breaking news
Casablanca
-
ఎంత మోసం.. మాయరోగం నటించి విమానాన్ని దారి మళ్లించి..
పాల్మా(స్పెయిన్): మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ మనుషులు పరాయి దేశాలకు వలస వెళ్లడం సర్వసాధారణం. కొందరు చట్టబద్ధంగా వెళ్తే.. ఆ అవకాశం లేని మరికొందరు అక్రమంగా మరో దేశంలోకి ప్రవేశిస్తుంటారు. పుట్టిన గడ్డపై బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి మరీ విదేశాలకు వలస వెళ్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఇదొక కొత్త రకం అక్రమ వలస. శుక్రవారం స్పెయిన్లో చోటుచేసుకుంది. ఎయిర్ అరేబియా విమానం మొరాకోలోని కాసాబ్లాంకా నుంచి టర్కీలోని ఇస్తాంబుల్కు బయలుదేరింది. ఇందులో చాలామంది మొరాకో దేశస్తులున్నారు. మార్గమధ్యంలో ఓ ప్రయాణికుడు తనకు అనారోగ్యమంటూ విలవిల్లాడాడు. దీంతో విమానాన్ని స్పెయిన్ దేశానికి చెందిన పాల్మా డి మాలోర్కా దీవిలో ఉన్న ఎయిర్పోర్టుకు మళ్లించారు. ఇది స్పెయిన్లో బిజీ ఎయిర్పోర్టు. ఇక్కడి నుంచి నిత్యం వందలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బాధిత ప్రయాణికుడికి చికిత్స అందించేందుకు(మెడికల్ ఎమర్జెన్సీ) ఎయిర్ అరేబియా ఫ్లైట్ను మాలోర్కా ఎయిర్పోర్టులో దించారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వెంట ఓ సహాయకుడు ఉన్నాడు. విమానంలో ఆగడంతో ఇదే అదనుగా భావించి దాదాపు 22 మంది కిందికి దిగి, పరుగులు ప్రారంభించారు. కొందరు ఎయిర్పోర్టు కంచెను దాటుకొని బయటకు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.12 మందిని పట్టుకున్నారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. ఈ గందరగోళం కారణంగా విమానాశ్రయాన్ని శుక్రవారం 4 గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. దాదాపు 60 విమానాలను దారి మళ్లించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రయాణికుడు అనారోగ్యం అంటూ విమానంలో నాటకం ఆడినట్లు తేలింది. అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు గుర్తించారు. ప్రయాణికుడి వెంట వచ్చిన సహాయకుడు సైతం పరారయ్యాడు. ఇలాంటి సంఘటన తమ ఎయిర్పోర్టులో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెప్పారు. స్పెయిన్లోకి అక్రమంగా ప్రవేశించడానికే మొరాకో దేశస్తులు ఈ కుట్ర పన్నినట్లు గుర్తించారు. (చదవండి: టెక్సాస్ మ్యూజిక్ ఫెస్ట్లో తొక్కిసలాట) -
ఎత్తైన టవర్ నిర్మిస్తున్న లాడెన్ కుటుంబం
రబట్: అల్కాయిదా చీఫ్ ఒసామా బిన్లాడెన్ కుటుంబ సభ్యులకు చెందిన నిర్మాణ సంస్థ సౌదీ అల్ తుర్కీ హోల్డింగ్ గ్రూపు ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన టవర్ నిర్మించనుంది. మొరాకో ఆర్థిక రాజధాని కాసాబ్లాంకాలోని ఆన్ఫా నగరం డౌట్ టౌన్ ప్రాంతంలో 514 మీటర్ల ఎత్తులో ఈ టవర్ కట్టనుంది. దీనికోసం1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు రూ. 6.1 వేల కోట్లు) వ్యయం చేయనుంది. 114 అంతస్థులతో నిర్మించనున్న ఈ టవర్ కోసం ఆధునాతన టెక్నాలజీ ఉపయోగించనున్నామని సౌదీ అల్ తుర్కీ హోల్డింగ్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒసామా ఈల్-హుస్సేనీ వెల్లడించారు. దక్షిణ కాసాబ్లాంకాలోని బౌస్కౌరా నగరంలో 250 హెక్టార్లలో మోడరన్ సిటీ నిర్మించనున్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.