా గుర్తిస్తారు. ఇందులో భాగమే దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో గుర్తించిన కరోనా వేరియంట్స్ అని స్పష్టం చేసింది. అయితే చాలా మీడియా సంస్థలు ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ B.1.617ను ‘ఇండియన్ వేరియంట్’ అంటూ కథనాలను ప్రచురించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర సమాచార సాంకేతిక (ఐటి) మంత్రిత్వ శాఖ ఆదేశాలపై ఓ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ స్పందిస్తూ.. ‘ఇండియన్ వేరియంట్’ పదాన్ని ఉపయోగించిన సమాచారాన్ని తీసివేయడం చాలా కష్టమని తెలిపారు. ఇటువంటి చర్య కీవర్డ్ ఆధారిత సెన్సార్షిప్కు దారి తీస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ముదురుతున్న టూల్కిట్ వివాదం) -
'దేశం విడిచి వెళ్దామన్నారు'
-
దేశం విడిచి వెళ్దామన్నారు: అమీర్ఖాన్
న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మేధావులతో బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ఖాన్ కూడా గళం కలిపారు. పలు సంఘటనలు తనకు ఆందోళన కలిగించాయని.. తన భార్య కిరణ్రావ్ ఈ దేశం వదిలి వెళ్దామని కూడా ప్రతిపాదించారని తెలిపారు. అమీర్ సోమవారం ఢిల్లీలోని రామ్నాథ్ గోయంకా ఎక్స్లెన్స్ ఇన్జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో మాట్లాడారు. ‘ఒక వ్యక్తిగా, ఈ దేశపు ఒక పౌరుడిగా.. ఏం జరుగుతోందో మనం పత్రికల్లో చదువుతాం. నిజంగా నేను ఆందోళనకు గురయ్యాను.’అన్నారు. కొంతకాలంగా దేశంలో అభద్రతాభావం పెరుగుతోందన్నారు. ఈ విషయాలపై తన భార్య కిరణ్తో మాట్లాడినపుడు.. ‘ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్దామా?’అని ఆమె అడిగేవారని చెప్పారు. ‘‘ఆమె తన కొడుకు కోసం భయపడుతున్నారు. మా చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.’’ అని అమీర్ పేర్కొన్నారు. అంతకుముందు ఇదేకార్యక్రమంలో కేంద్ర సమాచార మంత్రి అరున్జైట్లీ మాట్లాడుతూ.. వివిధ అంశాలపై ప్రముఖ వ్యక్తులు ఒక వైఖరిని ప్రకటించటం సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రముఖ జర్నలిస్టు కులదీప్నాయర్ రామ్నాథ్ గోయెంకా అవార్డునందుకున్నారు.