breaking news
beautiful lady
-
అందాల శ్రీమతికి అందమైన లెహెంగా (ఫోటోలు)
-
ప్లాన్ చేసి.. అందమైన యువతిని ఎరగా వేసి..!
బెంగళూరు: రోడ్డు మీద అందమైన యువతి కనిపించిందంటే చాలు.. అటుగా వెళ్లేవారి కళ్లన్నీ ఆమెపైనే ఉంటాయి. ఇక ఆ యువతి నవ్వడం.. తనను చూసి సైగలు చేస్తే ఇంకేమైనా ఉందా..! ఇదే బలహీనతను ఓ ముఠా ఆయుధంగా చేసుకుని దోపిడీకి తెరతీసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చాకచక్యంగా వారిని అరెస్ట్ చేశారు. కర్ణాటక బేగూరులోని ఏకే కాలనీకి చెందిన మోనిషా(20), పునీత్(18), మరో అపార్టుమెంటులో ఉండే ముత్తు(19), ఏడీ కాలనీకి చెందిన తులసీరాం(22), అరుణ్ యశ్రాజ్ (22), విఘ్నేష్, స్టీఫెన్, బబ్లూ, అలెక్స్, అమర్ అనే యువత ఒక ముఠాగా ఏర్పడింది. వీరు పథకం ప్రకారం ఆకట్టుకునే కురుచ దుస్తులతో మోనిషాను నైస్ రోడ్డులోని మైలసంద్ర వంతెనకు సమీపంలోని రోడ్డు పక్కన నిల్చోమని చెబుతారు. అటుగా బైక్లపై, కార్లలో వెళ్లేవారిని చూసి నవ్వటం, సైగలు చేయటం వంటివి చేస్తుంటుంది. ఎవరైనా ఆమె వద్దకు వస్తే.. వారిని ముగ్గులోకి దించి ముఠా సూచనల మేరకు సమీపంలోని పొదల వద్దకు తీసుకెళుతుంది. అక్కడికి వెళ్లిన వెంటనే కాచుకుని కూర్చున్న గ్రూపు సభ్యులు కత్తులు, కర్రలతో దాడి చేసి మోనిషాతో వచ్చిన యువకుడి వద్ద ఉన్న నగదు, మొబైల్, ఇతర వస్తువులను లాక్కొని పంపిస్తుంటారు. ఇలా చాలా మందిని భయపెట్టి దోచుకున్నారు. కొందరు బాధితులు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఇటీవల పథకం పన్ని రాత్రి 10.30 గంటల సమయంలో మాటువేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన గ్రూపు సభ్యులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రెండు చాకులు, ఒక ఇనుపరాడ్డు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామని పోలీసుల విచారణలో మోనిషా తెలిపింది. ప్రస్తుతం మోనిషా, పునీత్, ముత్తు, తులసీరాం, అరుణ్ యశ్రాజ్ పట్టుబడగా మిగతా వారు పరారీలో ఉన్నారు. త్వరలో మిగతా నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. -
బ్యూటిఫుల్ లేడీతో అఖిల్ లంచ్
హైదరాబాద్: అక్కినేని నటవారసుడు, యువ హీరో అఖిల్ ఓ అసక్తికరమైన ట్వీట్ చేశారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో కింగ్ నాగార్జున నిర్మిస్తున్న చిత్రం సెట్ లో అమ్మతో కలిసి భోంచేసిన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. బ్యూటీఫుల్ లేడీతో లంచ్ చేశా.. ఆమెనవ్వు చాలా ఇష్టం. థాంక్యూ మై డీయర్ అమ్మా అంటూ అఖిల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు, సీనియర్ నటి , తన తల్లి అమలతో సెల్ఫీని కూడా అభిమానులతో పంచుకున్నారు. కాగా అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ పతాకాల పై 'కింగ్' నాగార్జున ఓ కమర్షియల్ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు ఏప్రిల్ 2 న ప్రారంభం అయింది. 'మనం' టెక్నికల్ టీం వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందనీ ఏప్రిల్ 3 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. Had Lunch with this beautiful lady on sets today. Her smile is what I love most. -
అందమైనభామ కోసం వేటాడుతున్న అమీర్