breaking news
Balvinder Singh
-
దుబాయ్లో భారతీయ బిలియనీర్కు జైలు శిక్ష
దుబాయ్లో నివసిస్తూ.. విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారతీయ బిలియనీర్ 'బల్వీందర్ సింగ్ సాహ్ని'కి మనీలాండరింగ్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు ఆదేశించింది. ఈ శిక్షా కాలం పూర్తయిన తరువాత దేశాన్ని వదిలిపోవాలని సాహ్నిని దుబాయ్ కోర్టు ఆదేశించినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.షెల్ కంపెనీల నెట్వర్క్ ద్వారా 150 మిలియన్ దిర్హామ్లను లాండరింగ్ చేయడం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు పాల్పడినందుకు బల్వీందర్ సింగ్ సాహ్ని శిక్ష.. జరిమానా విధించడం జరిగింది. అంతే కాకుండా ఈ వ్యాపారవేత్త నుంచి 5,00,000 AED (రూ. 1.14 కోట్లు) తో పాటు 150 మిలియన్ AED (రూ. 344 కోట్లు) జప్తు చేయాలని కోర్టు ఆదేశించిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.'అబు సబా' గా ప్రసిద్ధి చెందిన బల్వీందర్ సింగ్ సాహ్ని.. రాజ్ సాహ్ని గ్రూప్ (RSG) ఫౌండర్. ఈ కంపెనీ యూఏఈలో మాత్రమే కాకుండా.. అమెరికా, ఇండియాతో సహా అనేక దేశాల్లో విస్తరించి ఉంది. విలాసవంతమైన జీవితం గడిపే సాహ్ని.. ఎమిరేట్స్లో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్లలో ఒకటైన 'డీ5' కోసం సుమారు రూ. 75 కోట్ల ఖర్చు చేశారు.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలుకార్ల ధరల కంటే కూడా.. ఆ కార్ల కోసం కొనుగోలు చేసిన నెంబర్స్ ధరలే ఎక్కువని సాహ్ని.. ఓ సందర్భాల్లో చెప్పారు. ఈయన వద్ద అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో సాహ్నితో పాటు.. అతని కొడుకుతో కలిపి మరో 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం. -
డిప్యూటీ కాగ్ జనరల్ గా నంద కిషోర్
న్యూఢిల్లీ: సీనియర్ ప్రభుత్వాధికారి నంద కిషోర్ డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గా బుధవారం నియమితులయ్యారు. 1981లో ఇండియన్ అడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అధికారిగా ఎంపికైన నంద కిషోర్ ప్రస్తుతం అదనపు డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా విధులు నిర్వర్తిసున్నారు. ఆగస్టు 31న బల్వేందర్ సింగ్ పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో నంద కిషోర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కేబినెట్ నియామకాల కమిటీ నంద కిషోర్ను డిప్యూటీ కాగ్ జనరల్ గా ఎంపికచేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, ఇప్పటికే జాతీయ సంస్థ న్యాయ పునర్విచారణ ట్రిబ్యునల్ టెక్నినల్ మెంబర్ గా బల్వేందర్ సింగ్ నియమించిన సంగతి విదితమే.