breaking news
barrows
-
100 ఏళ్ల క్రితం ఇచ్చిన అప్పు.. యూకేకు భారతీయుడి నోటీసులు!
భోపాల్: ఒకప్పుడు సూర్యుడు అస్తమించని రాజ్యం తమదేనని గర్వంగా చెప్పుకున్న బ్రిటిష్ ప్రభుత్వం ఓ భారతీయుడి నుంచి అప్పు తీసుకుంది. తీసుకున్న అప్పును ఎగ్గొట్టింది. తాజాగా, ఆ అప్పుకు సంబంధించిన పత్రాలు వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో భారతీయుడు.. ప్రస్తుత లండన్ ప్రభుత్వానికి నోటీసులు పంపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాటి రాజు తమ వద్ద నుంచి అప్పు తీసుకున్నారని, ఆ అప్పును మీరు చెల్లించాల్సి ఉంటుందని యూకే ప్రభుత్వానికి పంపించే నోటీసుల్లో పేర్కొననున్నారు.అది బ్రిటిష్ రాజుల కాలం అంటే 1917. మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న సమయం. ఆ సమయంలో బ్రిటిష్ రాజు (కింగ్ జార్జ్ V) నేతృత్వంలో బ్రిటిష్ సైన్యం జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ, ఒట్టోమన్ సామ్రాజ్యం, బల్గేరియా దేశాలపై యుద్ధం చేస్తోంది. యుద్ధం అయితే చేస్తుంది గానీ సైన్యానికి కావాల్సిన ఆయుధాలు,ఆహారం వారి బాగోగులు చూసుకునేందుకు యూకే ప్రభుత్వం వద్ద నిధులు లేవు.ఆ సమస్య నుంచి బయటపేందుకు యూకేతో సన్నిహిత సంబంధాలున్న దేశాల నుంచి అప్పులు తీసుకునేది. అలా నాడు మధ్యప్రదేశ్ సెహోర్ పట్టణంలో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త సేట్ జుమ్మాలాల్ రూతియా నుంచి యూకే ప్రభుత్వం రాత పూర్వకంగా 30వేల అప్పుగా తీసుకుంది. ఆ యుద్ధంలో యూకేతో పాటు దాని మిత్ర దేశాలు విజయం సాధించాయి. రూతియా నుంచి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు. తాజాగా,నాటి అప్పుకు సంబంధించిన డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి.సేట్ జుమ్మాలాల్ 1937లో మరణించినప్పటికీ, అప్పు తిరిగి చెల్లింపు విషయం మరుగున పడింది. ఇప్పుడు, ఆయన మనవడు వివేక్ రూతియా ఆ అప్పును తిరిగి పొందేందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి న్యాయ నోటీసు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.వివేక్ రూతియా ఇటీవల తన తండ్రి మరణం తర్వాత కుటుంబ పత్రాలలో పాత సర్టిఫికెట్లు, లేఖలు, వీలునామాలలో ఈ అప్పు వివరాలు బయటపడ్డాయని చెప్పారు. ఈ అప్పు ‘వార్ లోన్’ పేరుతో, భోపాల్ సంస్థానంలో బ్రిటిష్ పాలన సమయంలో పరిపాలనను సులభతరం చేయడానికి తీసుకున్నట్లు పత్రాలు సూచిస్తున్నాయి. ఆయన వాదన ప్రకారం, 1917లో రూ. 35,000 విలువను ద్రవ్యోల్బణం ఆధారంగా లెక్కిస్తే 30 నుంచి 40 కోట్ల మధ్య ఉంటుందని అంచనాసీహోర్, భోపాల్ సంస్థానంలో రూతియా కుటుంబం ఒకప్పుడు అత్యంత ప్రభావవంతమైనది. వారి భూములు, ఆస్తులు విస్తారంగా ఉండేవి. నేటికీ సీహోర్లోని 20-30 శాతం స్థలాలు రూతియా కుటుంబానికి చెందినవని చెబుతారు. వారు ఇప్పటికీ వ్యవసాయం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో కొనసాగుతున్నారు. అయితే, పాతకాలపు అద్దె వివాదాలు, ఆస్తి కేసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. -
స్త్రీ నిధి రుణ లక్ష్యం రూ.100 కోట్లు
రేగిడి: జిల్లాలో ఈ ఏడాది స్త్రీ నిధి కింద 45 వేల స్వయంశక్తి సంఘాలకు రూ.100 కోట్ల రుణం మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు పథక ఏజీఎం పొగిరి కష్ణమూర్తినాయుడు తెలిపారు. రేగిడి వచ్చిన ఆయన విలేకరులతో బుధవారం మాట్లాడారు. ఇప్పటివరకు రూ.15 కోట్లు స్త్రీ నిధి రుణాలు మంజూరు చేశామన్నారు. మార్చి 31 నాటికి పూర్తిస్థాయిలో రుణ లక్ష్యాన్ని ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి మరో రూ.38 కోట్లు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. రేగిడి మండలంలో రూ.2.24 కోట్లు రుణ లక్ష్యం కాగా రూ.53 లక్షలు మాత్రమే సంఘాలకు చెల్లించారని, ఈ లక్ష్యాలను మరింత పెంచాల్చి ఉందన్నారు. రికవరీ శాతం కూడా బాగానే ఉందని, మొండి బకాయిల వసూలపై దష్టిసారించినట్టు వెల్లడించారు. -
చివరకు మిగిలింది.. రూ.18 వేల కోట్లు
► అప్పుల పంపిణీకి ఆఖరి పీటముడి ► రెండు రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన ఏజీ ► జనాభా ప్రకారం పంచాలన్న తెలంగాణ ► ఖర్చుల పద్దుల వారీగా పంచాలన్న ఏపీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య అప్పుల పంపిణీ ఆఖరి దశకు చేరింది. చివరకు మిగిలిన రూ.18 వేల కోట్ల అప్పు పంచుకోవాల్సి ఉంది. అకౌంటెంట్ జనరల్ (ఏజీ) సూచన ప్రకారం రెండు రాష్ట్రాల ఆర్థిక శాఖలు తమ ప్రతిపాదనలు, అభిప్రాయాలను వెల్లడించే గడువు మంగళవారంతో ముగి సింది. గడువుకు ముందుగానే తెలంగాణ ఆర్థిక శాఖ తమ ప్రతిపాదనలను ఏజీకి పంపింది. జనాభా ప్రాతిపదికన ఏపీకి 58 శాతం, తెలంగాణకు 42 శాతం అప్పును పంపిణీ చేయాలని పేర్కొంది. భౌగోళికంగా ఏ ప్రాంతంలో, ఏ అవసరానికి ఎంత ఖర్చు చేశారో లెక్కతీసి చట్ట ప్రకారం పంపిణీ చేయాలని ఏపీ ఆర్థిక శాఖ విజ్ఞప్తి చేసింది. రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చటంతో ఏజీ సైతం ఈ వివాదాన్ని పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన ముందు వరకు సమైక్య రాష్ట్రానికి రూ. 1.78 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నాటికి కేంద్రం ప్రాథమికంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల వాటాలను పంపిణీ చేసింది. ఆడిట్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు రూ.1.60 లక్షల కోట్ల అప్పుల పంపిణీ పూర్తయింది. మిగతా అప్పును జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేస్తే తెలంగాణకు రూ. 7,560 కోట్లు, ఏపీకి రూ.10,440 కోట్లు అప్పు మిగులుతుంది. ఏపీ ప్రతిపాదన ప్రకారం లెక్కగడితే.. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, భారీగా నష్టం వాటిల్లుతుందని ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. రూ.1.60 లక్షల కోట్లు పంపిణీ చేసేటప్పుడు వాటిని ఎక్కడెక్కడ.. వేటికి ఖర్చు చేశారనేది ఏజీ ఆరా తీయలేదు. కేవలం ఆడిట్ లెక్కల ఆధారంగా అప్పుల పంపిణీ జరిగింది. అంత భారీ మొత్తానికి భౌగోళిక ప్రాంతాలతో సంబ ంధం లేనప్పుడు.. మిగిలిన రూ.18 వేల కోట్ల కు ఈ నిబంధన ఎలా చెల్లుబాటవుతుందని తెలంగాణ వాదిస్తోంది. అది తమకు సమ్మతం కాదని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విభజన వివాదాల పరిష్కార కమిటీ జోక్యం చేసుకుంటే తప్ప ఇది కొలిక్కి వచ్చేలా లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


