breaking news
buchi babu cricket tournment
-
5 వికెట్లతో చెలరేగిన రోహిత్ నాయుడు.. మెరుగైన స్థితిలో హైదరాబాద్
చెన్నై: రోహిత్ రాయుడు 5 వికెట్లతో సత్తా చాటడంతో... బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ మెరుగైన స్థితిలో నిలిచింది. మొదట మధ్యప్రదేశ్ 56.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది.ఆర్యన్ తివారీ (68 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో ఆకట్టుకోగా... కెపె్టన్ శుభమ్ (25), అథర్వ్ మహాజన్ (20), మంగేశ్ యాదవ్ (20) తలా కొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు 44 పరుగులిచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకోగా... తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 155 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (121 బంతుల్లో 85 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకి చేరువయ్యాడు. నితీశ్ రెడ్డి (48 బంతుల్లో 41; 6 ఫోర్లు) అవుట్ కాగా... రాహుల్ రాధేశ్ (32 బంతుల్లో 22 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో రోహిత్ రజావత్ ఒక వికెట్ పడగొట్టాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న హైదరాబాద్ జట్టు ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 26 పరుగులు వెనుకబడి ఉంది. సర్ఫరాజ్ సెంచరీ... భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (112 బంతుల్లో 111;9 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీతో కదంతొక్కాడు. హరియాణాతో పోరులో ముంబై తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ చెలరేగడంతో ముంబై జట్టు 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. షమ్స్ ములానీ (82 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా... కెప్టెన్ తనుశ్ కొటియాన్ (60 బంతుల్లో 48; 3 పోర్లు, 1 సిక్స్) దివ్యాన్ష్ సక్సేనా (106 బంతుల్లో 46; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ తమోర్ (73 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్), ముషీర్ ఖాన్ (66 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఒకదశలో ముంబై జట్టు 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో సర్ఫరాజ్ కౌంటర్ అటాక్తో సత్తాచాటాడు. గత మ్యాచ్లో తమిళనాడుపై సెంచరీ సాధించిన సర్ఫరాజ్... అదే జోరు ఇక్కడా కొనసాగించాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ (144 బంతుల్లో 133; 10 ఫోర్లు, 4 సిక్స్లు), అర్షిన్ కులకర్ణి (190 బంతుల్లో 146; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు బాదడంతో... హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో మహారాష్ట్ర జట్టు 90 ఓవర్లలో 440 పరుగులకు ఆలౌటైంది. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో ప్రిన్స్ ఠాకూర్ 7 వికెట్లు పడగొట్టాడు.చదవండి: ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ -
బుచ్చిబాబు గీతాలాపన
ఎడిటర్ రాజు దర్శకత్వంలో కృష్ణుడు, వేణుగోపాల్రెడ్డి, శివ, జ్యోత్స్న, విన్నీ ముఖ్య తారలుగా తలుపులమ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పాలటి శ్రీనివాసరావు, కాదంబరి కిరణ్, నరసింహారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బుచ్చిబాబు’. ఈ సినిమా పాటల సీడీని హైదరాబాద్లో జీవితారాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘నిర్మాతలకు, యూనిట్ అందరికీ ఈ సినిమా మంచి భవిష్యత్తుని ప్రసాదించాలి’’ అని ఆకాంక్షించారు. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు దగ్గర అసిస్టెంట్గా పని చేశానని, దర్శకునిగా తనకిది తొలిచిత్రమని రాజు తెలిపారు. చక్కని పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు నీరజ్ కోట్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా వీరశంకర్, ప్రసన్నకుమార్, శివనాగేశ్వరరావు, చలపతిరావు, దేవీప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
హైదరాబాద్ ఓటమి
చెన్నై: బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు తొలి మ్యాచ్లోనే పరాజయం ఎదురైంది. హర్యానా జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 62 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన హర్యానా 38 ఓవర్లలో ఆరు వికెట్లకు 215 పరుగులు చేసింది. భారత జట్టు మాజీ కెప్టెన్ అజయ్ జడేజా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. నింపాదిగా ఆడిన ఈ హర్యానా కెప్టెన్ రెండు బౌండరీల సహాయంతో 37 పరుగులు చేశాడు. నాలుగో వికెట్కు ఓపెనర్ సన్నీ సింగ్తో కలిసి 75 పరుగులు జోడించాడు. అనంతరం హైదరాబాద్ 37.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి 45 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సంక్షిప్త స్కోర్లు హర్యానా ఇన్నింగ్స్: 215/6 (38 ఓవర్లలో) (సన్నీ సింగ్ 82, నితిన్ సైని 36, అజయ్ జడేజా 37, సి.వి.మిలింద్ 2/42, అన్వర్ ఖాన్ 2/45) హైదరాబాద్ ఇన్నింగ్స్: 153 ఆలౌట్ (37.3 ఓవర్లలో) (హనుమ విహారి 45, అమోల్ షిండే 32, ఆశిష్ హుడా 3/12, కుల్దీప్ హుడా 2/34, సంజయ్ బుధ్వార్ 2/47, రాహుల్ తెవతియా 2/20).