Arun Dhumal
-
వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండ్లు ఎక్కువ అయ్యాయి. ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే ఈ యువ సంచలనం అంతర్జాతీయ క్రికెట్కు సిద్ధమయ్యాడని అభిమానులు,మాజీలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ ఆఖరిలో ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు వైభవ్ను ఎంపిక చేయాలని పలువురు సూచిస్తున్నారు. అయితే అంతకంటే ముందు వచ్చే నెలలో శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్లో భారత్-ఎ జట్టు తరపున వైభవ్ బరిలోకి దిగనున్నాడు. తిలక్ వర్మ సారథ్యంలో అతడు ఆడనున్నాడు. ఈ సిరీస్లో కూడా అతడు మెరుగ్గా రాణిస్తే భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమవుతోంది.ఈ నేపథ్యంలో వైభవ్ భవిష్యత్తుపై ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడని.. అతడిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత రాజస్తాన్ రాయల్స్, బీసీసీఐపై ఉందని ధుమాల్ అన్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 583 పరుగులు సాధించి ఆరెంజ్క్యాప్ రేసులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి."వైభవ్ సూర్యవంశీ టెంపరామెంట్ దెబ్బతినకుండా ఉండటానికి బీసీసీఐ, రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం అతడికి అండగా నిలబడాలి. అతడికి సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత బోర్డుతో పాటు రాయల్స్పై కూడా ఉంది. క్రీడలు అంటే కేవలం శారీరక నైపుణ్యం మాత్రమే కాదు, మానసిక దృఢత్వం కూడా ముఖ్యమే.అతడు భవిష్యత్తులో సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహించేలా మా వందు మద్దతు అందిస్తామని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధుమాల్ పేర్కొన్నాడు. కాగా చిన్నవయస్సులోనే స్టార్డమ్ రావడం వల్ల ఆటగాళ్లు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. అందుకే వైభవ్కు సరైన గైడెన్స్ ఇవ్వాలని ధుమాల్ సూచించారు.చదవండి: IPL 2026: రాజస్తాన్తో ఎలిమినేటర్.. సన్రైజర్స్ తుది జట్టు ఇదే! -
ఏడాదికి రెండుసార్లు ఐపీఎల్.. అరుణ్ ధుమాల్ క్లారిటీ!
భారత్లో అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత విస్తరించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ను రెండుసార్లు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి తగిన కార్యచరణను రూపొందిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘బీసీసీఐ సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్లను మార్చి-మే మధ్యలో నిర్వహిస్తోంది. నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్లు సహా మొత్తం 74 మ్యాచ్లు ఉన్న టోర్నమెంట్లో విస్తరణ తర్వాత 94 మ్యాచ్లు జరిగే అవకాశముంది. దీంతో ఇప్పటివవరకు లీగ్ దశలో 14 మ్యాచ్లాడిన జట్లు ఇకపై 18 మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే ఇన్ని మ్యాచ్లను ఒకేసారి నిర్వహించడం వల్ల సీజన్ మరింత పొడిగించాల్సి ఉంటుంది. అందువల్ల టోర్నీ మార్చి నుంచి జూన్ వరకు జరిగే అవకాశముంటుంది. అయితే ఎండాకాలం కావడంతో అధిక వేడిమి కారణంగా క్రికెటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఐపీఎల్ను రెండు విడతల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందున్న ఆలోచన కూడా మాకు కలిగింది. ఈ నేపథ్యంలో మొదటి విడతను ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో, రెండో విడతను సెప్టెంబర్-అక్టోబర్ మధ్య జరిగేలా ప్రణాళిక రచించాలని చూస్తున్నాం. ఐపీఎల్ కేవలం బీసీసీఐని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ బోర్డులను, ఆటగాళ్లను ప్రభావితం చేస్తోంది. అయితే టోర్నమెంట్ను మరో విండోకు మార్చవచ్చా లేదా అనే దానిపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఒక నిర్ణయానికి వస్తాం. అప్పటివరకు ఐపీఎల్ ఇప్పుడున్న ఫార్మాట్లోనే జరుగుతుంది.’ అని చెప్పుకొచ్చారు. అయితే అరుణ్ ధుమాల్ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న ఫార్మాట్ను కాదని రెండు విడతల్లో ఐపీఎల్ నిర్వహించడమనేది ఒక అనవసరమైన ప్రక్రియ అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ టోర్నీల షెడ్యూల్ కూడా గందరగోళంగా తయార వుతుందని, ఆటగాళ్లు గాయపడే అవకాశాలు మరింత పెరుగుతాయని పెదవి విరుస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ ఫైనల్కు దూసుకెళ్లింది.నేడు జరగనున్న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్తో రాజస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. మే 31 (ఆదివారం) జరగనున్న ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది.చదవండి: పాపం సాయి సుదర్శన్.. ఐపీఎల్ చరిత్రలో వింత ఔట్! -
ఓ 4 పాస్లు ఇస్తే ఏమౌతుంది?.. ఐపీఎల్ చైర్మన్ స్ట్రాంగ్ రియాక్షన్!
ఐపీఎల్-2026 ఫైనల్ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు మార్చడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఏకంగా 10 వేలకు పైగా కాంప్లిమెంటరీ టికెట్లు కోరిందనే వార్తలు విమర్శలకు తావిచ్చాయి. ఇలాంటి తరుణంలో హోం మంత్రి జీ.పరమేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 7, 8 వేల సీట్లు స్పాన్సర్లు, ఇతరులకు ఇవ్వాల్సి ఉంటుంది.. అది వర్క్ఔట్ కాదని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను మార్చినట్లు తెలిసింది అని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. నాలుగు పాస్లు ఇస్తే ఏమవుతుంది?ఐపీఎల్ ఫైనల్స్ను గుజరాత్లోని అహ్మదాబాద్కు మార్చడంపై స్పందిస్తూ.. ‘‘భద్రత గురించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఇప్పటికి 5 మ్యాచ్లు ఇక్కడ జరిగాయి. చిన్నస్వామిలో 33 వేల సీట్లు ఉన్నాయి. 7– 8 వేల సీట్ల (టికెట్లు)ను స్పాన్సర్లు తదితరులకు ఇవ్వాల్సి ఉంటుంది.25 వేలు సీట్లు నిర్వాహకులకు మిగులుతాయి, ఇది గిట్టుబాటు కాదని స్టేడియాన్ని మార్చారని నాకు తెలిసింది’’ అన్నారు. ఎమ్మెల్యేల ఉచిత టికెట్లకు, దీనికి సంబంధం లేన్నారు. నాలుగు పాస్లు ఇస్తే ఏమవుతుంది? అని ప్రశ్నించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా ఈ విషయంపై స్పందించారు. అభిమానుల సౌకర్యం కోసమే ఐపీఎల్ 19వ సీజన్ ఫైనల్ వేదికను అహ్మదాబాద్గా నిర్ణయించినట్లు తెలిపారు. ఐపీఎల్ చైర్మన్ స్ట్రాంగ్ రియాక్షన్!కాగా మే 31న జరగనున్న ఐపీఎల్-2026 ఫైనల్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. గత సీజన్ విజేత జట్టు సొంత మైదానంలో ఈ ఏడాది ఫైనల్ జరగడం పరిపాటి.అయితే పలు కారణాల వల్ల వేదికను మార్చినట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ఐపీఎల్ 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలవగా... ఈ సారి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ నిర్వహించాల్సి ఉంది. కానీ చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం తక్కువగా ఉండటంతో పాటు... కర్ణాటక క్రికెట్ సంఘం (KSCA) పెద్ద సంఖ్యలో కాంప్లిమెంటరీ టికెట్లు కోరడం... గతేడాది ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడంతో వేదిక మార్చినట్లు తెలుస్తోంది.చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35 వేలు కాగా... నరేంద్ర మోదీ స్టేడియంలో 1,32,000 మంది మ్యాచ్ను వీక్షించే అవకాశం ఉంది. ‘సాధారణంగా చూసుకుంటే ఈ ఏడాది బెంగళూరులో ఐపీఎల్ ఫైనల్ జరగాలి. దీని కోసం మేం కర్ణాటక క్రికెట్ సంఘాన్ని సంప్రదించాం. ఉచిత టికెట్లుగతేడాది ఫైనల్ అనంతరం తొక్కిసలాట జరిగింది. దీంతో పాటు పలు సవాళ్లు ఎదురయ్యాయి. తమ సభ్యులు, అనుబంధ క్లబ్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలకు ఉచిత టికెట్లు ఇవ్వాల్సి ఉంటుందని కర్ణాటక సంఘం తెలిపింది.స్టేడియం సామర్థ్యం కూడా ఎక్కువ లేదు. ఐపీఎల్ ఫైనల్పై ఆసక్తి అత్యధికంగా ఉంటుంది. ప్రపంచ నలుమూలల నుంచి అభిమానులు ఈ మ్యాచ్ను చూసేందుకు వస్తారు. వారి కోసం ఎక్కువ సీట్లు అందుబాటులో ఉండాలి. అదే సమయంలో ఐసీసీ బోర్డు సమావేశం కూడా ఉంది. దాని కోసం కూడా చాలా మంది సభ్యులు వస్తున్నారు. ఇలా వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే పెద్ద వేదిక అయితేనే సముచితంగా ఉంటుందని భావించాం.అందుకే అహ్మదాబాద్ను ఎంచుకున్నాం. ఒకవేళ గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గి ఉంటే... ఈ సారి చెన్నైలోనే ఫైనల్ నిర్వహించేవాళ్లం’ అని ధుమాల్ వివరించారు.చదవండి: ఆమెతో బంధం ఇక చట్టబద్ధం -
బంగ్లా ప్లేయర్ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్ చైర్మన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 మినీ వేలంలో అమ్ముడుపోయిన ఏకైక బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్. మాజీ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) అతడిని రూ. 9.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కేకేఆర్ యాజమాన్యం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.బంగ్లాదేశ్ ఆటగాడిని వెంటనే ఐపీఎల్ నుంచి తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందుకు తలొగ్గిన బీసీసీఐ.. ముస్తాఫిజుర్ రహమాన్ను రిలీజ్ చేయాల్సిందిగా కేకేఆర్ను ఆదేశించింది. దీంతో అతడు ఐపీఎల్కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు భారత్కు రాలేమంటూ బంగ్లాదేశ్ టోర్నీ నుంచే తప్పుకొంది.దురదృష్టకరంఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ను తొలగించడంపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తొలిసారి స్పందించాడు. ఫైనాన్షియల్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘అదొక దురదృష్టకర సంఘటన అని చెప్పగలను. ఒక్కోసారి పరిస్థితులకు తగినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది.ఏదేమైనా ప్రభుత్వానికి క్రికెట్లో జోక్యం చేసుకోవాలనే ఆలోచన మాత్రం లేదు. ఎల్లవేళలా మాకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అయితే, ముందుగా చెప్పినట్లు కొన్నిసార్లు పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు.ఏది జరిగినా మన మంచికేపరిణామాలకు తగినట్లుగానే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది జరిగినా మన మంచికే అన్న సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని అరుణ్ ధుమాల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ నుంచి తొలగించిన తర్వాత ముస్తాఫిజుర్ రహమాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడేందుకు వెళ్లాడు. మరోవైపు.. పీఎస్ఎల్ను వీడి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ కేకేఆర్లో ముస్తాఫిజుర్ స్థానాన్ని భర్తీ చేశాడు.చదవండి: IPL 2026: ‘నేనైతే ఫుల్ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్ భావోద్వేగం! -
కుదరదు: ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గత పద్దెమినిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న టీ20 లీగ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా పేరొందింది. 2008లో మొదలైన ఈ టోర్నీ.. 2021 వరకు ఎనిమిది జట్లతో కొనసాగింది. ఈ క్రమంలో 2022లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా చేరడంతో జట్ల సంఖ్య పదికి చేరింది.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్లతో పాటు లక్నో (LSG), గుజరాత్ (GT) నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్ను మరింత విస్తృతం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లుఐసీసీ ఈవెంట్లతో సమానంగా ఐపీఎల్ క్రేజ్ సంపాదించిందనడంలో అతిశయోక్తి లేదు. గతేడాది పది ఫ్రాంఛైజీలు వెయ్యి కోట్ల రూపాయల మేర ఆదాయం పొందడం.. ఐపీఎల్ ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోవడం ఇందుకు నిదర్శనం.74 మ్యాచ్లతోనేఈ నేపథ్యంలో క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు మరో రెండు జట్లు చేర్చి.. మ్యాచ్ల సంఖ్య పెంచుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023, 2024లో 74 మ్యాచ్లు నిర్వహించగా.. 2025, 2026 సీజన్లలో 84 మ్యాచ్లు.. 2027 నాటికి వీటి సంఖ్య 94కు పెంచుతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. నేటికీ 74 మ్యాచ్లతోనే టోర్నీ కొనసాగుతోంది.కుదరదుతాజాగా మరోసారి ఈ అంశం మీద చర్చ జరుగుతుండగా.. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ (Arun Dhumal) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో ఐపీఎల్ జట్లు, మ్యాచ్ల సంఖ్య పెంచే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చాడు. ‘‘మ్యాచ్ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచడం కష్టం. ఎందుకంటే అంతర్జాతీయ షెడ్యూల్తో మ్యాచ్ చేయలేము.మార్చి- మే వరకు దీనిని పరిమిత విండోలో మాత్రమే నిర్వహించగలము. ఒకవేళ జూన్ వరకు కొనసాగిస్తే.. దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో అప్పటికే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. వర్షాల ప్రభావం ఉంటుంది. కాబట్టి అప్పుడు మ్యాచ్ల నిర్వహణ కష్టం.వారికి ప్రయోజనం ఉండదుఒకవేళ ఒకేసారి డబుల్ హెడర్ మ్యాచ్లు అంటే ఒకేరోజు ఒకే వేదికపై రెండు మ్యాచ్లు నిర్వహించాలనుకున్నా బ్రాడ్కాస్టర్లకు ఇది అంతగా నచ్చదు. వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి బ్రాడ్కాస్టర్ల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టేకునే మేము 74 మ్యాచ్లకు విండోను పరిమితం చేవాము’’ అని అరుణ్ ధుమాల్ చెప్పుకొచ్చాడు.కాగా ఇప్పటికే టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ విరామం లేని బిజీ షెడ్యూల్తో కిక్కిరిసిపోయింది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ విస్తృతిని పెంచడం సాధ్యం కాదని అరుణ్ ధుమాల్ పరోక్షంగా స్పష్టం చేశాడు.చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు -
Arun Dhumal: తొక్కిసలాట గురించి మాకు తెలీదు!
-
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు?.. స్పందించిన బీసీసీఐ!
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)నేపథ్యంలో ఐపీఎల్-2025లో షెడ్యూల్లో మార్పులు ఉంటాయా? లేదంటే క్యాష్ రిచ్ లీగ్ ప్రణాళిక ప్రకారమే ముందు సాగుతుందా? అని అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు స్పందించాయి.ఐపీఎల్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని.. లీగ్ యథావిథిగా ఉంటుందని స్పష్టం చేశాయి. కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మొదలు కాగా.. మే 6 నాటికి 56 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో రెండు మాత్రమే వర్షం కారణంగా రద్దయ్యాయి.టాప్లో గుజరాత్ఈ క్రమంలో పదకొండింట ఎనిమిది విజయాలతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలోకి కొనసాగుతుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా 16 పాయింట్లు ఉన్నా రన్రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు), ముంబై ఇండియన్స్ (14 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (13 పాయింట్లు), కోల్కతా నైట్ రైడర్స్ (11 పాయింట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (10 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇక ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ (7 పాయింట్లు), రాజస్తాన్ రాయల్స్ (6 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (4 పాయింట్లు) ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు కాగా ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం నాటి మ్యాచ్ వర్షం వల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి.. వాటిని ధ్వంసం చేసింది.జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.ఇలాంటి సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్లు వాయిదా వేస్తారేమోనని సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యలో బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.దేశ ప్రయోజనాలే ముఖ్యంఇక ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ.. భారత ప్రభుత్వ నిర్ణయాలను బీసీసీఐ శిరసా వహిస్తుందని స్పష్టం చేశారు. సమయానికి తగినట్లు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తామని పేర్కొన్నారు.‘‘ఐపీఎల్ పాలక మండలి ఈ పరిస్థితులను గమనిస్తోంది. ఐపీఎల్ షెడ్యూల్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే, ఏదీ మన చేతుల్లో లేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా బీసీసీఐ అందుకు కట్టుబడి ఉంటుంది. మద్దతుగా ఉంటుంది’’ అని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.సురక్షితం, భద్రంఇక టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘భారత్లో ప్రతి ఒక్కరు సురక్షితంగా, భద్రంగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. మన దేశ సైన్యంపై అందరికీ అమితమైన విశ్వాసం ఉంది. విదేశీ ఆటగాళ్లు కూడా తాము భద్రంగా ఉన్నామని, ఉంటామని నమ్మకంగా ఉన్నారు. కాబట్టి లీగ్లో మార్పులు ఉండవనే అనుకుంటున్నా’’ అని ధీమా వ్యక్తం చేశాడు.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్


