breaking news
attacked with knife
-
సైకో వీరంగం; కాల్చి చంపిన పోలీసులు
పారిస్ : పారిస్ సమీపంలోని వెల్లిజూయిఫ్ పార్క్లో శుక్రవారం సాయంత్రం ఒక వ్యక్తి కత్తితో హల్చల్ చేయడమే గాక ఒక వ్యక్తిని చంపి, మరో ఇద్దరిని కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు నిందితున్ని పట్టుకొని అక్కడిక్కడే కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. సౌత్ సెంట్రల్ పారిస్కు 8 కిమీ దూరంలో ఉన్న వెల్లిజూయిఫ్ పార్క్లోకి వచ్చిన ఒక వ్యక్తి కత్తితో తనకు అడ్డం వచ్చిన వ్యక్తిని పొడిచి చంపడమే గాక మరో ఇద్దరిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కాగా, ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో ఖురాన్ కాపీతో సహా ఇతర మతపరమైన పత్రాలు దొరికాయి. అయితే గత కొంత కాలంగా అతని మానసిక పరిస్థితి కూడా బాగుండడం లేదని, కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు మరికొందరు పేర్కొంటున్నారు. ఇస్లాం ప్రేరేపితంతో లేక సైకోలా మారి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అన్న కోణంలో విచారించాస్తామని పోలీసులు తెలిపారు.కాగా, దాడిలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని మార్చురీకి తరలించగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మాజీ సంపాదకుడికి కత్తిపోట్లు!!
పత్రికా స్వాతంత్ర్యం కోసం పోరాడి.. ఇటీవలే ఉద్యోగం కోల్పోయిన ఓ పత్రికా సంపాదకుడు కత్తిపోట్లకు గురయ్యారు. హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ మీద వచ్చిన ఓ వ్యక్తి బుధవారం ఉదయం కెవిన్ లౌ మీద దాడి చేసి కత్తితో పొడిచి పారిపోయాడని, ఆ మోటార్ సైకిల్ను మరో వ్యక్తి నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. హుటాహుటిన లౌను ఆస్పత్రికి తరలించారు. అప్పటికి ఆయన స్పృహలోనే ఉన్నారని చెప్పారు. ఆయనపై దాడి ఎందుకు జరిగిందన్న కోణంలో దర్యాప్తు మొదలైంది. హాంకాంగ్లో మింగ్ పావో అనే ప్రముఖ వార్తా పత్రికకు 2012లో ఆయన సంపాదకుడిగా నియమితులయ్యారు. కానీ, గత నెలలో ఆయన పత్రికా స్వాతంత్ర్యం గురించిపోరాడిన తర్వాత ఉద్యోగం కోల్పోయారు. దీంతో చైనాలో అవినీతి, మానవహక్కుల ఉల్లంఘన గురించి ఎవరు రాసినా వాళ్ల ఉద్యోగం పోతుందన్న భయం అక్కడి పాత్రికేయులలో మొదలైంది.