Arun Dhumal
-
బంగ్లా ప్లేయర్ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్ చైర్మన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 మినీ వేలంలో అమ్ముడుపోయిన ఏకైక బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్. మాజీ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) అతడిని రూ. 9.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కేకేఆర్ యాజమాన్యం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.బంగ్లాదేశ్ ఆటగాడిని వెంటనే ఐపీఎల్ నుంచి తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందుకు తలొగ్గిన బీసీసీఐ.. ముస్తాఫిజుర్ రహమాన్ను రిలీజ్ చేయాల్సిందిగా కేకేఆర్ను ఆదేశించింది. దీంతో అతడు ఐపీఎల్కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు భారత్కు రాలేమంటూ బంగ్లాదేశ్ టోర్నీ నుంచే తప్పుకొంది.దురదృష్టకరంఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ను తొలగించడంపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తొలిసారి స్పందించాడు. ఫైనాన్షియల్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘అదొక దురదృష్టకర సంఘటన అని చెప్పగలను. ఒక్కోసారి పరిస్థితులకు తగినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది.ఏదేమైనా ప్రభుత్వానికి క్రికెట్లో జోక్యం చేసుకోవాలనే ఆలోచన మాత్రం లేదు. ఎల్లవేళలా మాకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అయితే, ముందుగా చెప్పినట్లు కొన్నిసార్లు పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు.ఏది జరిగినా మన మంచికేపరిణామాలకు తగినట్లుగానే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది జరిగినా మన మంచికే అన్న సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని అరుణ్ ధుమాల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ నుంచి తొలగించిన తర్వాత ముస్తాఫిజుర్ రహమాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడేందుకు వెళ్లాడు. మరోవైపు.. పీఎస్ఎల్ను వీడి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ కేకేఆర్లో ముస్తాఫిజుర్ స్థానాన్ని భర్తీ చేశాడు.చదవండి: IPL 2026: ‘నేనైతే ఫుల్ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్ భావోద్వేగం! -
కుదరదు: ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గత పద్దెమినిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న టీ20 లీగ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా పేరొందింది. 2008లో మొదలైన ఈ టోర్నీ.. 2021 వరకు ఎనిమిది జట్లతో కొనసాగింది. ఈ క్రమంలో 2022లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా చేరడంతో జట్ల సంఖ్య పదికి చేరింది.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్లతో పాటు లక్నో (LSG), గుజరాత్ (GT) నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్ను మరింత విస్తృతం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లుఐసీసీ ఈవెంట్లతో సమానంగా ఐపీఎల్ క్రేజ్ సంపాదించిందనడంలో అతిశయోక్తి లేదు. గతేడాది పది ఫ్రాంఛైజీలు వెయ్యి కోట్ల రూపాయల మేర ఆదాయం పొందడం.. ఐపీఎల్ ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోవడం ఇందుకు నిదర్శనం.74 మ్యాచ్లతోనేఈ నేపథ్యంలో క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు మరో రెండు జట్లు చేర్చి.. మ్యాచ్ల సంఖ్య పెంచుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023, 2024లో 74 మ్యాచ్లు నిర్వహించగా.. 2025, 2026 సీజన్లలో 84 మ్యాచ్లు.. 2027 నాటికి వీటి సంఖ్య 94కు పెంచుతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. నేటికీ 74 మ్యాచ్లతోనే టోర్నీ కొనసాగుతోంది.కుదరదుతాజాగా మరోసారి ఈ అంశం మీద చర్చ జరుగుతుండగా.. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ (Arun Dhumal) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో ఐపీఎల్ జట్లు, మ్యాచ్ల సంఖ్య పెంచే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చాడు. ‘‘మ్యాచ్ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచడం కష్టం. ఎందుకంటే అంతర్జాతీయ షెడ్యూల్తో మ్యాచ్ చేయలేము.మార్చి- మే వరకు దీనిని పరిమిత విండోలో మాత్రమే నిర్వహించగలము. ఒకవేళ జూన్ వరకు కొనసాగిస్తే.. దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో అప్పటికే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. వర్షాల ప్రభావం ఉంటుంది. కాబట్టి అప్పుడు మ్యాచ్ల నిర్వహణ కష్టం.వారికి ప్రయోజనం ఉండదుఒకవేళ ఒకేసారి డబుల్ హెడర్ మ్యాచ్లు అంటే ఒకేరోజు ఒకే వేదికపై రెండు మ్యాచ్లు నిర్వహించాలనుకున్నా బ్రాడ్కాస్టర్లకు ఇది అంతగా నచ్చదు. వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి బ్రాడ్కాస్టర్ల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టేకునే మేము 74 మ్యాచ్లకు విండోను పరిమితం చేవాము’’ అని అరుణ్ ధుమాల్ చెప్పుకొచ్చాడు.కాగా ఇప్పటికే టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ విరామం లేని బిజీ షెడ్యూల్తో కిక్కిరిసిపోయింది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ విస్తృతిని పెంచడం సాధ్యం కాదని అరుణ్ ధుమాల్ పరోక్షంగా స్పష్టం చేశాడు.చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు -
Arun Dhumal: తొక్కిసలాట గురించి మాకు తెలీదు!
-
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు?.. స్పందించిన బీసీసీఐ!
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)నేపథ్యంలో ఐపీఎల్-2025లో షెడ్యూల్లో మార్పులు ఉంటాయా? లేదంటే క్యాష్ రిచ్ లీగ్ ప్రణాళిక ప్రకారమే ముందు సాగుతుందా? అని అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు స్పందించాయి.ఐపీఎల్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని.. లీగ్ యథావిథిగా ఉంటుందని స్పష్టం చేశాయి. కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మొదలు కాగా.. మే 6 నాటికి 56 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో రెండు మాత్రమే వర్షం కారణంగా రద్దయ్యాయి.టాప్లో గుజరాత్ఈ క్రమంలో పదకొండింట ఎనిమిది విజయాలతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలోకి కొనసాగుతుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా 16 పాయింట్లు ఉన్నా రన్రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు), ముంబై ఇండియన్స్ (14 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (13 పాయింట్లు), కోల్కతా నైట్ రైడర్స్ (11 పాయింట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (10 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇక ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ (7 పాయింట్లు), రాజస్తాన్ రాయల్స్ (6 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (4 పాయింట్లు) ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు కాగా ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం నాటి మ్యాచ్ వర్షం వల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి.. వాటిని ధ్వంసం చేసింది.జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.ఇలాంటి సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్లు వాయిదా వేస్తారేమోనని సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యలో బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.దేశ ప్రయోజనాలే ముఖ్యంఇక ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ.. భారత ప్రభుత్వ నిర్ణయాలను బీసీసీఐ శిరసా వహిస్తుందని స్పష్టం చేశారు. సమయానికి తగినట్లు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తామని పేర్కొన్నారు.‘‘ఐపీఎల్ పాలక మండలి ఈ పరిస్థితులను గమనిస్తోంది. ఐపీఎల్ షెడ్యూల్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే, ఏదీ మన చేతుల్లో లేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా బీసీసీఐ అందుకు కట్టుబడి ఉంటుంది. మద్దతుగా ఉంటుంది’’ అని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.సురక్షితం, భద్రంఇక టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘భారత్లో ప్రతి ఒక్కరు సురక్షితంగా, భద్రంగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. మన దేశ సైన్యంపై అందరికీ అమితమైన విశ్వాసం ఉంది. విదేశీ ఆటగాళ్లు కూడా తాము భద్రంగా ఉన్నామని, ఉంటామని నమ్మకంగా ఉన్నారు. కాబట్టి లీగ్లో మార్పులు ఉండవనే అనుకుంటున్నా’’ అని ధీమా వ్యక్తం చేశాడు.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్


