-
మోహన్ లాల్కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే ?
Mohanlal Questioned By Ed In Money Laundering Case With Monson Mavunkal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్కు పాల్పడినట్లు మోహన్ లాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మోహన్ లాల్కు నోటీసులు పంపింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్లాల్ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ప్రజలను రూ. 10 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై మాన్సన్ను గత సెప్టెంబర్లోనే కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో ఉన్న మాన్సన్ ఇంటికి మోహన్ లాల్ ఒకసారి వెళ్లినట్లు సమాచారం. అయితే అలా మోహన్ లాల్ వెళ్లడానికి కారణాలు తెలియరాలేదు. 'కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి రూ. 10 కోట్ల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాఝీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలిగోరు వంటి వస్తువులు ఉన్నాయని చెప్పాడం అబద్ధం.' అని కేరళ పోలీసులు తెలిపారు. కాగా కేరళలోని అలప్పుజా జిల్లాలో నకిలీ పురాతన వస్తువులు విక్రయిస్తున్నాడని 52 ఏళ్ల యూట్యూబర్ను కూడా కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4431454862.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
2700 నాటి పురాతన టాయిలెట్.. ఎలా ఉందంటే?
జెరూసలేం: జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్ను ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాగా ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాలలో బెరూసలేం ఒకటన్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోలను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ విడుదల చేయడంతో పవిత్ర నగరమైన జెరూసలేంలో 2,700 సంవత్సరాల క్రితం కూడా ప్రైవేటు బాత్రూమ్లు ఉండేవని తేలింది. ఆ టాయిలెట్ కింద లోతైన సెప్టెక్ ట్యాంక్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పురాతన కాలంలో టాయిలెట్ క్యూబికల్ నిర్మించడం చాలా అరుదైన విషయమని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ అధికారి తెలిపారు. అప్పట్లో ధనవంతులు మాత్రమే ఇలాంటి మరుగుదొడ్లను కొనుగోలు చేసేవారని చెప్పారు. టాయిలెట్ కింద ఉన్న సెప్టిక్ ట్యాంకులోని జంతువుల ఎముకలతో పటు లభించిన పలు వస్తువల ఆధారంగా ఆ సమయంలో నివశించిన వ్యక్తుల జీవనశైలితో పాటు అప్పటి వ్యాధులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జెరూసలేంలోని అర్మోన్ హనాట్జీవ్ విహార ప్రదేశంలో పెద్ద ఎస్టేట్ ఉన్న ప్రదేశంలో ఈ టాయిలెట్ను కనుగొన్నారు. కాగా ఈ టాయిలెట్ సెట్ను అధికారులు పురావస్తు సదస్సులో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు, అయితే అది వీక్షించడానికి మాత్రమే. చదవండి: Taliban: సోమనాథ్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశాం -
ఈ నత్త గుళ్లల వయసు ఆరున్నర కోట్ల ఏళ్లు..
సాక్షి, హైదరాబాద్: ఈ చిత్రంలోని నత్తగుళ్లల వయసు ఎంతో తెలుసా..? ఏకంగా ఆరున్నర కోట్ల సంవత్సరాలు. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి అటవీ రేంజ్ పరిధిలోని గోయెనా గుట్టల మీద ఈ నత్తగుల్లల శిలాజాలను గుర్తించారు. ‘పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా)’ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాసన్, ఫారెస్టు రేంజ్ అధికారి, ప్రిహా సభ్యుడు టి.ప్రణయ్, సిబ్బంది తాజాగా వీటిని గుర్తించారు. గతం లో ఈ ప్రాంతంలో మంచినీటి సరస్సు ఉండేదని, భూమి పొరల నుంచి లావా ఉబికి ఆ సరస్సు ప్రాం తాన్ని కమ్మివేయటంతో అందులోని జీవరాశులు ఇలా శిలాజాలుగా మారి ఉంటాయని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల తర్వాత.. సంగారెడ్డి జిల్లా తేర్పోల్ శివారులో 30 ఏళ్ల కిందట జియాలజిస్టు అయ్యస్వామి పరిశోధించి ఈ తరహా నత్త శిలాజాలను గుర్తించారు. దీంతో వాటిని ఆ గ్రామం పేరుతో ‘పైజా తిర్పోలెన్సిస్’ అని నామకరణం చేశారు. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన నత్త శిలాజాలు కూడా అదే ప్రజాతికి చెందినవని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాలరావు నిర్ధారించినట్టు శ్రీనివాసన్ తెలిపారు. ఈ 3దశాబ్దాల కాలంలో ఇప్పటివరకు స్థానికంగా మరెక్కడా నత్త శిలాజాలు వెలుగు చూడలేదని పేర్కొన్నారు. అప్పుడు ఎడమ.. ఇప్పుడు కుడి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నత్తగుళ్లలు కుడివైపు తెరుచుకుని కన్పిస్తుంటాయి. అరుదుగా మాత్రమే ఎడమవైపు తెరుచుకుంటాయి. ఈ శిలాజాల్లో మాత్రం ఎడమవైపు తెరుచుకుని ఉన్నాయి. ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో నత్త శిలాజాలుండటం విశేషం. ఒకే రాతి ముక్కలో 18 నత్తగుళ్లలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని ఆధారంగా ఇది సరస్సు ఉండే ప్రాంతమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల ఇదే ప్రాంతంలో పొడవైన సున్నపురాతి గుహలను కూడా గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలో ఇక్కడ పరిశోధనలు చేసి ఎన్నో శిలాజాలను గుర్తించింది. వెరసి ఈ ప్రాంతాన్ని ఫాజిల్(శిలాజ) పార్కుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, దీనివల్ల శిలాజాల చరిత్రను భావితరాలు తెలుసుకునేందుకు అవకా శం చిక్కుతుందని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి శాంతారం, ఎస్డీవో దినేశ్ ప్రోత్సాహంతో ఈ శిలాజాలను గుర్తించినట్టు అటవీ శాఖ అధికారి ప్రణయ్ పేర్కొన్నారు. -
1200 ఏళ్ల నాటి వస్తువులు.. ఎలా ఉన్నాయో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: మనిషి మొదటి మిత్రుడు రాయే. రక్షణకు ఆయుధం అదే. రోజువారీ జీవనంలో పనిముట్టూ అదే.. నివాసమూ అదే. చనిపోయిన తర్వాత శాశ్వత ఆవాసం వాటి మధ్యే. రామప్ప లాంటి విశ్వ విఖ్యాత దేవాలయ నిర్మాణం అంతా రాతితోనే జరిగింది. కానీ ఆ రాళ్ల నిండా కళాత్మకత ఉట్టిపడుతుంది. కానీ ఎలాంటి నగిషీలు లేకుండా రాళ్లను వాడిన తీరు మాత్రం చాలా అబ్బుర పరుస్తుంది. అలాంటి అలనాటి గుర్తులు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఇటీవల మర్కూక్ మండలం దామరకుంట ప్రాంతంలో కొత్త తెలంగాణ బృందం ప్రతినిధులు శ్రీరామోజు హరగోపాల్, అహోబిలం కరుణాకర్, చంటి, నసీర్, కొలిపాలక శ్రీనివాస్, ఔత్సాహిక పరిశోధకులు కందుల వెంకటేశ్లు సందర్శించినప్పుడు అలనాటి చారిత్రక అవశేషాలు ఎన్నో వెలుగు చూశాయి. రాతియుగం నాటి గుర్తులు, తదుపరి నిర్మాణాలు, వివిధ రాజవంశాల హయాంలో నిర్మితమైన శిథిల దేవాలయాలు కనిపించాయి. వాటిల్లో రెండు గుర్తులు ప్రత్యేకంగా నిలిచాయి. నూనెకు ఇదే సాధనం.. ఇటీవల కాలంలో గానుగ నూనెలకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. దీంతో యాంత్రిక గానుగలు విరివిగా వెలుస్తున్నాయి. కానీ వందల ఏళ్లనాడు గానుగలు కూడా రాతివే ఉండేవి. అందులో ఓ గానుగ దామరకుంట శివారు పొలాల్లో కూరుకుపోయి ఉంది. అప్పట్లో ధనవంతుల ఇళ్లలో సొంత అవసరాలకు నూనె తీసేందుకు ఉండేవి. దేవాలయాల్లో నూనె అవసరం బాగా ఉండటంతో అక్కడ ఉండేవి. దీని పైభాగంలో వేరుశనగ, కుసుమ, నువ్వుల నూనె లాంటి వాటిని వేసి రుబ్బురోలు లాంటి దాన్ని ఏర్పాటు చేసి దానికి ఎద్దును కట్టి తిప్పే వారు. నలిగిన గింజల నుంచి నూనె కారి వెలుపలికి వచ్చేది. ఇక ప్రత్యేకంగా కొన్ని కుటుంబాలు వాటిపై ఆధారపడి ఉండేవి. క్రమంగా ఆ పేరుతో ఓ కులమే ఏర్పాటైంది. వారే నూనె తీసి అమ్మేవారు. కొన్ని రాజుల కాలాల్లో గానుగపై నూనె తయారీకి సుంకం కూడా విధించినట్లు చారిత్రక ఆధారాలు వెలుగు చూశాయి. నల్లగొండ జిల్లాలో వెలుగు చూసిన ఓ శాసనంలో గానుగ నిర్వహించే వారు చెల్లించాల్సిన సుంకం వివరాలు వెలుగుచూశాయి. ఇలాంటి వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. వెయ్యేళ్లు దాటినా నిలిచే.. రాష్ట్రకూటుల హయాంలో జైన బసదులు నిర్మితమయ్యాయి. జైన ఆరాధకులు తపస్సు చేసేందుకు ఎలాంటి ఆడంబరం, అలంకరణ లేకుండా చిన్నచిన్న గుదులు నిర్మించుకునేవారు. ముఖ్యంగా జైన దిగంబరులు వాటిని ఆశ్రయించేవారు. దామరకుంటలో పరుపు బండపై ఉన్న రాతి గూళ్లు అలాంటివే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. పెద్ద పెద్ద రాతి సల్పలను ఒకదానికొకటి ఆధారంగా ఉండేలా ఇంటర్ లాకింగ్ విధానంతో నిలిపి ఉంచేవారు. పునాదులు, అనుసంధాన మిశ్రమాలు లేకుండా అనామతుగా నిలిపి చిన్న గూళ్లులాగా చేసిన నిర్మాణాలు 1200 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిలిచే ఉండటం విశేషం. ఆ తర్వాత ఇవి శివాలయాలుగా మారినట్టు పేర్కొంటున్నారు. శైవమతాచార్యుల సమాధులపై నిలిపే లింగ శిలలు వాటి పక్కనే ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. వాటిపై ఎలాంటి అలంకరణ, ఆడంబర గుర్తులుండవు. సిద్దిపేట పరిసర గ్రామాల్లో ఇలాంటి నిర్మాణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఇలాంటి నిర్మాణాలను తొలగించి స్థానికులు రాళ్లను ఇతర అవసరాలకు తీసుకెళ్లిపోతున్నారు. ఫలితంగా ఇలాంటి అతిపురాతన నిర్మాణాలు క్రమంగా మాయమవుతున్నాయి. వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. -
తెలుంగాణపురం ఎక్కడుందో తెలుసా?
త్రిలింగ దేశం.. ఆ తర్వాత తిలింగరాజ్యం.. కొందరు మహమ్మదీయ రాజులు తిలింగ్, తెలింగ అని.. మరికొందరు విదేశీయులు ట్రిలింగాన్ అని.. వేర్వేరు సామ్రాజ్యాలు, కాలాల్లో ఇలా రకరకాల పేర్లతో సంబోధించారు. ఆ ప్రాంతమే ప్రస్తుత తెలంగాణ. మరి మొదటిసారి తెలంగాణ అన్న పదాన్ని ఎవరు, ఎప్పుడు వాడారో తెలుసా? ఇప్పుడు దానికి సంబంధించిన శాసనమే ఆసక్తి రేపుతోంది. ఆరు శతాబ్దాల క్రితం వేయించిన ఆ శాసనం ఇరుకు సందులో ఇళ్ల మధ్య బందీ అయిపోయింది. దాని గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకుండా పోయింది. కొంతమంది చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు రికార్డు చేసినా, అది కొంతమందికే పరిమితమైంది. దేశంలో 29వ రాష్ట్రం (కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారకముందు)గా ఆవిర్భవించిన తెలంగాణ పేరును తొలిసారి లిఖితపూర్వకంగా వాడింది ఈ శాసనంలోనే. అంటే ‘తెలంగాణ’అస్తిత్వానికి తొలి నిదర్శనం అన్నమాట. - సాక్షి, హైదరాబాద్ ‘తెలుంగాణపురం’ఎక్కడుంది? ఈ ప్రశ్నకు...‘అది మన రాష్ట్రం పేరు, ఆ పేరుతో ఊరు కూడా ఉందా?’