-
సౌదీ జాతీయ క్రీడల్లో మెరిసిన మెహద్
అల్లూరు: సౌదీ అరేబియా జాతీయ క్రీడల్లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు వాసి సత్తా చాటాడు. ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి, రూ.2 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు. ఆ దేశ క్రీడారంగం చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి తెలుగు వాడిగా అల్లూరు కోనేటిమిట్టకు చెందిన షేక్ షాహీద్, షాకీరా బేగం కుమారుడు మెహద్ (17) అరుదైన రికార్డు సృష్టించాడు. సౌదీ అరేబియా ఒలింపిక్ కమిటీ ఉపాధ్యక్షుడు, సౌదీ క్రీడల డైరెక్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. షేక్ మెహద్ తండ్రి సివిల్ ఇంజనీర్గా రియాద్ (సౌదీ)లో పనిచేస్తున్నాడు. తల్లి షాకీరా బేగం హైదరాబాద్లో ఉంటున్నారు. మెహద్ రియాద్ నగరంలో తండ్రితో ఉంటూ పదకొండో తరగతి చదువుతున్నాడు. మెహద్ స్పోర్ట్స్ కోటాలో హైదరాబాద్కు వచ్చి గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. మెహద్ స్వర్ణ పతకం సాధించడంపై అతని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
నాటా ఆధ్వర్యంలో ఘనంగా బ్యాడ్మింటన్ పోటీలు
చికాగొ : నాటా ఆధ్వర్యంలో శనివారం(మార్చి 7న) అత్యంత ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రవాస భారతీయులు దాదాపు 60 మంది పాల్గొన్నారు. పోటీలో విజేతలుగా నిలిచినవారికి రంగరాజు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాటా బోర్డ్ డైరెక్టర్ లింగారెడ్డిగారి వెంకట్రెడ్డి, నాటా రీజనల్ ప్రెసిడెంట్లు పరమేశ్వర్ రెడ్డి, రమాకాంత్రెడ్డి, రాంభూపాల్రెడ్డి, రామిరెడ్డి, రీజనల్ ఆర్డినేటర్లు లక్ష్మీ నారాయణ, శివశంకర్, కమ్యూనిటీ కార్యకర్తలు ఆది, వెంకటేశ్వర్లు, శివకుమాకర్రెడ్డి, సృజన తదితరులు పాల్గొని పోటీలను విజయవంతంగా నిర్వహించారు. -
బ్యాడ్మింటన్ చాంపియన్లు.. తెలుగు తేజాలు
– డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభ – ముగిసిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ తిరుపతి సెంట్రల్: తిరుపతిలో వారం రోజులుగా నిర్వహించిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. బాలురు డబుల్స్ అండర్–17 విభాగంలో సాయిపవన్ కర్రి (ఏపీ), శ్రీ కృష్ణసాయి కుమార్ పొదిలి(తెలంగాణ) తమ ప్రత్యర్థి ఖదీర్ మోయినుద్దీన్ మహహ్మద్(తెలంగాణ), విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ) జట్టుపై 19–21, 21–14, 21–10 సెట్ల తేడాతో గెలుపొంది చాంపియన్లుగా నిలిచారు. సింగిల్స్ విభాగంలో కార్తికేయ గుల్షన్ కుమార్(ఎయిరిండియా) తన ప్రత్యర్థి మైసం మెరబా(మణిపాల్)పై 21–15, 19–21, 21–13 సెట్లతో గెలిచి చాంపియన్గా నిలిచారు. అండర్–19 బాలురు సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్ (ఉత్తర్ప్రదేశ్) తన ప్రత్యర్థి కనిష్క్ (ఎయిరిండియా)పై 21–15, 21–15 వరుస సెట్ల్లో గెలుపొంది చాంపియన్గా నిలిచారు. బాలురు అండర్ 19 డబుల్స్ విభాగంలో కృష్ణప్రసాద్ (ఏపీ), ధృవ్ కపిల (పంజాబ్) తమ ప్రత్యర్థి గౌస్ షేక్(ఏపీ), బషీర్ సయ్యద్ (ఏపీ) జట్టుపై 21–13, 21–12 తేడాతో గెలుపొంది చాంపియన్లుగా నిలిచారు. బాలికల్లో చాంపియన్లు అండర్–17 బాలికల విభాగంలో ఆకర్షి కశ్యప్(చత్తీస్గడ్) తన ప్రత్యర్థి ప్రషి జోషి (ఎయిరిండియా)పై 21–19, 21–14 సెట్ల తేడాతో చాంపియన్గా నిలిచింది. డబుల్స్ విభాగంలో అశ్విని భట్ (కేటీకే), మిథుల (కేటీకే) తన ప్రత్యర్థి సామియా ఇమాద్ ఫరూఖి, గాయత్రి గోపీచంద్ పుల్లెల (తెలంగాణ) జట్టుపై 21–19, 21–17 సెట్లతో గెలుపొంది చాంపియన్గా నిలిచారు. అండర్ 19 బాలికల సింగిల్స్ విభాగంలో ఆకర్షి కశ్యప్ (చత్తీస్గడ్) తన ప్రత్యర్తి శిఖా గౌతమ్(కేటీకే)పై 17–21, 21–7, 21–13 సెట్ల తేడాతో గెలుపొందింది. డబుల్స్ విభాగంలో మహిమా అగర్వాల్, శిఖా గౌతమ్(కేటీకే) తమ ప్రత్యర్థి అశ్విని భట్ , మిథుల (కేటీకే)పై 18–21, 21–15, 21–17 సెట్ల తేడాతో చాంపియన్గా నిలిచారు. మిక్స్డ్ డబుల్స్ అండర్ 19 విభాగంలో కృష్ణప్రసాద్(ఏపీ), మహిమా అగర్వాల్ (కేటీకే) తమ ప్రత్యర్థి ధృవ్ కపిల (పంజాబ్), కుహూ గార్గ్(ఉత్తర్ప్రదేశ్)పై 21–16,21–14 సెట్ల తేడాతో గెలుపొంది చాంపియన్స్గా నిలిచారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement