breaking news
Algiers
-
ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం
అల్జీరియా రాజధాని అల్జీర్స్లోని ఓ ఫోస్టర్ కేర్ హోమ్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. ఫోస్టర్ కేర్ హోమ్ అంటే తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలకు తాత్కాలికంగా సంరక్షణ అందించే వ్యవస్థ. దేశ పౌర రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అగ్ని ప్రమాదంలో మరో 19 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు బాగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 3 గంటలకు పైగా మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేశారు.అధికారులు ఈ అగ్ని ప్రమాదంపై వివరాలు వెల్లడించారు. మరణించినవారి, గాయపడినవారి వయసుల గురించి తమ ప్రకటనలో ప్రస్తావించలేదు. పౌర రక్షణ శాఖ 10 అగ్నిమాపక వాహనాలు, 16 అంబులెన్సులను ఘటన స్థలానికి పంపించింది. అల్జీరియాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి.వారం వ్యవధిలో దాదాపు 1,000 అగ్నిప్రమాదాలు నమోదైనట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అల్జీరియా ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధానమంత్రి సిఫీ ఘ్రియెబ్ గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు అల్జీర్స్లోని రెండు ఆసుపత్రులకు వెళ్లారు. అగ్నిప్రమాదం వేళ ఐదుగురు వికలాంగులను సంరక్షణలోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. -
ఎయిర్పోర్టు సమీపంలో కూలిన విమానం
అల్జీర్స్: సైనికులను తరలిస్తున్న ఆర్మీ విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 200 మంది దుర్మరణం చెందారు. ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో బుధవారం ఈ సంఘటన జరింది. దేశరాజధాని అల్జీర్స్ శివారులోగల బొఫరిక్ ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా.. ప్రమాదవశాత్తూ కుప్పకూలిపోయింది. ఎయిర్పోర్టు పక్కనేఉన్న జనావాసాలపై విమానం కూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. స్థానిక మీడియా కథనాల మేరకు.. బొఫరిక్ ఎయిర్పోర్టు ప్రస్తుతం ఆర్మీ ఆధీనంలో ఉంది. అవసరాల నిమిత్తం వివిధ ప్రాంతాలకు సైన్యాన్ని తరలించే కార్యక్రమం ఇక్కడి నుంచే జరుగుతూఉంటుంది. ఆ క్రమంలో బుధవారం 100 మంది సైనికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్పోర్టుకు సమీపంగా కూలిపోయింది. ఈ ఘటనలో సైనికులు, విమాన సిబ్బంది అందరూ చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. విమానం కూలిన ఇళ్లలోని ప్రజలను కలుపుకుంటే మృతుల సంఖ్య 200 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అల్జీరియా విమాన శకలాలు లభ్యం
విమానంలోని 116 మంది మృతి పారిస్: ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో కూలిపోయిన అల్జీరియా విమానం శకలాలు లభించాయి. బర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుంచి అల్జీరియా రాజధాని అల్జీర్స్కు బుధవారం అర్ధరాత్రి బయలుదేరిన 50 నిమిషాలకే ఈ విమానం మాలిలోని గోస్సి ప్రాంతంలో కూలింది. విమానంలోని 116 మంది మృతిచెందారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండె ప్రకటించారు. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నా ఉగ్ర దాడి సహా ఏ కోణాన్ని తోసిపుచ్చలేమన్నారు. ఈ ప్రమాదంలో 51 మంది తమ దేశ జాతీయులు మృతిచెందారన్నారు. తమ బలగాలు ఘటనాస్థలికి చేరుకొని విమాన శకలాల సమీపంలో పడిఉన్న బ్లాక్బాక్స్ను గుర్తించాయన్నారు