అన్న ఎదురు ప్రశ్నే సమాధానంగా వస్తుంది. కానీ ఆ పేరుతో ఓ ఊరు కూడా ఉండేది.. అది ఎక్కడో కాదు... భాగ్యనగర శివార్లలోనే. అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ పురోగతికి ఇప్పుడు చిరునామాగా కనిపిస్తున్న తెల్లాపూరే... ఒకప్పటి తెలుంగాణపురం. కాలక్రమంలో తెలుంగాణపు రం కాస్తా క్రమంగా తెల్లాపూర్గా మారిపోయింది. తెలంగాణ అన్న పదం ఉన్న తొలి తెలుగు శాసనం వెలుగుచూసింది ఈ గ్రామంలోనే. ఇది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోకి వస్తుంది. 604 ఏళ్ల కిందట.. బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా తన రాజ్యాన్ని విస్తరించే క్రమంలో 1417లో విజయనగర రాజు రెండో దేవరాయల అధీనంలో ఉన్న పానగల్లు కోట మీద దాడికి బయలుదేరాడు. దారిలో కనిపించిన హిందూ సంప్రదాయ కట్టడాలను ధ్వంసం చేయటం ఆ సైన్యం పనిగా పెట్టుకుంది. ఈ క్రమంలో పలు మందిరాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో తెల్లాపూర్ కూడా ప్రణాళికాబద్ధంగా ఎదిగిన పట్టణం. తెలుంగాణ పురమన్న పేరుతో అభివృద్ధి చెందిన ప్రాంతం. కొందరు విశ్వకర్మలు ఈ ప్రాంతంలో మంచి పనిమంతులైన శిల్పులుగా పేరుపొంది ఉన్నారు. వారు నగల తయారీలోనే కాకుండా, నగర ప్రణాళికల రూపకల్పనలోనూ నేర్పు ఉన్నవారు. అందులో కొండమీది మల్లోజు, అతని కొడుకులు నాగోజు, అయ్యలోజు, వల్లబోజు తదితరులు ఇక్కడ పెద్ద మామాడి తోటను నిర్వహించేవారు. దానికి నీటి కోసం విశాలమైన దిగుడు బావి తవ్వించి ఏతాం పద్ధతిలో నీటి సాగుకు వాడేవారు. పానగల్లు కోటపై దాడి కోసం ఫిరోజ్ షా ఇదే మార్గంలో వెళ్లనున్నారని తెలిసి, వారు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఫిరోజ్ షా భార్యకు బంగారు పూదండలు దిద్దిన కంఠాభరణం, బంగారు గాజులు అందంగా తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాలను వివరిస్తూ ప్రత్యేకంగా ఆ మల్లోజు వంశస్తులు ప్రశస్తి శాసనం చెక్కి దిగుడుబావి పైన ఏతాం కోసం ఏర్పాటు చేసిన రాతి స్తంభాల మధ్య ఏర్పాటు చేయించారు. అదే ఈ శాసనం. అందులో ఈ ప్రాంతాన్ని తెలుంగాణపురంగా పేర్కొన్నారు. ఆ శాసనంపై తెలుగులో24 పంక్తుల వివరాలున్నాయి. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా పురావస్తు శాఖలో స్తపతి ఈమని శివనాగిరెడ్డి ఈ శాసనాన్ని 2008లో పరిశీలించారు. అప్పటికే బావిని సింహభాగం పూడ్చేశారు. కొన్ని మెట్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. పైగా గిరక కోసం ఏర్పాటు చేసిన రెండు రాతి శిలలు పడిపోయే పరిస్థితిలో ఉండటంతో ఆయన వాటిని క్రమపద్ధతిలో పూర్వపు స్థితిలో తిరిగి ఏర్పాటు చేయించారు. ఆ శిలల దిగువన కాకతీయ శైలిలో కళాత్మకంగా చెక్కిన భారీ రాతి బేస్ ఉంది. ఆ తర్వాత మొత్తం బావిని స్థానికులు పూడ్చేశారు. ఇప్పుడు దాని చుట్టూ ఇళ్లు వెలియటంతో పూర్తి ఇరుకు స్థలంలో ఆ శాసనం బందీగా ఉండిపోయింది. అప్పట్లోనే శివనాగిరెడ్డి... నేతలను తీసుకెళ్లి దీన్ని చూపించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి ‘తెలంగాణ అన్న పేరును వాడిన తొలి శాసనానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యం దక్కాలి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ఇంత పెద్ద ఉద్యమంతో ఏర్పడ్డ రాష్ట్రంలో.. రాష్ట్రం పేరును తొలిసారి వాడిన శాసనంగా దానికి అందలం దక్కాల్సి ఉంది. -శివనాగిరెడ్డి, చరిత్రకారులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement