-
నిన్న తల్లి మరణం, నేడు బర్త్డే... అక్షయ్ భావోద్వేగం
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నేటితో 54వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇవాళ (సెప్టెంబర్ 9) ఆయన బర్త్డే. కానీ ఆయన కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగింది. బుధవారం (సెప్టెంబర్ 8) తెల్లవారుజామున అక్షయ్ మాతృమూర్తి అరుణ భాటియా మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. తల్లి మరణించిన తెల్లవారే తన జన్మదినం కావడంతో అక్షయ్ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం ఈ సందర్భంగా తల్లి తన చెంపపై ముద్దు పెడుతున్న ఫొటోను గురువారం షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ‘ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. కానీ అమ్మ పైనుంచి నా కోసం కచ్చితంగా హ్యాపీ బర్త్డే పాట పాడుతుందని తెలుసు! మీ అందరి సంతాపం, విషెస్కు ధన్యవాదాలు’ అంటూ ఆయన ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా అక్షయ్ తన తల్లితో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆమెతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్ సందర్భంగా లండన్కు తీసుకెళ్లి వీల్ చైర్పై తల్లితో అక్కడి రోడ్లపై సందడి చేసిన వీడియోను కూడా పంచుకున్నారు. చదవండి: ప్రియుడిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన బిగ్బాస్ కంటెస్టెంట్ Would have never liked it this way but am sure mom is singing Happy Birthday to me from right up there! Thanks to each one of you for your condolences and wishes alike. Life goes on. pic.twitter.com/PdCGtRxrvq — Akshay Kumar (@akshaykumar) September 9, 2021 ఈ సందర్భంగా ‘మనం పనిలో ఎంత బిజీగా ఉన్న, ఎంత ఎత్తుకు ఎదిగినా మన తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తున్నారనే విషయాన్ని మరవకండి. బిడ్డలుగా వీలైనంత సమయం వారితో కేటాయించండి’ అంటూ రాసుకొచ్చారు. కాగా అక్షయ్ ప్రస్తుతం ‘సిండ్రెల్లా’ సినిమా చేస్తున్నారు. ఆ షూటింగ్ కోసం ఆయన లండన్ వెళ్లారు. ఆ సమయంలోనే తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలియడంతో హుటాహుటినా ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
గోల గోల కామిక్స్
పరిగెత్తే చిత్రాలకి నిలబడే చిత్రాలకి తేడా అదే.నిలబడే చిత్రాలు నిలిచిపోతాయి.మనసపై ముద్రించుకుపోతాయి.పిల్లలకు మంచి సందేశాన్నిస్తాయి. ఉత్సాహాన్ని నింపుతాయి.అవును. నిలబడే చిత్రాలు పిల్లల మనసులను పరిగెత్తిస్తాయి. రజనీకాంత్కు చిన్నపిల్లలు ఫ్యాన్స్గా ఉండొచ్చు. సల్మాన్ ఖాన్కు చిన్నపిల్లలు ఫ్యాన్స్గా ఉండొచ్చు. కాని ఒక డైరెక్టర్కు పిల్లలు ఫ్యాన్స్గా ఉండటం కిడ్స్ పేజీలో రావాల్సిన న్యూసే. డైరెక్టర్ రోహిత్ షెట్టి తీసిన కామెడీ సిరీస్ ‘గోల్మాల్ ఫన్ అన్లిమిటెడ్’, ‘గోల్మాల్ రిటర్న్స్’, ‘గోల్ మాల్ 3’, ‘గోల్మాల్ అగైన్’ భారీ హిట్స్గా నిలిచాయి. ఆ తర్వాత టీవీలో పదే పదే ప్రసారం అవుతూ పిల్లలు ఎంజాయ్ చేసే సినిమాలుగా మారాయి. ఈ సిరీసే కాదు రోహిత్ షెట్టి తీసిన ‘సింగమ్’, ‘సింగమ్ రిటర్న్స్’ సినిమాలు కూడా కాప్ మూవీస్గా పిల్లలకు బాగా నచ్చాయి. దాంతో ఈ సినిమాలను పిల్లలకు మరింత దగ్గర చేయడానికి వీటి ఆధారంగా కామిక్స్గా తయారవుతున్నాయి. గత సంవత్సరం ‘లిటిల్ సింగమ్’ పేరుతో ఒక కామిక్ సిరీస్ ‘డిస్కవరీ కిడ్స్’లో మొదలయ్యి బాల సింగమ్ చేసే సాహసాలతో పిల్లలను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘గోల్మాల్’ సిరిస్లోని పాత్రలతో ‘గోల్మాల్ జూనియర్’ కామిక్ సిరీస్ నిక్లోడియన్ గ్రూప్కు చెందిన ‘సోనిక్ చానెల్’లో ఈ నెల 13 నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా పిల్లల గురించి, రాబోయే సినిమాల గురించి రోహిత్ శెట్టి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ∙మీ సినిమాలలో స్టంట్స్ ఫేమస్. ఇవి పిల్లలను దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేస్తారా? రోహిత్: ఫైట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మనం కూడా మన చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటే అట్ట కత్తులతో బొమ్మ తుపాకులతో ఫైట్ చేసే ఆటలే ఆడుకుని ఉంటాం. అదీ గాక మా నాన్న ఎం.బి.శెట్టి పెద్ద స్టంట్ డైరెక్టర్. అందువల్ల కూడా నాకు స్టంట్స్ అంటే ఇష్టం ఏర్పడి ఉంటుంది. ∙మీ ఫైట్స్ సైన్స్ సూత్రాలు పాటించవు. గాల్లో కార్లు ఎలా ఎగురుతాయి? ఆకాశంలో ఎగరాల్సిన విమాన కంపెనీలు మూత పడుతున్నాయి (చిన్న నవ్వు). కనీసం కార్లైనా ఎగరనివ్వండి. ఏమో... ఇంకో పది పన్నెండేళ్లకు నిజంగానే ఎగిరే కార్లు రావని గ్యారంటీ ఏమిటీ. అప్పుడు అందరూ నన్నే తలుచుకుంటారు. ∙మీ బాల్యం గురించి చెప్పండి? మా నాన్నగారికి మా అమ్మ రత్నా శెట్టి రెండో భార్య. నా ఎనిమిదేళ్ల వయసులోనే మా నాన్న చనిపోయారు. అప్పటికి ఆయన వయసు యాభై కూడా ఉండదు. ఆయన జీవించి ఉండగా చాలా ఫేమస్. సౌత్ సినిమాలలో చాలా వాటిల్లో నటించారు (ఎన్.టి.ఆర్ ‘డ్రైవర్ రాముడు’లో బొర్రాగుహల ఫైట్ సీన్లో ఎం.బి.శెట్టి నటించారు). అయితే ఆయన చనిపోవడంతో అమ్మ సింగిల్ మదర్గా నన్ను పెంచింది. ఆమె చాలా ధైర్యమున్న స్త్రీ. నా ప్రతి జీవిత సందర్భంలో ఆమెను చూసే ధైర్యం తెచ్చుకున్నాను. ఆమె ఈ రోజుకీ నాతోనే ఉంటోంది. బయట ఎన్ని చికాకులు ఎదురై ఇంటికి వెళ్లినా అమ్మను చూడగానే అమ్మయ్య... అమ్మ ఉంది కదా అనే ధైర్యం వచ్చేస్తుంటుంది. చేసే పని ఏదైనా దానిని నిజాయితీతో చేయాలి అని ఆమె నూరిపోసిన విలువను గట్టిగా పాటిస్తాను. ఆమె కూడా నాన్నతోనే స్టంట్ ఉమన్గా పని చేసింది. కనుక నా మీద సినిమా ప్రభావం అనివార్యంగా పడింది. నేను ముందు నుంచి సినిమా రంగంలో పని చేయాలని అనుకున్నాను. నా పదిహేడవ ఏటే అసిస్టెంట్ డైరెక్టర్గా మారాను. ముప్పయ్యవ ఏట డైరెక్టర్ అయ్యాను. ∙మీ గోల్మాల్ సిరీస్లోని పాత్రలు ఇప్పుడు కామిక్ క్యారెక్టర్స్ మారేంత ఫేమస్ అయ్యాయి... అవును. ఇది నాకు చాలా సంతోషాన్నిస్తోంది. గోల్మాల్ తీస్తున్నప్పుడు ఇది మొదట పిల్లలకు నచ్చాలి అనుకున్నాను. పిల్లలకు నచ్చితే వారే తల్లిదండ్రులను థియేటర్కు తీసుకుని వస్తారు. పిల్లలు చూస్తారు కనుక నా సినిమాల్లో అశ్లీలత కనిపించకుండా జాగ్రత్త పడతాను. గోల్మాల్ సిరిస్లో అజయ్ దేవగణ్ వేసిన గోపాల్ పాత్ర, తుషార్ కపూర్ వేసిన లక్కీ పాత్ర, అర్షద్ వర్సీ వేసిన మాధవ్ పాత్ర, షర్మన్ జోషి వేసిన లక్ష్మణ్ పాత్ర ఇవి పిల్లలకు నచ్చాయి. నికొలొడియన్ సంస్థ నా సంస్థతో కలిసి ఈ క్యారెక్టర్స్తో కామిక్స్ చేద్దామని అన్నప్పుడు సంతోషంగా అంగీకరించాను. సినిమాల్లో కేవలం మూడు గంటల పాటే వీరి అల్లరి ఉంటుంది. టీవీలో ఇక మీదట రోజూ ఉంటుంది. సోనిక్ చానల్లో మధ్యాహ్నం 1.30కు ఈ గోల్మాల్ జూనియర్ చూడవచ్చు. ∙గోల్మాల్లో తుషార్ వేసే మూగ పాత్ర చాలామంది పిల్లలకు ఇష్టమని గమనించారా? తుషార్కు ఆ పాత్ర చాలా పేరు తెచ్చింది. అతడు మూగభాష మాట్లాడుతుంటే పర్ఫెక్ట్ టైమింగ్తో దాని అర్థాన్ని షర్మన్ జోషి చెబుతుంటాడు. తుషార్ మూగవాడైనందుకు దిగులుగా చింతగా ఉండడు. ఎనర్జిటిక్గా ఉంటాడు. లైఫ్ను ఎంజాయ్ చేస్తుంటాడు. మనకు ఏవైనా లోపాలు ఉన్నా లైఫ్ను సరదాగా తీసుకుని ముందుకు సాగాలని పిల్లలు అనుకుంటే మంచిదే కదా. ∙మీ చిన్నప్పుడు మీకిష్టమైన కామిక్ క్యారెక్టర్ ఏది? టిన్టిన్. అది చేసే అడ్వంచర్స్ చాలా ఇష్టపడేవాణ్ణి. కంటెంట్ వల్ల మాత్రమే కాదు ఆ కామిక్స్ క్వాలిటీ చాలా బాగుండేది. అందువల్ల కూడా ఇష్టపడేవాణ్ణి. ∙మీరు ‘సింగమ్ సిరిస్’ నుంచి ‘లిటిల్ సింగమ్’ కామిక్ క్యారెక్టర్ పుట్టించారు. ఆడపిల్లలు కూడా శక్తిమంతులే కదా. అబ్బాయిలేనా? అక్కడికే రాబోతున్నాను. నా సింగం సినిమాల్లో సూపర్ కాప్గా అజయ్ దేవగణ్ కనిపిస్తారు. కాని నిజ జీవితంలో సూపర్ లేడీ కాప్స్ కూడా ఉంటారు. స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదు. అందుకే లేడీ సూపర్ కాప్తో ఒక సినిమా చేయనున్నాను. అది కూడా కామిక్ క్యారెక్టర్గా మారితే ఆడపిల్లలను ఇన్స్పయిర్ చేయొచ్చు. ∙ఎవరా సూపర్ లేడీ కాప్. కరీనానా? కత్రీనానా? ఇలాంటి ప్రశ్నలు వేసి రేపు నన్ను హెడ్లైన్స్లో ఇరికించకండీ. నేను కొంచెం స్మార్ట్. అప్పడే బయట పెట్టను (నవ్వుతూ). ∙నేటి పిల్లలు ఎలా ఉన్నారు? నా కొడుక్కు ఇప్పుడు 13 సంవత్సరాలు. నా సినిమాలన్నీ బాగా ఎంజాయ్ చేస్తాడు. పిల్లలు హోమ్ వర్కు, హాబీ క్లాసు, గోల్డ్ మెడలు, టాప్ ర్యాంక్ వీటి చుట్టూ తిరుగుతున్నారు. వాటికి ఎంత విలువ ఇవ్వాలి పిల్లలు ఎంత రిలాక్స్ అవ్వాలి అనేది మనం ఆలోచించాలి. సమ్మర్ హాలిడేస్లో కూడా వారిని ఆడుకోనివ్వకుండా చదివించడం సరైనది కాదు. అందుకే అవన్నీ మర్చిపోండి... హాయిగా రోజులో కాసేపైనా మీకు నచ్చిన కామిక్స్ చూడండి అని చెప్పాలనిపిస్తుంది. ∙మీ జీవితం నుంచి వారికి ఏం చెప్తారు? కష్టపడమని చెప్తాను. కష్టపడకుండా ఏదీ రాదు. పనిని లేదా చదువును ఎంజాయ్ చేయమని కూడా చెప్తాను. ఉదయాన్నే లేచి షూటింగ్కు వెళ్లడం నాకు ఇష్టం. ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. షూటింగ్ కోసం ఒక్కోసారి ఉదయం ఆరు గంటలకు బయలుదేరి వెళతాను. పనులు ముగిసే సరికి రాత్రి పన్నెండు కూడా కావచ్చు. కాని మళ్లీ తెల్లారి ఆరుగంటలకు అంతే ఉత్సాహంగా బయలుదేరుతాను. 2003లో నేను డైరెక్టర్ను అయితే నేటివరకు దాదాపు ఏ సంవత్సరంలోనూ నా సినిమా రిలీజ్ కాకుండా లేదు. పని చేయడం బాగుంటుంది. పని చేయాలి. ∙మీ తాజా చిత్రం ‘సూర్యవంశీ’లో అక్షయ్ కుమార్ హీరో. అతనిపాత్ర సూపర్ కాప్. ‘అవెంజర్స్’ లాంటి పాత్రల ప్రభావం మీ మీద ఉందా? లేదు. అవెంజర్స్తో పోలిక చాలా పెద్ద మాట. అది జోక్ అవుతుంది. నా సూపర్ హీరోలు లోకల్ హీరోలు. వాళ్లు కూడా చెడు మీద పోరాడతారు. వాళ్లు లోకల్గా ఇన్ఫ్లూయెన్స్ చేస్తే చాలు. ప్రపంచాన్ని చేయక్కర్లేదు. నా ‘సూర్యవంశీ’లో అక్షయ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కు హెడ్గా కనిపిస్తారు. వివరాలు మాత్రం 2020 మేలో వెండితెర మీద చూడండి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
2.0 @ 2:28:52
కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 29వ తేదీ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్ ‘2.ఓ’ థియేటర్లోకి వచ్చే రోజు అది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 550 కోట్ల బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 2010లో వచ్చిన ‘ఎందిరిన్’ చిత్రానికి ‘2.ఓ’ సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యయని కోలీవుడ్ సమాచారం. నిడివి 2గంటల 28నిమిషాల 52 సెకన్లు అట. సెన్సార్ టీమ్ ఎటువంటి కట్స్ చెప్పలేదు కానీ కొన్ని పదాలను మ్యూట్ చేయమని అడిగారట. ఇంకో విషయం ఏంటంటే... ఇప్పటివరకూ శంకర్ దర్శకత్వం వహించిన ‘జెంటిల్మేన్, భారతీయుడు, అపరిచితుడు, రోబో’ తదితర చిత్రాల్లోకెల్లా ‘2.ఓ’ సినిమా నిడివి తక్కువని కోడంబాక్కమ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... రజనీకాంత్ కెరీర్లో 1995లో విడుదలైన ‘ముత్తు’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 23న జపాన్లోని టోక్యోలో రీ–రిలీజ్ చేయాలనుకుంటున్నారని కోలీవుడ్లో వినిపిస్తోంది. -
ఫస్ట్ లుక్ వచ్చేసింది
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'ఎయిర్ లిఫ్ట్' ఫస్ట్ పోస్టర్ విడుదల అయింది. రాజ్ క్రిష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్లుక్ ను సోషల్ మీడియాలో అక్షయ్ మంగళవారం రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పోస్టర్ను ఫేస్ బుక్ పేజ్ లో, ట్విట్టర్ లో అక్షయ్ షేర్ చేశారు. ఈ సందర్భంగా 'కువైట్లో ఘటనలో ఎంతమంది రక్షించబడ్డారో ఎంతమందికి తెలుసు.. ఒక యథార్థ గాథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఇలాంటి సినిమాలో భాగం కావడం' తనకు చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్ చేశారు. కాగా కువైట్లో 1990లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం 'ఎయిర్ లిఫ్ట్'. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, లంచ్ బాక్స్ ఫేం హీరోయిన్ నిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కువైట్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే క్రమంలో ఎదురైన పరిస్థితులను దర్శకుడు రాజ్ మీనన్ చాలా అద్భుతంగా తెరకెక్కించారని అక్షయ్ అన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే బుధవారం చిత్ర టీజర్ను విడుదల చేయనున్నట్లు అక్షయ్ తెలిపారు. అక్షయ్తో పాటు ఈ చిత్ర సహ నిర్మాత నిఖిల్ అద్వానీ కూడా 1990 నాటి దుర్ఘటను మళ్లీ తలచుకోవడం విచారకరమని ట్విట్ చేశారు. ఏ యుద్ధంలోనైనా అమాయక ప్రజలే బలైపోతున్నారని వ్యాఖ్యానించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement