breaking news
Board of Approval
-
ఐవోసీ రైట్స్కు బోర్డు ఓకే
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) రైట్స్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 22,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలియజేసింది. ఇటీవల రైట్స్ ఇష్యూకి వెళ్లేందుకు మరో చమురు పీఎస్యూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) బోర్డు సైతం అనుమతినివ్వగా.. నంబర్ వన్ కంపెనీ ఐవోసీ తాజాగా జత కలిసింది. వెరసి రెండు సంస్థలూ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా భారీగా పెట్టుబడులను సమకూర్చుకోనున్నాయి. రైట్స్ జారీ ద్వారా వివిధ ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయాలకు నిధులు సమకూర్చుకోనున్నట్లు ఐవోసీ పేర్కొంది. వెరసి కంపెనీలో ప్రమోటర్గా కేంద్ర ప్రభుత్వం సైతం రైట్స్కు సబ్ర్స్కయిబ్ చేయడం ద్వారా పెట్టుబడులు సమకూర్చనుంది. కర్బన ఉద్గారరహిత ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చమురు పీఎస్యూలకు పెట్టుబడులు అందించే ప్రణాళికల్లో ఉన్న నేపథ్యంలో రైట్స్ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది. రూ. 18,000 కోట్లకు సై పీఎస్యూ దిగ్గజం బీపీసీఎల్ బోర్డు గత నెల (జూన్) 28న రైట్స్ ఇష్యూకి అనుమతించింది. తద్వారా కంపెనీ రూ. 18,000 కోట్లు సమీకరించేందుకు గ్రీన్సిగ్నల్ లభించింది. ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో ఇంధన రంగ పీఎస్యూలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్పీసీఎల్లకు మొత్తం రూ. 30,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకునేందుకు ప్రతిపా దించిన సంగతి తెలిసిందే. తద్వారా కర్బన ఉద్గార రహిత సన్నాహాలకు మద్దతిచ్చేందుకు నిర్ణయించింది. ఇక ఓఎన్జీసీకి మెజారిటీ వాటా గల మరో పీఎస్యూ హెచ్పీసీఎల్.. ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా ప్రభుత్వ పెట్టుబడులు సమకూర్చుకునే వ్యూహాల్లో ఉంది. కాగా.. గత నెలలో ఐవోసీ అధీకృత వాటా మూలధనాన్ని రెట్టింపునకు అంటే రూ. 30,000 కోట్లకు పెంచుకున్న సంగతి తెలిసిందే. జేవీ బాటలో దేశీయంగా బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్ నిర్వహించేందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ పేర్కొంది. ఇందుకు బోర్డు తాజాగా అనుమతించినట్లు వెల్లడించింది. సన్ మొబిలిటీ పీటీఈ లిమిటెడ్, సింగపూర్తో సమాన భాగస్వామ్యాన(50:50 శాతం వాటా) ప్రయివేట్ రంగ జేవీకి తెరతీయనున్నట్లు వివరించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంవరకూ రూ. 1,800 కోట్ల ఈక్విటీ పెట్టుబడులతో జేవీని ఏరా>్పటు చేయనున్నట్లు తెలియజేసింది. సొంత అనుబంధ సంస్థ ఐవోసీఎల్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, సింగపూర్లో ఫ్రిఫరెన్స్ షేర్లు, వారంట్ల ద్వారా 78.31 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు సైతం బోర్డు ఓకే చెప్పినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 0.8 శాతం బలపడి రూ. 99.40 వద్ద ముగిసింది. 13న ఎన్ఎస్ఈలో త్రిధ్య లిస్టింగ్ ఐపీవోతో రూ. 26 కోట్లు సమీకరణ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థ త్రిధ్య టెక్ ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ నెల 13న లిస్ట్కానుంది. కంపెనీ షేరుకి రూ. 35–42 ధరలో చేపట్టిన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 26.41 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా 62.88 లక్షల షేర్లను విక్రయించింది. జూన్ 30– జూలై 5 మధ్య చేపట్టిన ఇష్యూకి 72 రెట్లు అధిక స్పందన లభించింది. ప్రధానంగా సంస్థాగతేతర, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించినట్లు కంపెనీ వెల్లడించింది. నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 183 రెట్లు, రిటైలర్ల నుంచి 68 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలైనట్లు కంపెనీ వెల్లడించింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 16 రెట్లు అధిక స్పందన నమోదైంది. కాకా ఇండస్ట్రీస్ ఐపీవో 10న షేరుకి రూ. 55–58 ధరల శ్రేణి న్యూఢిల్లీ: పాలిమర్ ఆధారిత ప్రొఫైల్స్ తయారీ కంపెనీ కాకా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 10న(సోమవారం) ప్రారంభంకానుంది. 12న (బుధవారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రే ణి రూ. 55–58కాగా.. చిన్న, మధ్యతరహా సంస్థ ల కోసం ఏర్పాటైన బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫా మ్ ద్వారా లిస్ట్కానుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 36.6 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ.21.23 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. -
62 సెజ్లు రద్దు!
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్)పై డెవలపర్లకు ఆసక్తి సన్నగిల్లినట్లుంది. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ సహా 62 సెజ్లను రద్దు చేయాలన్న ప్రతిపాదనలపై జూలై 3న జరిగే కేంద్ర వాణిజ్య శాఖ ‘బోర్డ్ ఆఫ్ అప్రూవల్’ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 62 సెజ్లకు సంబంధించిన అనుమతుల (ఎల్వోఏ) గడువు పొడిగించాలని కోరుతూ డెవలపర్ల నుంచి ఎటువంటి దరఖాస్తులు రాలేదు. కొన్నింటిని రద్దు చేయాలని కోరుతూ అభ్యర్థనలు మాత్రం వచ్చాయి. దీంతో ఈ అంశాన్ని నిర్ణయం తీసుకునేందుకు బోర్డు సమావేశం ఎజెండాలో చేర్చారు. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ స్వేచ్ఛా వాణిజ్య, వేర్హౌసింగ్ జోన్ను ఏర్పాటు చేయాలనుకోగా, దీన్ని చేపట్టలేనంటూ స్పష్టం చేసింది. రద్దు కానున్న సెజ్లలో ఢిల్లీ రాష్ట్ర పారిశ్రామిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, లార్క్ ప్రాజెక్ట్స్, మానససరోవర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డైమండ్ ఐటీ ఇన్ఫ్రాకాన్ చేపట్టిన సెజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మే 1 నాటికి ప్రభుత్వం 421 సెజ్లకు అనుమతులు జారీ చేయగా వీటిలో 218 మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించాయి. మరోవైపు 2016–17 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న సెజ్ల నుంచి ఎగుమతులు 12 శాతం వృద్ధి చెంది రూ.5.24 లక్షల కోట్లకు చేరాయి. రూ.4.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఇవి ఆకర్షించగా, 17.31 లక్షల మందికి ఉపాధి కల్పించాయి. -
తెలంగాణలో కాగ్నిజంట్ సెజ్ !
రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటుకు కంపెనీ ప్రతిపాదన న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రత్యేక ఆర్థిక మండలం(స్పెషల్ ఎకనామిక్ జోన్-సెజ్) ఏర్పాటు చేయటానికి సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజంట్ టెక్నాలజీస్ కేంద్రాన్ని అనుమతి కోరింది. ఈ నెల 23న జరిగే బోర్డ్ ఆఫ్ అప్రూవల్(బీఓఏ)లో ఈ ప్రతిపాదన పరిశీలనకు రానున్నది. వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 2.51 ఎకరాల్లో కాగ్నిజంట్ సంస్థ ఒక ఐటీ/ఐటీఈఎస్ సెజ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ నెల 23న జరిగే సమావేశంలో మరో ఎనిమిది సెజ్ ప్రతిపాదలను బీఓఏ పరిశీలించనున్నది. వీటిల్లో.. సెజ్ అభివృద్ధికి మరింత గడువు కోరిన కాకినాడ పోర్ట్ ట్రస్ట్, జీపీ రియల్టర్స్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్30న జరిగిన సమావేశంలో 13 సెజ్ డెవలపర్లకు ప్రభుత్వం మరింత గడువునిస్తూ నిర్ణయం తీసుకుంది. 19 మంది సభ్యులు గల బీఓఏృబందం సెజ్ సంబంధిత వ్యవహారాలను చూస్తోంది. ఈ సంస్థ సెజ్ డెవలపర్లకు సింగిల్ విండో క్లియరెన్స్లనిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్కాలానికి సెజ్ల నుంచి 2.21 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి ఈ సెజ్లు 15.44 లక్షల ఉద్యోగాలను కల్పించాయి. ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా ఉన్న సెజ్లు... కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) విధింపు కారణంగా ప్రాభవాన్ని కోల్పోయాయి. మ్యాట్ను తొలగించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖను కోరుతోంది.