-
బీఎస్ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి తీసుకున్న కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో విద్యుత్ పంపిణీ, సరఫరా, టెలిఫోన్ ఆధారిత సేవల్లో ప్రముఖ కంపెనీ అయిన బీఎస్ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ అనుమతినిచ్చింది. తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) డాక్టర్ కె.వి.శ్రీనివాస్ను నియమించింది. ఈ మేరకు ట్రిబ్యునల్ సభ్యులు కె.అనంత పద్మనాభస్వామి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. బీఎస్ లిమిటెడ్ 2010–15 వరకు ఎస్బీఐ నుంచి దశల వారీగా రూ.5 వేల కోట్లకు పైగా రుణం తీసుకుంది. తీసుకున్న రుణంలో కొంత చెల్లించిన బీఎస్ లిమిటెడ్, ఎస్బీఐకి రూ. 924.88 కోట్ల మేర బకాయి పడింది. ఈ బకాయి చెల్లించడంలో బీఎస్ లిమిటెడ్ విఫలం కావడంతో ఆ కంపెనీపై ఎస్బీఐ హైదరాబాద్లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. బీఎస్ లిమిటెడ్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని ఎస్బీఐ కోరింది. రుణ బకాయి వసూలు నిమిత్తం ఎస్బీఐ ఇప్పటికే డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) ముందు సర్ఫేసీ చట్టం కింద పిటిషన్ దాఖలు చేసిందని బీఎస్ లిమిటెడ్ వివరించింది. ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం.. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యులు పద్మనాభస్వామి బీఎస్ లిమిటెడ్ వాదనలను తోసిపుచ్చారు. ఎస్బీఐకి బకాయి ఉన్న విషయం వాస్తవమని, దీనిని తోసిపుచ్చేందుకు సరైన కారణాలేవీ కనిపించడం లేదన్నారు. ఎస్బీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటూ బీఎస్ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు అనుమతినిస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీఎస్ లిమిటెడ్ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించారు. ఈ ఆస్తులపై న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేయడం, కోర్టు తీర్పులను అమలు చేయడం తదితరాలను చేయరాదన్నారు. అంతేకాక ఆస్తులను విక్రయించడానికి గానీ, తాకట్టు పెట్టడానికి వీల్లేదని, దివాలా ప్రక్రియకు సంబంధించి పత్రికా ప్రకటన జారీ చేయాలన్నారు. -
ఐదు కంపెనీలను కొంటున్న బీఎస్ లిమిటెడ్
⇒ ఈ కంపెనీల విలువ రూ. 937 కోట్లుగా అంచనా ⇒ విద్యుత్ సరఫరా ఇన్ఫ్రా రంగంలో అతిపెద్ద కంపెనీగా అవతరణ ⇒ ఈ ఏడాది 7% వృద్ధితో రూ. 75 కోట్లకు చేరిన నికరలాభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ సరఫరా, పంపిణీలకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యాపారంలో ఉన్న బీఎస్ లిమిటెడ్ భారీ కొనుగోళ్లకు తెరతీసింది. వ్యాపార విస్తరణలో భాగంగా మొత్తం ఐదు కంపెనీలను రూ. 937 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు బీఎస్ లిమిటెడ్ ప్రకటించింది. విద్యుత్ సరఫరా, పంపిణీకి కావల్సిన స్తంభాలు, స్టీల్ స్ట్రక్చర్స్, ట్రాన్సిమిషన్ హార్డ్వేర్, యాంటీ థెప్ట్ పరికరాలను తయారు చేసే ఐదు సంస్థలను కొనుగోలు చేయడానికి బుధవారం సమావేశమైన కంపెనీ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. అగర్వాల్ స్టీల్స్ స్ట్రక్చర్స్ ఇండియా, డురాఫాస్ట్ ఆటోమోటివ్, ఎన్హెచ్ఎస్ మెటల్స్, రాజేష్ సంథి ఇన్ఫ్రాస్, మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను బీఎస్ లిమిటెడ్ కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోళ్లకు ఇంకా నియంత్రణ సంస్థల నుంచి అనుమతి లభించాల్సి ఉంది. ఈ కంపెనీల కొనుగోళ్ల ద్వారా విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాల వ్యాపారంలో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అందించే సంస్థగా బీఎస్ లిమిటెడ్ చేరిందని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రాజేష్ అగర్వాల్ తెలిపారు. దీంతో రైల్వే విద్యుద్దీకరణతో పాటు పెద్ద బిడ్డింగ్ల్లో పాల్గొనే సామర్థ్యం కంపెనీకి సమకూరిందన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో రూ. 10,000 కోట్ల ఆదాయాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అగర్వాల్ తెలిపారు. ఆదాయంలో 15 శాతం వృద్ధి మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం నికర లాభంలో 15% వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 70 కోట్లుగా ఉన్న నికరలాభం సమీక్షా కాలంలో రూ. 75 కోట్లకు చేరిం ది. ఇదే కాలానికి ఆదాయం రూ. 15% వృద్ధితో రూ. 2,321 కోట్ల నుంచి రూ. 2,673 కోట్లకు పెరిగింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement