breaking news
Alstom
-
ఆల్స్తోమ్కు చెన్నై మెట్రో ఆర్డర్
న్యూఢిల్లీ: రోలింగ్ స్టాక్ తయారీలో ఉన్న ఫ్రెంచ్ దిగ్గజం ఆల్స్తోమ్కు తాజాగా చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి ఓ కాంట్రాక్ట్ను చేజిక్కించుకుంది. ఈ డీల్ విలువ రూ.798 కోట్లు. ఇందులో భాగంగా 78 అత్యాధునిక మెట్రో కోచ్లను చెన్నై మెట్రోకు ఆల్స్టమ్ సరఫరా చేయనుంది. వీటిలో 26 యూనిట్లు (త్రీ–కార్ కాన్ఫిగరేషన్) కూడా ఉన్నాయి. ఇవి గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఈ మెట్రో ట్రెయిన్స్ డ్రైవర్లు లేకుండానే పూర్తిగా సిగ్నల్స్ ఆధారంగా నడుస్తాయి. ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ నుంచి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో ఉన్న ఆల్స్టమ్ ప్లాంటులో మెట్రో కార్స్ తయారు కానున్నాయి. ఏటా 480 యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ కేంద్రం ప్రత్యేకత. చెన్నై మెట్రోకు ఇప్పటికే 208 మెట్రో కార్స్ను ఆల్స్టమ్ సరఫరా చేసింది. ఢిల్లీ, చెన్నై, లక్నో, కొచ్చి నగరాల్లో సంస్థ తయారీ మెట్రో ట్రెయిన్స్ పరుగెడుతున్నాయి. ముంబై మెట్రో లైన్–3, ఆగ్రా–కాన్పూర్ మెట్రో, ఇందోర్–భోపాల్ ప్రాజెక్టులకు కావాల్సిన మెట్రో కోచ్లు ప్రస్తుతం తయారీలో ఉన్నాయి. -
జీఈ ఖాతాలోకి అల్స్తోమ్ విద్యుదుత్పత్తి వ్యాపారం
డీల్ విలువ 12.4 బిలియన్ యూరోలు లండన్: ఫ్రాన్స్కి చెందిన విద్యుత్ పరికరాల తయారీ దిగ్గజం అల్స్తోమ్ తమ విద్యుదుత్పత్తి, గ్రిడ్ వ్యాపార విభాగాలను అమెరికాకంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) సంస్థకు విక్రయించింది. ఈ డీల్ విలువ దాదాపు 12.4 బిలియన్ యూరోలని అల్స్తోమ్ తెలిపింది. రైలు రవాణా వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దీని ద్వారా వచ్చిన నిధుల్లో 700 మిలియన్ యూరోలను జీఈ సిగ్నలింగ్ విభాగం కొనుగోలుకు వెచ్చించనున్నట్లు పేర్కొంది. అలాగే, స్టీమ్, అణు విద్యుత్ తదితర రంగాల్లో జనరల్ ఎలక్ట్రిక్ తో 3 జాయింట్ వెంచర్ల ఏర్పాటుపై 2.4 బిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అల్స్తోమ్ తెలిపింది. ఈ డీల్ ఇరు కంపెనీలకు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చగలదని కంపెనీ చైర్మన్ ప్యాట్రిక్ క్రోన్ తెలిపారు.