breaking news
beauty pageants
-
ఇక్కడి సంస్కృతికి ఫిదా అయ్యాం
తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ బ్యూటీ పాజెంట్లో భాగంగా ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’ ఈవెంట్ కూడా పూర్తయింది. ఇందులో టర్కీ, వేల్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జాంబియా దేశాలకు చెందిన సుందరీమణులు గెలుపొందారు. వాళ్ల పరిచయాలు..బుద్ధవనం ప్రాజెక్ట్ వెరీ వెరీ స్పెషల్– ఇడిల్ బిల్గెన్, మిస్ టర్కీమిస్ వరల్డ్ పాజెంట్లో భాగంగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో విజేతగా నిలిచింది మిస్ టర్కీ ఇడిల్ బిల్గెన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘ఈ రోజు నాకు చాలా స్పెషల్. నా దేశానికిప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగానూ చాలా ఉత్సాహంగానూ ఉన్నాను. ఈ హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో ముందంజలో ఉండటం మరింత ఆనందం. మహిళల భద్రత, సాధికారత, విద్య, సాంస్కృతిక గుర్తింపు, మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా ప్రభావం, వాతావరణ మార్పుల... ఇలా విభిన్నమైన టాపిక్స్తో హెడ్ టు హెడ్ చాలెంజింగ్ రౌండ్ గడిచింది. ఎక్కడైనా మహిళల విజయానికి చదువు చాలా ముఖ్యమైనది. ఏ దేశంలోనైనా అభివృద్ధి, సాధికారిత రెండూ కలిసి ప్రయాణించాలి. జనాభాలో సగం మంది వెనకబడి ఉంటే మనం విజయం సాధించలేం. ఇక్కడ మహిళలు వెనుకబడి ఉండకుండా ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. సాంకేతికత, వైద్యపురోగతికి ఈప్రాంతం కేంద్రంగా ఉంది. ప్రజల ఆప్యాయత, ప్రేమ, దయాగుణం, ఇక్కడి సంస్కృతి హైలైట్ చేస్తున్నాయి. ఇవే విషయాలను వేదికపై నుంచి వినిపించాను. తెలంగాణలోని టూరిజం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా బుద్ధవనం ప్రాజెక్ట్ వెరీ వెరీ స్పెషల్. అక్కడ మాంక్స్ చదివే మంత్రాలు ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి. నేను రేడియేషన్ అంకాలజీలో మెడిసిన్ చేస్తున్నాను. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. ‘నేనొక వైద్యురాలిని, అంతేకాదు నేను ఒక టర్కిష్ మహిళను. మిస్ వరల్డ్లో టర్కిష్ మహిళల గొంతుగా నేను ఉండాలనుకుంటున్నాను’ అని వేదికపై వివరించాను. బ్యూటీ విత్ ఎ పర్పస్ప్రాజెక్ట్లో భాగంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవగాహనకు కృషి చేస్తున్నాను. ఒక వైద్యురాలిగా క్యాన్సర్ రోగులకు సహాయకారిగా ఉండటం నా బాధ్యత. క్రీడలు అంటే చాలా ఇష్టం. మానసిక ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి క్రీడలు, జిమ్ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అసాధ్యం అనేది మన డిక్షనరీలో ఉండకూడాదు. ఎలాంటి సమస్య వచ్చినా దానిని అధిగమించగలను, సాధించగలను అనే ఆలోచన మనలో ధైర్యాన్ని నింపుతుంది. విజయాలను మన ముందుంచుతుంది’ అంటూ వివరించింది ఇడిల్.యువతకు చదువు చాలా ముఖ్యం– మిల్లీ మే ఆడమ్స్, మిస్ వేల్స్మిస్ వరల్డ్ పాజెంట్లో భాగంగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్ టాప్ టెన్ జాబితా యూరప్కుప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ వేల్స్ మిల్లీ మే ఆడమ్స్ టాప్ టెన్ జాబితాలోకి చేరింది. ఈ సందర్భంగా మిల్లీ మాట్లాడుతూ – ‘‘ఈ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది. స్వతహాగా పర్యటనలు చేయడం, చారిత్రక ప్రదేశాలు సందర్శించడం అంటే నాకు చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడు గొప్ప గొప్ప కట్టడాలను సందర్శిస్తుంటాను. అందులో భాగంగా గతంలో ఇండియాకు వచ్చినప్పుడు తాజ్మహల్ని సందర్శించాను. ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పాజెంట్లో భాగంగా హెరిటేజ్ టెంపుల్స్, చార్మినార్ చాలా బాగా నచ్చాయి. ఇక్కడి శిల్పనిర్మాణం అద్భుతం అనిపిస్తుంది. ట్రిప్స్ చాలా ఎంజాయ్ చేశాం. ఇక్కడి సంస్కృతితో పాటు మహిళల సాధికారిత గురించి తెలుసుకున్నాను. ప్రభుత్వాలు అందిస్తున్న రక్షణ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఫ్రీ బస్ సౌకర్యం గురించి తెలుసుకున్నాం. బ్యూటీ విత్ ఎ పర్పస్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ రౌండ్లో 20 మందితో పోటీపడ్డాను. పోటీలో నా వర్క్స్ గురించి, చదువుప్రాముఖ్యత గురించి అడిగారు. నేను వేల్స్లో మెడిసిన్ చదువుతున్నాను. స్ట్రీట్ డాక్టర్స్ అనే జాతీయసంస్థతో కలిసి పనిచేయడంతో పాటు, యువతకు చదువు ఎంత అవసరమో వివరిస్తూ, పాఠశాల విద్య పట్ల అవగాహన కల్పిస్తున్నాను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అందాల పోటీల ద్వారా నిధుల సేకరించి, ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన పిల్లలకు మద్దతుగా నిలుస్తున్నాను. నా విజయానికి ఇవన్నీ ఉపకరించాయి. యువతులు, బాలికలకు తమపై తమకు పూర్తి విశ్వాసం ఉండాలి. అప్పుడు ప్రపంచంలో ఏదైనా సాధించడానికి మనకు సహకారం అందుతుంది. కోరుకున్న జీవితాన్ని గడపటానికి మహిళకు సాధికారతతో పాటు దయ, వినయం కూడా ఉంటే ఎక్కడ ఉన్నా రాణిగా వెలిగిపోతాం’’ అంటూ అందమైన నవ్వుతో సమాధానమిచ్చింది మిస్ వేల్స్.పెళ్లి తప్పించుకుని మెడిసిన్ చదివాఫేత్ వాలియా, మిస్ జాంబియా‘‘వృత్తిరీత్యా డాక్టర్ని. నాకు ఒక తమ్ముడు. మా అమ్మ పాస్టర్. నాన్న కార్పెంటర్. మేము లుసాకాలో ఉంటాం. నాకు ముందునుంచీ అందాల పోటీలంటే ఇష్టం. నాకు పదిహేనేళ్లున్నప్పుడు మొదటిసారిగా అందాల పోటీల్లో పాల్గొన్నాను. గెలిచాను కూడా! బ్యూటీ అంటే నా దృష్టిలో ఆత్మవిశ్వాసం. మా దగ్గర బాల్య వివాహాలు ఎక్కువ. నన్నూ బాల్య వివాహానికి సిద్ధం చేసింది మా సమాజం. అయితే బాగా చదువుకుని మా దేశంలోని ఆడపిల్లల తలరాతను మార్చాలి అనుకునేదాన్ని. మా ఆర్థిక పరిస్థితి బాలేనందువల్ల నా పదహారవ ఏట నాకు పెళ్లి చేసేయాలనే ఒత్తిడి తెచ్చారు మా కమ్యూనిటీ పెద్దలు. కానీ నేను తలవంచలేదు. ఆ పెళ్లిని తప్పించుకున్నాను. కష్టపడి మెడిసిన్ చదివాను. అప్పుడు గనుక నేను ఆ తెగువ చూపించక పోయుంటే ఈ రోజు మీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. నా ఈ కథను ప్రపంచానికి చెప్పి, ఆడపిల్లలకు మానసిక స్థయిర్యాన్ని, స్ఫూర్తిని పంచడానికి అందాల పోటీలు ఓ వేదికగా కనిపించాయి. మన కథను వినిపించే, మన వ్యక్తిత్వాన్ని తెలియజేసే అవకాశాన్నిస్తాయి. అందుకే ఎలాగైనా ఈ ప్లాట్ఫామ్ దాకా రావాలనుకున్నాను. వచ్చాను.వాయిస్ ఆఫ్ ఫెయిత్ జీవితంలో గెలవడానికి ఉపయోగపడేవి చదువు, నైపుణ్యం మాత్రమే. నా బ్యూటీ విత్ ఎ పర్పస్ కూడా అదే! ‘వాయిస్ ఆఫ్ ఫేత్’ అనే ఫౌండేషన్ ద్వారా అట్టడుగు వర్గాల పిల్లలకు చదువుప్రాధాన్యాన్ని తెలియజెబుతున్నాను. సేంద్రియ సాగు విధానాలను నేర్పి.. వాళ్ల సుస్థిర ప్రగతికి పాటుపడే ప్రయత్నం చేస్తున్నాను. సాంకేతిక రంగంలో వాళ్లు నైపుణ్యం సాధించేలా శిక్షణనిప్పిస్తున్నాను. ఈ పనులన్నీ ఎలా చేస్తున్నానో ‘హెడ్ టు హెడ్ చాలెంజ్ (బ్యూటీ విత్ ఎ పర్పస్)’ రౌండ్లో ప్రెజెంట్ చేశాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, సాంకేతిక రంగాల్లో తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతున్నట్టుంది. అధిక జనాభా, తక్కువ భూభాగం లాంటి సవాళ్లతో కూడా ఇండియా సాధించిన ఈ ప్రగతి చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్రజల అవసరాల పట్ల ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి ప్రశంసనీయం. తెలంగాణ సంస్కృతికి, ఆతిథ్యానికీ నేను ఫిదా అయ్యాను. మా దేశం కూడా ఈ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మిస్ జాంబియా ఫేత్ వాలియా.తెలంగాణ మినీ ఇండియా– అనా లీజ్ నాన్సాన్, మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో‘‘మాది పెద్ద కుటుంబం. మేము మొత్తం ఎనిమిది మంది పిల్లలం. అందరిలోకి నేనే పెద్ద. అందుకే అన్ని విషయాల్లో నా తోబుట్టువులకు నేనో మార్గదర్శిగా ఉండాలని కోరుకునేదాన్ని! మా నాన్న ఇంజినీర్, అమ్మ గృహిణి. చదువు విషయంలో నాకు మా నాన్నే స్ఫూర్తి. ఇంగ్లండ్లో సివిల్ ఇంజినీరింగ్ చదివాను. ఇప్పుడు మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను. పర్యావరణహిత నిర్మాణాలు నా లక్ష్యం. నేను అథ్లెట్ కూడా! ఫుట్బాల్ ప్లేయర్ని. బ్యూటీ పాజెంట్లో పాల్గొనడానికి నాకు ప్రేరణ.. ఇందులోని ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ సెగ్మెంట్. ఇందులో నేను నమ్మే సుస్థిర అభివృద్ధి, హ్యాపీ లివింగ్ వంటివాటి గురించే చెప్పే అవకాశం దొరుకుతుందని అనుకున్నాను. నా బ్యూటీ విత్ ఎ పర్పస్ కూడా అదే! ‘ద రిపుల్ ఎఫెక్ట్’ అనే సంస్థను స్థాపించాను. స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా సస్టెయినబుల్ కమ్యూనిటీస్ని ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ముఖ్యంగా నిస్సహాయ మహిళల సాధికారత, పిల్లల చదువు కోసం పనిచేస్తున్నాను. మా దేశానికి వలసలు ఎక్కువ. ఆ పిల్లలకు స్థానిక భాషలు, ఇంగ్లిష్ వంటివి రాక చదువుకు దూరమవుతున్నారు. అందుకే ట్రినిడాడ్లోని ‘విస్డమ్ సియోరామ్’ అనే ఓ టెక్నాలజీ కంపెనీ సహాయంతో ఆ పిల్లలకు పలు భాషలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. నేను అథ్లెట్ని కూడా కాబట్టి స్పోర్ట్స్ మీదా ఫోకస్ చేస్తున్నాను. ఆటలతో శారీరక దృఢత్వమే కాదు ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా అలవడుతుంది. అందుకే పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించే ప్రయత్నమూ చేస్తున్నాను. ముఖ్యంగా స్విమ్మింగ్లో. ఎందుకంటే అది లైఫ్ స్కిల్ కాబట్టి. స్థానిక వనరులతో గ్రీన్ బిల్డింగ్ టెక్నిక్స్ని చెప్పే పాడ్కాస్ట్ చానెల్నూ స్టార్ట్ చేశాను. ఇందులో ఇంజినీర్స్, ఆర్కిటెక్ట్స్, పర్యావరణవేత్తలను ఇంటర్వ్యూ చేస్తుంటాను. అంతేకాదు మొక్కలు నాటే కార్యక్రమాలూ నిర్వహిస్తుంటాను. ఇవన్నీ నా బ్యూటీ విత్ ఎ పర్పస్లో భాగాలే!కలర్ఫుల్గా.. ఇండియా గురించి విన్నాను. కానీ తెలంగాణ స్టేట్ గురించి ఎప్పుడూ వినలేదు. తెలంగాణ మినీ ఇండియాలా అనిపించింది. మాలాగే ఇక్కడా భిన్న మతాలు, భిన్న సంస్కృతీసంప్రదాయాలు కనిపించాయి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడి ఫుడ్ స్పైసీగా ఉన్నప్పటికీ చాలా బాగుంది. సో డిలీషియస్. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనిపించేలా ఉంది తెలంగాణ ఆతిథ్యం! చాలా హ్యాపీ!’’ అన్నారు అనా లీజ్ నాన్సాన్ఇంటర్వ్యూలు: నిర్మలారెడ్డి, సరస్వతి రమ -
స్వేచ్ఛగా .. రెక్కలు విప్పేలా...
అమ్మాయిలకు చదువు కాదుకదా.. కనీసం వ్యక్తిగత శుభ్రత పాటించే వెసులుబాటు కూడా లేని చోట అందాల పోటీలంటే ఆనందంగా సాగనంపుతారా? పంపరు! అయోమ్ టీటో మతీజ్కు కూడా తీవ్ర నిరసన ఎదురైంది! అయినా వెనకడుగు వేయకుండా అందాల పోటీలకు అటెండ్ అయింది.. మిస్ సౌత్ సుడాన్గా కిరీటం ధరించి మిస్ వరల్డ్కి పోటీపడ్డానికి హైదరాబాద్ చేరుకుంది. తన దేశ పరిస్థితులు, వ్యక్తిగత వివరాలు, తన లక్ష్యం వగైరా ఆమె మాటల్లోనే...‘‘లా చదివాను. లీగల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. సౌత్ సుడాన్లో పుట్టాను. కానీ అక్కడి రాజకీయ అనిశ్చితి వల్ల మా అమ్మ మమ్మల్ని తీసుకుని కెనడాకు వలస వచ్చేసింది. అందుకే నేను అక్కడే పెరిగాను. మా నాన్న, ఆయన తరపు, అమ్మ తరపు బంధువులంతా సౌత్ సుడాన్లోనే ఉండిపోయారు. మా అమ్మ కెనడాలో టీచర్గా ట్రైన్ అయ్యి, మా సొంత దేశంలోని పిల్లలకు మంచి స్కూల్ను ఏర్పాటు చేయడానికి తిరిగి సుడాన్ వచ్చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2019లో నేను మా కుటుంబాన్ని చూడ్డానికి నా సొంత దేశానికి వెళ్లాను. ఎమోషనలే కాదు.. కొంచెం షాక్ కూడా అయ్యాను. కెనడాలో నేను ఆస్వాదించిన జీవితం, సౌత్ సుడాన్లో మా వాళ్లంతా అనుభవిస్తున్న జీవితాన్ని బేరీజు వేసుకుని. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నా దేశ ప్రజలకూ ఉన్నత ప్రమాణాల జీవితం అందేలా కృషి చేయాలని! కోవిడ్ తర్వాత వచ్చేశాను. సర్వీస్ మొదలుపెట్టాను. నా బ్యూటీ విత్ పర్పస్ అదే!అందాల పోటీలకు వ్యతిరేకంఅందాల పోటీల పట్ల సౌత్ సుడాన్లో చాలా వ్యతిరేకత ఉంది. నేను మిస్ సౌత్ సుడాన్ పాజెంట్లో పాల్గొంటున్నప్పుడు, ఇప్పుడు కూడా నిరసన ఎదురైంది. కానీ నా దృష్టిలో ఈ పోటీలు స్కిన్ షో కాదు. వైవిధ్యమైన సంస్కృతులు, భాషలు, జీవనశైలులను పరిశీలించే, అధ్యయనం చేసే అవకాశాన్నిచ్చే వేదిక. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సర్దుబాటు, సహనాన్ని నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా నా సామాజిక బాధ్యతను మెరుగ్గా నిర్వర్తించేందుకు తోడ్పడతాయి. అందుకే నిరసనను ఎదుర్కొని మరీ ఈ పోటీకి వచ్చాను. అంతేకాదు ఈ పోటీలు ఒకరినొకరు తెలుసుకుని, అర్థం చేసుకుని, ఒకరికొకరు సాయం అందించుకునే స్ఫూర్తినీ పంచుతాయి. మహిళలకు అలాంటి స్ఫూర్తి, ప్రేరణ అవసరం. దానికి అందాల పోటీలే కావాలా అంటారేమో! స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి ప్రపంచ వ్యాప్తంగా పాతుకుపోయి.. అది స్త్రీల సహజ లక్షణమనే అభిప్రాయమూ అంతే లోతుగా నాటుకుపోయింది. దాన్ని అబద్ధమని నిరూపిస్తున్నాయి ఈ పోటీలు! కొన్ని దేశాల పేర్లే తెలియవు నేనీ కంటెస్ట్కి వచ్చేదాకా! అందుకే పట్టుబట్టి మరీ ఈ పోటీకి వచ్చాను. ఇక్కడి వైవిధ్యత, ఆధ్యాత్మికత నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఈ దేశంలోని వాళ్లను చూస్తే నాకు ఫారినర్స్గా అనిపించరు. మా వాళ్లలాగే అనిపిస్తారు. ఎప్పుడో ఎక్కడో తప్పిపోయి.. ఇప్పుడు కలుసుకుంటున్నామేమో అనిపిస్తోంది! తెలంగాణ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడి ఎడ్యుకేషన్, మెడికల్ కేర్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రపంచ ప్రమాణాలతో పోటీపడుతున్నాయి. సౌత్ సుడాన్ యువత తమ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కే వస్తోంది. మా దేశంలోని చాలామంది ప్రజలు ఆరోగ్య అవసరాల కోసం ఇక్కడి హాస్పిటల్స్నే ఆశ్రయిస్తున్నారు.బాల్య వివాహాలు.. బలవంతపు పెళ్లిళ్లుప్రపంచంలోని అనేక దేశాల్లాగే సౌత్ సుడాన్లోనూ పురుషాధిపత్యమే! కొడుకుకేప్రాధాన్యం. అమ్మాయికి వ్యక్తిగత శుభ్రత విషయంలోనూ ఆర్థికపరమైన వెసులుబాటు ఉండదు. బాల్యవివాహాలు, బలంతపు పెళ్లిళ్లు కామన్. ఇక చదువుకునే అవకాశమెక్కడిది? నేను ఇక్కడిదాకా రాగలిగాను అంటే మా అమ్మే కారణం. మమ్మల్ని ఆమె కెనడా గనుక తీసుకువెళ్లకపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో (ఈ మాట చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు). నాకింకా గుర్తు.. ఆమె లగేజ్ సర్దుతుంటే ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’ అని అడిగాను. ‘మీరు స్వేచ్ఛగా మీకు నచ్చింది చదువుకునే చాన్స్ ఉన్నచోటికి’ అని చెప్పింది! మేం నలుగురు అక్కచెల్లెళ్లం. మాకొక తమ్ముడు. అందరినీ సింగిల్ పేరెంట్గానే పెంచింది అమ్మ. ఎలాంటి అవకాశాల కోసం అమ్మ మమ్మల్ని కెనడాకు తీసుకెళ్లిందో అలాంటి అవకాశాలనే సౌత్ సుడాన్లోని అమ్మాయిలకూ కల్పిస్తోంది తాను నడిపిస్తున్న స్కూల్ ద్వారా! ఆమె చేస్తున్న ఆ సర్వీస్కి నేనూ శాయశక్తుల సాయపడుతున్నాను. మా దేశంలోని యంగ్ గర్ల్స్కి నేను మెంటర్గా ఉండాలి! వాళ్ల కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్లకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. సాధికారతకు, సామాజిక బాధ్యతకు ఐకాన్స్గా ఉండి, తర్వాత తరాలను ఇన్స్పైర్ చేసేలా వాళ్లను తీర్చిదిద్దాలి. ఇదంత సులువైన జర్నీ కాదు. అయినా ప్రయత్నం వీడను!’’ అంటూ తన జర్నీ గురించి చెప్పారు మిస్ సౌత్ సూడాన్.మా దేశంలోని యంగ్ గర్ల్స్కి నేను మెంటర్గా ఉండాలి! వాళ్లు కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్ళకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. – సరస్వతి రమఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
మిస్ వరల్డ్ పోటీల్లో ఆ దేశాలు డుమ్మా..!
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీకి అధికారికంగా తెర లేచింది. మరో 3 వారాల పాటు నగరవాసులకు వైవిధ్యభరిత అనుభూతులను అందించనున్న ఈ పోటీలో మొత్తం 109 దేశాలు పాల్గొంటున్నట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. అయితే రకరకాల కారణాలతో పలు దేశాలు తమ ప్రతినిధులను పంపలేకపోయాయి. దాంతో తొలి అంచనాలతో పోలిస్తే 30దేశాలు తగ్గినట్లయ్యింది. మిస్ వరల్డ్ 2025(Miss World 2025) పోటీకి ప్రారంభంలో 140 దేశాలు పాల్గొననున్నట్లు ప్రకటించారు. అయితే తర్వాత ఈ సంఖ్యను 116కు కుదించారు. మొత్తం మీద చూస్తే.. తాజా సమాచారం ప్రకారం, ఈ పోటీలో 109 దేశాలకు చెందిన సుందరీమణులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇది గత మిస్ వరల్డ్ 2023 పోటీలో పాల్గొన్న 112 దేశాల కంటే కూడా తక్కువ కావడం గమనార్హం. పోటీలో పాల్గొనని దేశాల్లో.. కోస్టారికా, ఇరాక్, లెసోతో, లైబీరియా, గినియాబిస్సావు, లైబీరియా, మకావ్, మొరాకో, నార్వే, స్లోవేకియా, టాంజానియా, ఉరుగ్వే తదితర దేశాలు ఉన్నాయి. స్పాన్సర్షిప్ లేక.. తమ దేశాల్లో జాతీయ స్థాయి పోటీలు సరిగా నిర్వహించలేకపోవడం, ప్రతినిధులను నియమించలేకపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్ల పోటీలో అవి పాల్గొనడంలేదు. లెసోథోకు చెందిన లెరాటో మాసిలా, టాంజానియాకు చెందిన ట్రేసీ నబుకీరా పంపించేందుకు స్పాన్సర్షిప్ లేక పోటీల నుంచి తప్పుకున్నారు. గినియా–బిస్సా, ఇరాక్, మాకావ్, ఉరుగ్వే దేశాలు తమ జాతీయ ఫ్రాంచైజ్ సమస్యల వల్ల ప్రాతినిధ్యం వహించలేకపోయాయి. నార్వేకి చెందిన నికోలిన్ ఆండర్సన్, తాను వ్యక్తిగత ప్రాజెక్టుల వల్ల మిస్ వరల్డ్కు హాజరుకాకపోవడంతో, ఆమెను మిస్ ఇంటర్నేషనల్కు పంపించారు. సరైన ప్రోత్సాహం, ఆర్థిక పరమైన మద్దతు లేకపోవడంతో మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ టాంజానియా ట్రేసీ నబుకీరా వైదొలిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చాలా పరిశీలించి ఆలోచించిన తర్వాత, మిస్ వరల్డ్ 2025లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు, కానీ.. కావాల్సిన మద్దతు దొరకకపోవడం, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం బాధ్యత వహించాల్సిన సంస్థ నుంచి తగినంత సన్నద్ధత లేని కారణంగా, ప్రపంచ వేదికపై టాంజానియాకు ప్రాతినిధ్యం వహించలేనని భావిస్తున్నా. మిస్ టాంజానియా టైటిల్ పట్ల ఇప్పటికీ చాలా గర్వపడుతున్నాను. నా ప్రాజెక్ట్, స్టెప్ బై స్టెప్ ద్వారా నా వంతు సామాజిక సేవ చేయడానికి నా గుర్తింపును ఉపయోగించుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో ఓపికగా, మద్దతుగా నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అన్నారు.ఆఖరి నిమిషం వరకు ఆ దేశాలు..కొన్ని దేశాలు చివరి క్షణం వరకూ మార్పు చేర్పులు చేస్తూనే ఉన్నాయి. తమ అసలు పోటీదారులకు బదులుగా ఇతరులను పంపుతున్నాయి. చెక్ రిపబ్లిక్కు చెందిన జస్టినా జెడ్నికోవా స్థానంలో అడేలా స్ట్రోఫెకొవా ఎంపికయ్యారు. ట్యూనీషియాకు చెందిన అమీరా అఫ్లీకి బదులుగా లామిస్ రెడిసి పోటీలో పాల్గొననున్నారు. బెలీజ్కు చెందిన నొయెలియా హెర్నాండెజ్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో షయారి మోరటాయా ఎంపికయ్యారు. కొట్ డి ఇవోరికి చెందిన మారీ ఎమ్మానుయేల్ డైమాలా స్థానంలో ఫటౌమటా కూలిబాలీ వస్తున్నారు. నమీబియాకు చెందిన అల్బర్టినా హైంబలా స్థానంలో సెల్మా కామాన్యా భర్తీ అయ్యారు. కంబోడియాకు చెందిన మానితా హాంగ్ వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో జూలియా రస్సెల్ ఎంపికయ్యారు. మాల్డోవాకు చెందిన మికాయెలా నికోలాలేవ్ను ఏంజెలినా చిటైకా భర్తీ చేశారు. కొంతకాలం విరామం తర్వాత ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలో తిరిగి పాల్గొంటున్న దేశాల్లో స్విట్జర్లాండ్, అల్బేనియా, ఆర్మేనియా, ఈక్వటోరియల్ గినియా, కిర్గిజిస్తాన్, లాట్వియా, నార్త్ మాసిడోనియా, సూరినామ్, బ్రిటిష్ వెర్జిన్ ఐలాండ్స్, జాంబియాలు ఉన్నాయి. (చదవండి: మిస్ వరల్డ్ ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్.) -
ఆహా.. అందాల రాణులు.. అస్సలు తగ్గేదే లే!
-
మిస్ ఇండియా మిస్సవ్వదు..
బ్యూటీ పేజెంట్స్, ఫ్యాషన్ కాంపిటీషన్స్ అంటే కేవలం అందం, సౌందర్యం మాత్రమే కాదని.., నిత్య జీవితంలో మన ఆలోచనా విధానం, సామాజిక అవగాహన, మానవీయ విలువలు తదితర అంశాలతో సంపూర్ణ వ్యక్తిత్వమే ‘మిస్ క్రౌన్’కు ఎంపిక చేస్తాయని తెలుగు రాష్ట్రాల నుంచి ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్టులు ప్రకృతి, భవ్య రెడ్డి తెలిపారు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్, లండన్ ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ వీక్, లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తా చాటిన ప్రముఖ సంస్థ ఎన్ఐఎఫ్డీ గ్లోబల్ ఆధ్వర్యంలో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ ప్రకృతి కంభం, ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ భవ్య రెడ్డిలతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా 2024 పోటీల్లో ఈ ఇరువురూ తెలుగు రాష్ట్రాల తరపున పోటీ పడనున్న నేపథ్యంలో ఫ్యాషన్, అందం, లైఫ్స్టైల్ తదితర అంశాలపై వారి అనుభవాలను సాక్షితో పంచుకున్నారు. ఈ రంగంలో రాణించడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన తమ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఇరువురినీ ఎన్ఐఎఫ్డీ గ్లోబల్ సెంటర్ డైరెక్టర్ సంజయ్ సరస్వత్ ప్రత్యేకంగా అభినందించారు. డ్రెస్లు వ్యక్తిత్వానికి ప్రతీక కాదు.. దక్షిణాది అమ్మాయిలకు బ్యూటీ పేజెంట్స్లో గుర్తింపు పెరిగింది. హైదరాబాద్తో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి ఈ రంగంలో అద్భుత నైపుణ్యాలున్న అమ్మాయిలు రాణిస్తున్నారు. యువతలో పరిపక్వత పెరిగింది. కానీ అవగాహన పెరగాలి. పిల్లలు ఫ్యాషన్ రంగంలో ఆసక్తి చూపిస్తుంటే ఇబ్బందిగా భావిస్తున్నారు. మంచి చెడులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నాయి. కానీ ఫ్యాషన్, మోడలింగ్, సినిమాలు అనే సరికి సమాజం సులభంగా జడ్జ్ చేస్తున్నారు. మోడ్రన్ డ్రెస్లు మా వ్యక్తిత్వానికి ప్రతీక కాదు. మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి రాగలిగాము. మా సోషల్ మీడియా అకౌంట్స్లో చూస్తే తెలుస్తుంది.. సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తున్నామనేది. నార్త్ ష్యాషన్ ఔత్సాహికులను సైతం హైదరాబాద్ అక్కున చేర్చుకుంటోంది. దక్షిణాదిలో సృజనాత్మకత, ఐడియాలజీ, నైపుణ్యాలను వారు అద్భుతంగా వాడుకుంటారు. అదే రీతిలో మనవారినీ ప్రోత్సహించాలి. ఈ రంగంలో బాహ్య, అంతర సౌందర్యం రెండూ ముఖ్యమే. మన రంగూ, రూపు మాత్రమే విజేతగా నిలబెట్టలేవు. ఆలోచనా విధానం, అవగాహన ఇందులో కీలకాంశాలు. – ప్రకృతి కంభం.అలాంటి రోజులు రావాలి..ఈ రోజు సెషన్లో ఎంతో మంది ఫ్యాషన్ ఔత్సాహికులు.. వారి ప్రయాణాన్ని తమ కుటుంబ సభ్యులే ఒప్పుకోవట్లేదని, ఫ్యాషన్, మోడలింగ్ అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారని వారిస్తున్నారు. కానీ మాలాంటి అవగాహన, పరిపక్వత, నైపుణ్యాలు ఉన్న అమ్మాయిలు దొరకడం వారి అదృష్టం అని తెలుసుకునే రోజులు రావలి. వ్యవస్థనో, ఫ్యాషన్ పరిశ్రమపై పడిన ముద్ర మమ్మల్ని డిసైడ్ చేయలేవు. కళాత్మకత, సేవ, విద్య, సామాజిక విలువలు తదితర అంశాల్లో మేమెంతో ఉన్నతంగా ఆలోచిస్తాం. కెమెరా, వీఎఫ్ఎక్స్, డైరెక్షన్, సినిమాలు, యాక్టింగ్ అంటూ బాలీవుడ్ వరకూ ఎందరో నగరానకి వస్తున్నారు. కొందరి లోపాలు ఎంచుకుని పరిశ్రమను నిర్ధారిస్తున్నారంటే అది అవగాహనా లోపమే. అందుకే ఎంతో ఇష్టమున్నా రాణించలేకపోతున్నారు. పరిమితులు లేకుండా నచ్చగలిగింది చేయగలిగినప్పుడే మహిళా సాధికారత వస్తుంది. ఒకప్పటిలా స్టిగ్మా లేకపోయినప్పటికీ, పూర్తిగా లేదు అనలేము. గతంలో ఒక ఆటో డ్రైవర్ కూతురు సైతం విజేతగా నిలిచిన సందర్భాలున్నాయి. పోటీలు పారదర్శకంగా జరుగుతున్నాయి. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్గా స్థిరంగా ఉంటూ, గ్లోబల్ వేదికపై సత్తా చాటడానికి వినూత్నంగా ప్రయతి్నస్తున్నాం. దేశంలో ఫెమినా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇండియా వేదికలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తాయి. సాధారణంగా జరిగే పేజెంట్లో పాల్గొనే సమయంలో ఇంతకు ముందు విజేతల ప్రొఫైల్స్ తప్పకుండా గమనించాలి. – భవ్య రెడ్డి -
అవకాశాల కోసం.. ఆ పనులు చేయాలన్నారు!
సాక్షి, ముంబై : అందరిలాగా తాను కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అనేక వేధింపులు ఎదుర్కొన్నానని బాలీవుడ్ బ్యూటీ దీపీకా పదుకోన్ చెప్పారు. ఇటీవల ఓ ప్రముఖ మేగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అవకాశాల కోసం కొంత మంది తనకు బూబ్ జాబ్ అడ్వైజ్ చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు. డైరెక్టర్, నిర్మాతల దృష్టిలో పడటానికి ఇది మంచి మార్గమని వారు తెలిపారని చెప్పారు. మరి కొందరు బ్యూటీపజెంట్ కాంటెస్టుల్లో పాల్గొనాలని సూచించారని, ఇలాంటివి చేయడం వలన తొందరగా గుర్తింపు పొంది మీరు అనుకున్న లక్ష్యాన్ని తక్కువ సమయంలోనే చేరుకుంటారని సలహా ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కానీ అలాంటి అసభ్యకరమైన పనులు నేను చేయను.. నేను అలాంటి దాన్ని కాదు.. ఆత్మవిశ్వాసంతో నాకు నచ్చిన దారిలోనే ధైర్యంగా ముందుకు వచ్చానని దీపిక చెప్పారు. అదేవిధంగా దీపికా 2014 సమయంలో ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నా.. కొంత నిరాశలో ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో నాకు కొంత మంది ధైర్యం చెప్పి ముందుకు నడిపించారని పేర్కొన్నారు. ఎంతటి విజయం సాధించినా మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యమని ఆమె అన్నారు. 2014 నా జీవితంలో అద్భుతమైన సంవత్సరమని అన్నారు. అయితే దీపికా, హీరో రణ్వీర్సింగ్లు ఈ ఏడాది నవంబర్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. -
మళ్లీ నోరుపారేసుకున్న ముఖ్యమంత్రి
అగర్తల : వివాదాలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ ఆదేశించినా.. బీజేపీ నేతలు మాత్రం పాటించటం లేదు. గత కొన్ని రోజులుగా త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మహాభారతకాలంలో ఇంటర్నెట్, శాటిలైట్ వ్యవస్థ కామెంట్లు చేసిన ఆయన.. మమతా బెనర్జీకి మతి చెడిందంటూ తాజాగా వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారం రేపారు. ఇక ఇప్పుడు మరోసారి అందాలపోటీలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గురువారం ప్రజ్ఞా భవన్లో చేనేత, హస్త కళాకృతుల అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విప్లవ్ కుమార్ దేవ్ను ముఖ్య అతిధిగా హాజరయి ప్రసంగించారు. ‘విదేశీ వస్త్ర వ్యాపారులు అందాల పోటీల నిర్వహణ నెపంతో తమ సౌందర్య ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటున్నారు. ఈ అందాల పోటీల్లో విజేతను ముందుగానే నిర్ణయిస్తారు. ఏ దేశ వస్త్రాలను, సౌందర్య సాధనాలను ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నారో.. ఆ దేశానికి చెందిన వారినే విజేతలుగా నిర్ణయిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ మహిళలు పోటీల్లో గెలుస్తున్నారు. ఇది మంచి విషయమే ఎందుకంటే మన దేశంలో స్త్రీని లక్ష్మీ, సరస్వతి వంటి దేవతా మూర్తులకు సమానంగా భావిస్తాము. ఐశ్వర్య రాయ్ భారతీయ మహిళల ప్రతినిధిగా పోటిల్లో పాల్గొని.. కిరీటం గెలుచుకుంది. అందుకు ఆమె అర్హురాలు. కానీ, డయానా హెడెన్ ఎవరు? ఎవరికి ప్రతినిధిగా ఈ పోటిల్లో పాల్గొంది? నిర్వహకులకు ఆమెలో ఏం అందం కనిపించిందో నాకైతే అర్థం కాలేదు. ఇదంతా అంతర్జాతీయ వస్త్ర వ్యాపారుల మాఫియా’ అంటూ తీవ్రంగా విమర్శించారు. ‘గతంలో భారతీయ మహిళలు ఎటువంటి సౌందర్య సాధనాలను ఉపయోగించేవారు కాదు. స్నానం చేయడం కోసం మట్టిని, తలను శుభ్రపరుచుకోవడం కోసం మెంతులను వాడేవారు. ఎప్పుడైతే విదేశీ వస్త్ర వ్యాపారులు తమ ఉత్పత్తులను మన దేశంలో మార్కెట్ చేయడం మొదటుపెట్టారో అప్పటి నుంచి మన దేశంలో కూడ ఈ సౌందర్య సాధనాల వినియోగం ప్రారంభమైంది. ఇప్పుడు మనదేశంలో ప్రతి వీధిలో ఒక బ్యూటీ పార్లర్ ఉంది’ అన్నారు. విప్లవ్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ‘మీ వ్యాక్యలు మిమ్మల్ని ఒక పిచ్చివాడిగా.. రేపిస్టుగా చూపిస్తున్నాయి’ అని అనిత అనే సామాజిక కార్యకర్త విమర్శించారు. -
నోటిదురుసుతో అందాల కిరీటం మిస్
నేపిడా: తన నోటిదురుసుతో తాను కైవసం చేసుకున్న అందాల కిరీటాన్ని మయన్మార్ బ్యూటీ క్వీన్ కోల్పోయింది. రోహింగ్యా సంక్షోభంపై వ్యాఖ్యానించి మిస్ గ్రాండ్ మయన్మార్ టైటిల్ను షుయెన్ సి(19) పోగొట్టుకుంది. మయన్మార్లో రోహింగ్యా మిలిటెంట్లు అశాంతిని ప్రేరేపించారనే వీడియోను ఆమె తన ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేశారు. రోహింగ్యాలు, వారి మద్దతుదారులు మీడియాలో పథకం ప్రకారం ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు. దీంతో షుయెన్ సి మిస్ గ్రాండ్ మయన్మార్ టైటిల్ను రద్దు చేస్తున్నట్టు టైటిల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆమె దిగజారుడు వ్యాఖ్యలతో రోల్మోడల్గా విఫలమయ్యారని చెప్పారు. వివాదాలతో బ్యూటీ టైటిల్ను కోల్పోవడం సీ ఒక్కరికే అనుభవంలోకి రాలేదు. గత నెలలో టర్కీ నేషనల్ బ్యూటీ 2017 టైటిల్ను దక్కించుకున్న ముద్దుగుమ్మ కూడా ఓ వివాదాస్పద ట్వీట్ను పోస్ట్ చేయడంద్వారా తన టైటిల్కే ఎసరు తెచ్చుకున్నారు. -
అక్కడి అందాల పోటీల్లోనూ...!
న్యూఢిల్లీ: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అన్ని రంగాల్లో ముందున్నారు. అదేవిధంగా అందాల పోటీల్లోనూ భారత సంతతి అమ్మాయిలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా న్యూజెర్సీలో నిర్వహిస్తున్న రెండు వార్షిక అందాల పోటీల్లో ఏడుగురు భారత సంతతి సుందరీమణులు పోటీ పడుతున్నారు. న్యూజెర్సీ రాష్ట్రం ప్రతి ఏడాది 'మిస్ న్యూజెర్సీ యూఎస్ఏ', 'మిస్ న్యూజెర్సీ టీన్ యూఎస్ఏ' పోటీలను నిర్వహిస్తున్నది. ఇందులో 'మిస్ న్యూజెర్సీ యూఎస్ఏ' పోటీలలో ఆరుగరు భారత సంతతి అమ్మాయిలు పోటీపడుతుండగా.. 'మిస్ న్యూజెర్సీ టీన్ యూఎస్ఏ' పోటీలో ఒకరు పోటీపడుతున్నారు. వనితా బుధాన్ (22), నికోల్ పటేల్ (23), నిహారా చక్రాల (24), సౌమ్యశర్మ (23), సుచిత్ర సింగ్ (24), ఛావి వర్గ్ (18)లు 'మిస్ న్యూజెర్సీ యూఎస్ఏ'లో అదృష్టం పరీక్షించుకుంటుండగా.. 14 ఏళ్ల నేహా పసుపులేటి ఎడిసన్కు ప్రాతినిధ్యం వహిస్తూ.. 'మిస్ న్యూజెర్సీ టీన్ యూఎస్ఏ'లో పోటీపడుతున్నారు. ఈ పోటీలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలు గత శుక్రవారం, శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వ అభివృద్ధి, ప్రేరణ, నైపుణ్య విశిష్టత వంటి అంశాలపై పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వారు అమెరికా జాతీయ అందాల పోటీలైన 'మిస్ యూఎస్ఏ', 'మిస్ టీన్ యూఎస్ఏ'లో పాల్గొంటారు. మిస్ యూఎస్ఏలో విజయం సాధిస్తే.. మిస్ వరల్డ్ పోటీల్లో కూడా పాల్గొనవచ్చు.