breaking news
bobbatlu
-
వెయిటర్ టు కరోడ్పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ
ఎపుడు ఎలా పనిచేశామన్నది కాదు. సక్సెస్ సాధించామా లేదా అన్నది ముఖ్యం. తమ అభిరుచికి, నైపుణ్యానికి కాస్త పట్టుదల, కృషి జోడిస్తే విజయం మనముందు సాగిలపడుతుంది. దీన్నే అక్షరాలా నిరూపించి చూపించారు కె.ఆర్. భాస్కర్. హోటల్లో వెయిటర్గా మొదలైన భాస్కర్ ప్రయాణం కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఆయన సాధించిన విజయం ఏంటి? కేఆర్ భాస్కర్ స్ఫూర్తి దాయక స్టోరీ గురించి తెలుసుకుందాం.ఎక్కడైనా రుచి కరమైన టిఫిన్లు, ఆహారం లభిస్తోందంటే ఆహార ప్రియులకు పండగే. ఎంతదూరమైనా వెళ్లి దాని రుచిని ఆస్వాదించాల్సిందే. మళ్లీ మళ్లీ తిని ఆహా..! అనాల్సిందే. అంతేకాదు నలుగురికీ వారి ద్వారా జరిగే మౌత్ పబ్లిసిటీ విజయం తక్కువేమీకాదు. అంతటి మహిమ ఫుడ్ బిజినెస్కు ఉంటుంది. కేఆర్ భాస్కర్ తయారు చేసే బొబ్బట్ల (పూరన్ పోలి) వాసనకే ఆహార ప్రియులు పరవశులైపోతారు. ఆ సువాసన ముక్కు పుటాలకు తాకిన వారెవ్వరూ వాటి రుచి చూడకుండా వదిలిపెట్టరు.కర్ణాటక,మహారాష్ట్రలోని సందడిగా ఉండే వీధుల్లో 'భాస్కర్ పురాన్పోలి ఘర్' అలా వేలాది కస్టమర్లను ఆకర్షిస్తుంది. రెండు రాష్ట్రాలలో విస్తరించింది.ఇదీ చదవండి: 30 డేస్ ఛాలెంజ్ : ఇలా చేస్తే యవ్వనంగా, ఆరోగ్యంగా!భాస్కర్ కథ స్ఫూర్తి దాయకమైనది. కర్ణాటకలోని కుందాపూర్లో పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచీ కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఎప్పుడూ తన కలలను వదులుకోలేదు! అవిశ్రాంత పట్టుదలకు ఓరిమికి నిదర్శనం ఆయన సక్సెస్ జర్నీ. కర్ణాటకలో పెరిగిన ఆయన చిన్న వయసులోనే ఉద్యోగ రంగంలోకి దిగారు. కేవలం 12 సంవత్సరాల వయసులోనే బెంగళూరులోని ఒక హోటల్లో టేబుల్స్ శుభ్రం చేయడం , పాత్రలు కడగడం వంటి పనులు చేసేవాడు. అలా దాదాపు ఐదేళ్లకు పైగా భాస్కర్ వెయిటర్గా పనిచేశాడు. ఆ అనుభవమే ఈ వ్యాపారంపై లోతైన అవగాహన కలిగింది. అలాతన జీవితాన్ని మలుపు తిప్పిన వైనాన్ని. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2లో భాస్కర్ తన విజయగాథను పంచుకున్నారు.అంతకుముందు ఎనిమిదేళ్ల పాటు నృత్య బోధకుడిగా పనిచేశాడు. పాన్ షాప్ ఓపెన్ చేశాడు. కానీ పెద్దగా సక్సెస్కాలేదు. తన పాక నైపుణ్యంతో ఫుడ్బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 23 ఏళ్ల వయసులో తన తల్లి సహకారంతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా, రుచికరమైన బొబ్బట్లను తయారు చేసి సైకిల్ మీద వీధుల్లో అమ్మడం ప్రారంభించాడు. ఆ చిన్న అడుగే కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి బాటలు వేసింది. పురాన్పోలి తయారీలో అతని ప్రతిభకు, వాటి టేస్ట్కు అందరూ ఫిదా అయిపోయారు. 'పూరన్ పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' త్వరలోనే నాణ్యత ,అభిరుచికి పర్యాయపదంగా మారింది. కట్ చేస్తే భాస్కర్ సంస్థ కర్ణాటకలోనే 17 అవుట్లెట్లు,10 కి పైగా ఫ్రాంచైజీలతో వ్యాపారం చేస్తున్నాడు. పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబంగా ప్రతీ ఎనిమిది నెలలకో అవుట్లెట్ను ప్రారంభిస్తాడు. చాలా సాదా సీదాగా వీధి వెంచర్గా ప్రారంభమైన ఈ వ్యాపారం, ఇప్పుడు నెలవారీ ఆదాయాన్ని 18 కోట్లకు పైగా ర్జిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్ల నికర లాభాన్ని సాధించడం విశేషం.. 'పురాన్పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' విజయం భాస్కర్ పాక నైపుణ్యానికి మాత్రమే కాకుండా అతని వ్యాపార చతురతకు కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. రుచిలోనూ, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పట్టుదల ,అంకితభావంతో నిరంతరం అనేక కొత్త ఉత్పత్తులు, కొత్త రుచులతో ఇష్టమైన బ్రాండ్గా అవతరించింది. ఇదంతా కె.ఆర్. భాస్కర్ అచంచలమైన సంకల్పశక్తికి నిదర్శనం.చదవండి: Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్! -
కార్తీకంలో ఉపవాస విరమణను..ఈ టేస్టీ రెసిపీతో ఆస్వాదించండి!
కావలసినవి: మైదా – మూడు కప్పులు పసుపు – పావు టీస్పూను నువ్వుల నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు బెల్లం తరుగు – రెండు కప్పులు పచ్చికొబ్బరి తురుము – నాలుగు కప్పులు యాలకులపొడి – అరటీస్పూను నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: పెద్దగిన్నెలో మైదా, పసుపు వేసి కలపాలి. దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లుపోసుకుంటూ ముద్దలా కలపాలి. చివరగా నువ్వుల నూనె వేసి కలిపి మూతపెట్టి నలభై నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో బెల్లం, అరకప్పు నీళ్లుపోసి సన్నని మంట మీద కరగనివ్వాలి. ఐదు నిమిషాలకు బెల్లం కరుగుతుంది. బెల్లం నీటిని పలుచని వస్త్రం లేదా సన్నని చిల్లులున్న స్ట్రెయినర్తో వడగట్టాలి. ∙వడగట్టిన బెల్లం నీటిని మళ్లీ స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఇందులో కొబ్బరి తురుము వేసి అడుగంటకుండా కలుపుతూ దగ్గరయ్యే వరకు ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడి ఉండలా మారుతున్నప్పుడు యాలకుల పొడి వేసి మరోమారు కలిపి దించేయాలి. అరటి ఆకు లేదా బ్లాటింగ్ పేపర్కు కొద్దిగా నెయ్యి రాయాలి. కలిపి సిద్ధంగా ఉంచిన మైదాపిండిని చిన్న చిన్న ఉండల్లా చేయాలి. ఇప్పుడు ఒక్కో ఉండను పూరీలా వత్తాలి. కొబ్బరి మిశ్రమాన్ని పూరీ మధ్యలో పెట్టి, మిశ్రమం బయటకు రాకుండా చుట్టాలి. కొబ్బరి మిశ్రమం బయటకు కనబడకుండా మైదా పిండితో కప్పేయాలి. చేతికి నెయ్యి రాసుకుని వీటిని బొబ్బట్లలా వత్తుకోవాలి. ఇలా పిండినంతటనీ బొబ్బట్లలా వత్తుకున్న తర్వాత పెనం వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసి మీడియం మంటమీద రెండు వైపులా కాల్చుకుంటే కొబ్బరి పోలీ రెడీ. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
