-
సింగరేణి విద్యుత్ కేంద్రానికి 8వ స్థానం
సాక్షి, హైదరాబాద్/మంచిర్యాల: దేశంలో ఎంపిక చేసిన 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 8వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సంస్థ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన ఆరు నెలల కాలంలో దేశంలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సాధించిన 25 విద్యుత్ కేంద్రాలకు ర్యాంకులు ప్రకటించింది. అందులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 86.87 శాతం పీఎల్ఎఫ్తో జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించింది. అది మినహా తెలుగు రాష్ట్రాల నుంచి మరే విద్యుత్ కేంద్రం టాప్–10లో చోటు దక్కించుకోలేకపోయింది. రామగుండంలో ఎన్టీపీసీకి చెందిన సూపర్ విద్యుత్ కేంద్రం ఒక్కటే 82.04 శాతం పీఎల్ఎఫ్తో 19వ ర్యాంకు సాధించి 25 విద్యుత్ కేంద్రాల జాబితాలో చోటు సంపాదించింది. ఒక విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే.. ఓ ఏడాది కాలంలో ఆ విద్యుత్ కేంద్రం సాధించిన ఉత్పత్తి శాతాన్ని పీఎల్ఎఫ్గా పరిగణిస్తారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన విద్యుత్ కేంద్రాలు నష్టాల బాట పట్టకుండా ఉండాలంటే ఏటా మెరుగైన పీఎల్ఎఫ్ సాధించాల్సి ఉంటుంది. 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం గత ఆరు నెలల్లో 4,613 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిపి 4,325 మిలియన్ యూనిట్లను రాష్ట్రానికి (గ్రిడ్కు) సరఫరా చేసింది. ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఈ సెప్టెంబర్ వరకు 8,862 మిలి యన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా 8,272 మిలియన్ యూనిట్లను రాష్ట్రానికి సరఫరా చేసింది. ఇక సీఈఏ ప్రకటించిన జాబితాలో పశ్చిమ బెంగాల్కు చెందిన 750 మెగావాట్ల బుడ్గె బుడ్గె థర్మల్ విద్యుత్ కేంద్రం 99.77 శాతం పీఎల్ఎఫ్తో ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో సింగరేణి సంస్థ 8వ స్థానంలో నిలవడంపై సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ ప్లాంట్ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. మొదటి నుంచి ఉత్తమ స్థాయిలోనే.. జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి నుంచి మంచి పీఎల్ఎఫ్తో ముందుకెళ్తోంది. గత ఆగస్టులో ఈ కేంద్రం అత్యధికంగా 98.43 శాతం పీఎల్ఎఫ్తో రికార్డు సాధించింది. కేంద్రంలోని యూనిట్–1 గత ఏప్రిల్లో 100 శాతం పీఎల్ఎఫ్ సాధించగా యూనిట్–2 గత ఫిబ్రవరి, మే నెలల్లో 100 శాతం పీఎల్ఎఫ్ను నమోదు చేశాయి. -
దక్షిణ డిస్కంకు ఎ-గ్రేడ్
- బీ+ రేటింగ్తోనే సరిపెట్టుకున్న ఉత్తర డిస్కం - జాతీయ స్థాయి వార్షిక రేటింగ్లను ప్రకటించిన కేంద్రం - ఇకపై సకాలంలో ఏఆర్ఆర్లు సమర్పించాలని సూచన సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన 4వ జాతీయ స్థాయి వార్షిక రేటింగ్స్లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఎ-గ్రేడ్ సాధించి మంచి పనితీరును చాటుకోగా...ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) మాత్రం బీ+ గ్రేడ్తో సరిపెట్టుకుంది. పనితీరు ఆధారంగా 2012 నుంచి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఏటా రేటింగ్స్ కేటాయిస్తోంది. కార్యశీలత, ఆర్థిక నియంత్రణ, సంస్కరణలపరంగా డిస్కంల పనితీరును పరిగణనలోకి తీసుకొని 21 రాష్ట్రాల్లోని 40 ప్రభుత్వరంగ డిస్కంలకు తాజాగా 2016కి సంబంధించిన వార్షిక రేటింగ్స్ను ప్రకటించింది. విద్యుత్రంగ ప్రాజెక్టులకు రుణాలను కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) పర్యవేక్షణలో కేర్, ఇక్రా అనే ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఈ రేటింగ్స్ను కేటాయించాయి. ఇందులో డిస్కంల బలాలు, బలహీనతలను ప్రముఖంగా వెల్లడించిన కేంద్రం... పనితీరు మెరుగుదల కోసం డిస్కంలు తీసుకోవాల్సిన చర్యలను సైతం సిఫారసు చేసింది. దక్షిణ డిస్కంకు సిఫారసులు: 2017-18కి సంబంధించిన ఏఆర్ఆర్ను సకాలంలో వచ్చే నవంబర్ 30లోగా ఈఆర్సీకి సమర్పించాలి. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోళ్లను పెంచి విద్యుత్ కొనుగోలు ధరలను హేతుబద్ధీకరించాలి. ఉత్తర డిస్కంకు సిఫారసులు: ఏఆర్ఆర్లను సకాలంలో దాఖలు చేయాలి. మీటరింగ్ను మెరుగుపరుచుకోవాలి.దీర్ఘకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement