breaking news
Best women
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అందమైన మహిళలు
-
మైండ్ హెల్త్: పల్లె మహిళే మెరుగు..
పల్లె మహిళ పట్టణ మహిళను దాటి ముందుకెళుతుందా?! ‘అవును’ అనే అంటున్నారు మానసిక నిపుణులు. సమస్యలు ఎదురైనా ఏ మాత్రం జంకక పరిష్కార దిశగా అడుగు వేయడంలో పల్లె మహిళే పట్టణ మహిళ కన్నా ముందంజలో ఉందని పెన్సిల్వేనియా ఉమెన్ హెల్త్ స్టడీ ఓ నివేదికను రూపొందించింది. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న పట్టణ–గ్రామీణ మహిళలపై వీరు చేసిన స్టడీ ద్వారా ఆసక్తికర విషయాలు తెలియ జేశారు. మానసిక సమస్యలు గ్రామీణ మహిళ కన్నా పట్టణ మహిళల్లో ఎక్కువ శాతం ఉన్నట్టు గమనించారు. దీనికి సంబంధించిన కారణాలను విశ్లేషించారు. పల్లె జీవనమే సాంత్వన ‘పట్టణ మహిళ కుటుంబంలో ఉన్నప్పటికీ మానసికంగా ఒంటరితనాన్నే ఫీలవుతుంది. వచ్చిన ఆదాయానికి, పెరుగుతున్న ఖర్చులకు పొంతన ఉండదు. ఇంటర్నెట్ వాడకం కూడా ఇందుకు కారణమే. పల్లెల్లోనూ ఈ ప్రభావం ఉన్నప్పటికీ అక్కడ శారీర శ్రమకు సంబంధించిన పనులు ఎక్కువ. దీనికి తోడు వెన్నంటి భరోసాగా ఉండే వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. తమ సమస్యలను తమలోనే దాచుకుని బాధపడరు. చుట్టుపక్కల ఇళ్ల వారిలో ఎవరికో ఒకరికి చెప్పుకుని ఊరట పొందుతారు. అక్కడ అవకాశాలు తక్కువ. అలాగే, అసంతృప్తులూ తక్కువే’ అంటారు క్లినికల్ సైకాలజిస్ట్ రాధిక. ఎప్పుడైతే సెన్సిటివ్గా, సమస్యలు లేకుండా పెరుగుతారో వారిలో అభద్రతా భావం ఎక్కువ అంటారు నిపుణులు. పల్లెల్లో చిన్నప్పటి నుంచే కష్టపడే తత్త్వం ఉంటుంది. ఇంటి పనులు, బయట పనులు ఒక అలవాటుగా చేసుకుపోతుంటారు. తమకు అవి కావాలనీ, ఇవి కావాలనీ అంచనాలు, ఆశలు పెద్దగా ఉండవు. శారీరకపరమైన పనుల్లో కలిగే అలసట మనసును కూడా సేద తీరుస్తుంది. వాస్తవానికి దగ్గరగా ఉండేలా చేస్తుండటం కూడా మానసిక సమస్యలను దూరం చేస్తుందంటారు నిపుణులు. యాక్సెప్టెన్సీ ఎక్కువ వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల దేనిమీదా ఎక్కువ ఆశలు పెట్టుకోరు. అవి తమ జీవిత భాగస్వామి నుంచైనా సరే. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి.. అనే విషయాల పట్ల సరైన అవగాహన ఉంటుంది. రిసోర్స్ మేనేజ్మెంట్ పల్లెవాసులకే బాగా తెలుసు. అందుకే ఎక్కువ ఒత్తిడికి లోనవరు. వారికి వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే సమస్యలే అధికం. మిగతావన్నీ వాటి ముందు చిన్నవిగానే కనిపిస్తాయి. పిల్లలకు కూడా ఆ వాస్తవాన్ని పరిచయం చేస్తారు. ఇల్లు, సమాజం నేర్పే పాఠాలు వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి. పట్టణప్రాంతాల్లో అవకాశాలు కోకొల్లలు. వాటి వల్ల వచ్చే సమస్యలు అంతే! అవి అందరికీ అందుబాటులో ఉండవు. వాటిని అందుకోవడం కోసం ఎలా పరుగులు పెట్టాలా అనే ఆలోచనతో ఉంటుంది పట్టణ మహిళ. తన చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడంతో తనను తాను తక్కువ చేసుకుంటుంది. ఫలితంగా రోజు రోజుకూ తనపై తనకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పల్లెటూరులో ఉన్నవాళ్లు కదా వాళ్లకేం తెలుసు అనేది పట్టణవాసుల అలోచన. కానీ, పల్లెటూరులో ఎప్పుడూ కష్టమే ఉంటుంది. వాటిని ఎదుర్కొనే సమర్థతా ఉంటుంది. నీడపట్టున ఉండే నగరవాసులే కష్టాన్ని ఎదుర్కోలేని సున్నితత్త్వం ఉంటుంది. పట్టణ మహిళ మారాలి పల్లెటూరులో ఉన్నప్పుడు ఏడుపు వస్తే పరిగెత్తుకెళ్లి అమ్మ ఒడిలో తలదాచుకోవడం తెలుసు. చెట్టు కింద సేద తీరడం తెలుసు. మట్టికి దగ్గరగా ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలుసు. పట్టణ జీవనంలో ఎవరికి వారే. ఎవరితోనూ పంచుకోలేని సమస్యలు. కష్టాలు వస్తే ఎదుర్కొనే ధైర్యం సన్నగిల్లుతోంది. అందుకే, ముందు ఇంట్లో మహిళ మనస్తత్వం మారాలి. నెలకు ఒకసారైనా పట్టణం వదిలి, పల్లె వాతావరణంలోకి వెళ్లగలగాలి. ఒత్తిడి దశలను దాటే మార్గాలను పల్లెలే పరిచయం చేస్తాయని గ్రహించాలి. స్వచ్ఛందంగా సమాజానికి ఏ చిన్న పని చేసినా, మానసిక సాంత్వన లభిస్తుందని గ్రహించాలి. పిల్లలకు కూడా ‘నేను పడిన కష్టాన్ని నా పిల్లలు పడకూడదు’ అనుకోకుండా వారికి మన భారతీయ మూలాలను తెలియజేయాలి. – రాధిక ఆచార్య, క్లినికల్ సైకాలజిస్ట్ -
సవాంగ్ స్ఫూర్తితోనే అవార్డు
సాక్షి, అమరావతి: ఐపీఎస్ అధికారి డీజీపీ గౌతమ్ సవాంగ్ తనకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని యునైటెడ్ నేషన్స్(యూఎన్) ఉత్తమ మహిళా పోలీస్ అవార్డుకు ఎన్నికైన డోరిన్ మెలాంబో ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల గొప్పతనాన్ని చాటుతోంది. జాంబియాకు చెందిన మెలాంబో తనకు ఐరాస ప్రతిష్టాత్మక అవార్డు లభించిన సందర్భంగా అంతర్జాతీయ మీడియా చానల్ ‘స్టార్ట్ న్యూస్ గ్లోబల్’ ప్రతినిధి అమితాబ్ పి.రవికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మెలాంబో ప్రత్యేకంగా సవాంగ్కు కృతజ్ఞతలు తెలపడం విశేషం. మెలాంబో వీడియో క్లిప్ పోలీసుల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్గా మారింది. స్ఫూర్తి నింపిన సవాంగ్కు కృతజ్ఞతలు.. ‘ఈ ఏడాది యూఎన్ ఉత్తమ మహిళా పోలీస్ అధికారిగా ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా ఉంది. నేను యూఎన్ బెస్ట్ పోలీస్ అధికారిగా ఎన్నిక కావటానికి స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయుడు భారత్కు చెందిన ఐపీఎస్ అధికారి డీజీపీ గౌతమ్ సవాంగ్. 2008లో యూఎన్ పోలీస్ విభాగంలో ప్రయాణాన్ని ప్రారంభించా. అప్పటి నుంచి సవాంగ్ నాకు దిశానిర్దేశం చేసి సమర్థవంతమైన అధికారిణిగా నిలిచేలా దోహదం చేశారు. ఈ వీడియోను ఆయన వీక్షిస్తారని ఆశిస్తున్నా’ అని మెలాంబో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గౌతమ్ సవాంగ్ 2008లో యూఎన్ మిషన్ ఇన్ లైబీరియాకు పోలీస్ కమిషనర్గా వ్యవహరించారు. 40 దేశాలకు చెందిన పోలీస్ అధికారులకు సారథ్యం వహించారు. -
ఆసియాలో అత్యంత ఆకర్షణీయ ‘దీపిక’
లండన్: ఆసియాలో అత్యంత ఆకర్షణీయ మహిళగా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ నిలిచారు. 50 మందితో కూడిన జాబితాలో ఆమె అగ్రస్థానం పొందారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న వార పత్రిక ‘ఈస్టర్న్ ఐ’ ఈ జాబితాను విడుదల చేసింది. వివాదాలకు దూరంగా ఉండే దీపికా పదుకోన్..ఎంత ఎదిగినా వినయ విధేయతలతో మెలగడం ఆమె విశిష్టత అని ఆ పత్రిక ఫీచర్స్ ఎడిటర్ నజీర్ అన్నారు. గతేడాది తొలిస్థానంలో నిలిచిన ప్రియాంక చోప్రా ఈ ఏడాది రెండో ర్యాంక్ పొందారు. బుల్లితెర నటి నియా శర్మకు మూడో స్థానం దక్కింది. పాకిస్తాన్ నటి మహిరా ఖాన్కు నాలుగు, శివంగి జోషికి 5, ఆలియా భట్కు 6, సోనమ్ కపూర్కు 7, హినాఖాన్కు 8, కత్రినా కైఫ్కు 9, నీతి టేలర్కు 10వ స్థానాలు దక్కాయి. -
24 మంది ఉత్తమ మహిళలు
మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: విశిష్ట మహిళలకు విశేష గౌరవం దక్కనుంది. 13 రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన 24 మంది ఉత్తమ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేయనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఉత్తమ మహిళలకు రూ.లక్ష నగదు బహుమతి, అవార్డులు అందజేసి సత్కరించనుంది. అవార్డుకు ఎంపికైనవారికి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే సమాచారం అందజేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.