పనీర్ తురుము, మైదాపిండితో నోరూరించే బొబ్బట్లు.. తయారీ ఇలా
నోరూరించే పనీర్ బొబ్బట్లు తయారు చేసుకోండిలా..! కావలసినవి: ►పనీర్ తురుము, మైదాపిండి – 1 కప్పు చొప్పున ►పంచదార పొడి – అర కప్పు ►ఏలకుల పొడి – అర టీ స్పూన్ ►పచ్చి కోవా – కొద్దిగా, ఉప్పు – సరిపడా ►నెయ్యి – 4 టేబుల్ స్పూన్ల పైనే తయారీ: ►ముందుగా మైదాపిండి, తగినంత ఉప్పు వేసుకుని.. నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం ఒక బౌల్ తీసుకుని.. అందులో పనీర్ తురుము, పంచదార పొడి, పచ్చికోవా, ఏలకుల పొడి వేసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ►ఇప్పుడు కొద్దికొద్దిగా మైదా మిశ్రమాన్ని తీసుకుని.. చిన్న చిన్న అట్లు మాదిరి ఒత్తుకోవాలి. ►మధ్యలో పనీర్ మిశ్రమంతో తయారు చేసుకున్న బాల్స్ని ఉంచి.. చుట్టూ మైదా మిశ్రమంతో మళ్లీ బాల్స్లా చేసుకుని వాటిని అట్లుగా ఒత్తుకోవాలి. ►వాటిని ఒకదాని తర్వాత ఒకటి పెనంపైన నేతిలో వేయిస్తే భలే రుచిగా ఉంటాయి. -
మకర మాధుర్యం
సంక్రాంతి... ఒక పండుగ కాదు! పాడి పంటల పండుగ ముగ్గు ముచ్చట్ల పండుగ గొబ్బెమ్మలు, గంగిరెద్దుల పండుగ కొత్త అల్లుళ్ల పండుగ పాయసం, పరమాన్నాల పండుగ తియ్యని పిండి వంటల పండుగ. మొత్తంగా... మకరం తెచ్చే మధురమైన పండుగ! ముందైతే అరిసెలు మొదలుపెట్టండి. ఆదిత్యుడు అతిథిగా వచ్చేలోపు... జంతికలు, మిగతా ‘సంక్రాంతికలు’పూర్తి చెయ్యొచ్చు! కజ్జి కాయలు కావలసినవి ::: మైదా - పావు కేజీ, కొబ్బరితురుము - 100 గ్రా., బెల్లం తురుము - 150 గ్రా., ఏలకులపొడి - టేబుల్ స్పూను, నూనె - డీప్ఫ్రైకి సరిపడా తయారి: ఒక పాత్రలో మైదాపిండి, తగినంత నీరు వేసి చపాతీపిండి మాదిరిగా కలిపి పక్కన ఉంచాలి బాణలిలో కొబ్బరితురుము, బెల్లంతురుము, ఏలకులపొడి వేసి, స్టౌ మీద ఉంచి ఉడికించి దించేయాలి చల్లారాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి మైదాను కొద్దికొద్దిగా తీసుకుని చిన్నసైజు పూరీలా ఒత్తాలి కజ్జికాయలు తయారుచేసే అచ్చులో ఆ పూరీని ఉంచి, అందులో కొబ్బరి ఉండను ఉంచి అచ్చు మూసేసి, అంచులు తీసేయాలి. (ఇలా అన్నీ తయారుచేసుకోవాలి) స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న ఒక్కో కజ్జికాయను వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి చల్లారాక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి (గమనిక: స్టఫ్గా కొబ్బరి ఉండలే కాకుండా, పుట్నాలపప్పుపొడి + కొబ్బరితురుము + బెల్లంతురుము కలిపిన మిశ్రమంతో తయారుచేసుకోవచ్చు. ఇంకా... బొంబాయిరవ్వను దోరగా వేయించి అందులో పంచదార, ఏలకులపొడి కలిపి కేసరిలా చేసి ఆ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు) గుమ్మడికాయ బొబ్బట్లు కావలసినవి ::: శనగపప్పు -పావుకేజీ, మైదాపిండి - పావుకేజీ, బెల్లం - పావుకేజీ, గుమ్మడికాయ తురుము - కప్పు, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి - టీ స్పూను, నూనె - తగినంత తయారి: ఒక పాత్రలో మైదాపిండి వేసి, తగినంత నీరు జత చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి పైన నూనె వేసి బాగాకలిపి సుమారు రెండు గంటలసేపు నాననివ్వాలి ఒక పాత్రలో శనగపప్పు, తగినంత నీరు పోసి పప్పు ఉడి కించి పక్కన ఉంచాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక గుమ్మడికాయ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి బెల్లం తురుము, ఏలకుల పొడి జతచేసి బాగా గట్టిపడేవరకు ఉంచి దించేయాలి ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని పక్కన ఉంచాలి మైదాను చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో వుండను ఒత్తి, మధ్యలో పూర్ణం ఉంచాలి ప్లాస్టిక్ కవర్కి నూనె రాసి, ఈ ఉండను దాని మీద ఉంచి, చేతితో పల్చగా ఒత్తాలి స్టౌ మీద పెనం ఉంచి, తయారుచేసి ఉంచుకున్న బొబ్బట్టును దాని మీద వేసి రెండు వైపులా కాల్చి తీసేయాలి. అరిసెలు కావలసినవి::: బియ్యం - కిలో, బెల్లం - అరకిలో, నువ్వుపప్పు - 50 గ్రా., నూనె - తగినంత.(పాకంలో పట్టినంత బియ్యప్పిండి మాత్రమే వేయాలి. ఎక్కువ తీపి కావాలనుకుంటే బెల్లం మరికాస్త వేయచ్చు) తయారి: ముందురోజు బియ్యం నానబెట్టాలి. మర్నాడు బియ్యంలోని నీటిని వడగట్టి, మిక్సీలో వేసి మెత్తగా పిండిపట్టాలి బాగా జల్లెడపట్టాలి బెల్లానికి తగినంత నీరు జత చేసి స్టౌ మీద ఉంచి ఉండపాకం వచ్చే వరకు కలుపుతుండాలి (చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా పాకం వేసి చేత్తో మెదిపితే ఉండలా వస్తే ఉండపాకం వచ్చినట్టు) పాకం కిందకు దింపి అందులో బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి కలిపిన పిండిలో చిన్నగిన్నెడు నూనె పోసి ఉంచాలి ఒక గిన్నెలో నువ్వుపప్పు, కొద్దిగా నూనె వేసి కలిపి ఉంచుకోవాలి (ఇలా చేయడం వల్ల నువ్వులు విడిపోకుండా ఉంటాయి) బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి కాగనివ్వాలి పిండిని కొద్దిగా తీసుకుని, ఉండలా చేసి, నువ్వుపప్పులో ముంచి తీసి, చిన్న పాలిథిన్ కవర్ మీద ఉంచి, చేతితో పల్చగా వచ్చేలా ఒత్తి నూనెలో వేయాలి రెండువైపులా కాలాక తీసేయాలి అరిసెల చట్రం మీద ఉంచి నూనె పోయేలా గట్టిగా ఒత్తాలి బాగా ఆరిన తరవాత గాలి చొరని డబ్బాలో భద్రపరచాలి. పాకం ఉండలు కావలసినవి::: బియ్యం - 250 గ్రా., బెల్లంతురుము - 100 గ్రా., ఏలకులపొడి - టీ స్పూను, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా. తయారి: ఒక గిన్నెలో చిన్నగ్లాసుడు నీరు పోసి మరిగించాలి ఏలకులపొడి, బెల్లంతురుము వేసి కరిగేవరకు ఉంచాలి బియ్యప్పిండి కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచాలి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కాగిన నూనెలో వేసి వేయించి తీసేయాలి. - డా.వైజయంతి