breaking news
army apparel
-
మిలటరీ టోపీ తీసేశారు!
న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్ గురువారం ఎలాంటి టోపీలు ధరించకుండానే సభలో కనిపించారు. మార్షల్స్ కొత్త యూనిఫాంపై పలు పార్టీలు, మాజీ సైనికాధికారుల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. గురువారం సభలో కొందరు ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించగా రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. ‘బుధవారం చెప్పినట్లుగానే మార్షల్స్ డ్రెస్పై సమీక్ష చేస్తున్నాం. ఆర్మీ మాదిరిగా వారి యూనిఫాం ఉండదు’అని పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయ తలపాగాకు బదులుగా ‘సైనిక’ తరహా యూనిఫాంను తేవడం తెల్సిందే. Copying and wearing of military uniforms by non military personnel is illegal and a security hazard. I hope @VPSecretariat, @RajyaSabha & @rajnathsingh ji will take early action. https://t.co/pBAA26vgcS — Vedmalik (@Vedmalik1) November 18, 2019 -
బహిరంగంగా సైనికుల దుస్తుల అమ్మకాలా?
న్యూఢిల్లీ: సైనికులు ధరించే దుస్తులు, షూస్, బ్యాడ్జీలు వంటి వాటిని బయట ప్రదేశాల్లో అమ్మడం తీవ్రమైన విషయమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలా అమ్ముతున్న దుస్తులను ఉపయోగించి సైనిక స్థావరాలపై తీవ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, వీటిపై తమ వైఖరి తెలియజేయాల్సిందిగా హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఢిల్లీకి చెందిన ఎన్జీవో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం వాదనలు వినింది. అనంతరం దీనిపై తమ వైఖరిని తెలియజేయాలని రక్షణ శాఖ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి వాదనలను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.