breaking news
Agentic AI
-
ఏఐ ఏజెంట్లతో షాపింగ్.. మాస్టర్ కార్డ్ ఏజెంటిక్ కామర్స్ విప్లవం!
కృత్రిమ మేధ(ఏఐ) కేవలం సమాధానాలు ఇచ్చే స్థాయి నుంచి మన తరఫున పనులు పూర్తి చేసే ఏజెంటిక్ స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వేదికగా మాస్టర్ కార్డ్ తన వినూత్న ఏజెంటిక్ కామర్స్ ఫ్రేమ్వర్క్ను ఆవిష్కరించింది. కేవలం వస్తువులను సిఫార్సు చేయడమే కాకుండా వినియోగదారుడి అవసరాలను గుర్తించి బేరసారాలు ఆడి, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేసే సామర్థ్యం దీని సొంతం. ఈ సందర్భంగా మాస్టర్ కార్డ్ ఏఐ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితేంద్ర రాజ్పుత్ కొన్ని అంశాలు వెల్లడించారు.స్థానిక భాషల్లో ఆర్థిక లావాదేవీలుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా మాస్టర్ కార్డ్ తన ఏజెంటిక్ వ్యవస్థను రూపొందించింది. కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు సైతం ఏఐ ప్రయోజనాలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థలో వినియోగదారుడు మొదటగా తనకిష్టమైన భాషను ఎంచుకోవచ్చు. వాయిస్ సపోర్ట్తో కూడిన ఈ టెక్నాలజీ వివిధ భారతీయ భాషల్లో సంభాషించగలదు.భారతీయ నిబంధనలకు అనుగుణంగా డేటా స్థానికీకరణ (Data Localization), గోప్యత, భారతీయ ఆర్థిక చట్టాలకు లోబడి ఈ ఫ్రేమ్వర్క్ నిర్మించినట్లు కంపెనీ తెలిపింది. ‘మేము భారతదేశంలో దశాబ్దాలుగా సర్వీసులు అందిస్తున్నాం. ఇక్కడి డేటా నిబంధనల ఆధారంగానే మా ఏజెంటిక్ కామర్స్ ఏర్పాటు చేశాం’ అని రాజ్పుత్ స్పష్టం చేశారు.సాధారణ ఈ-కామర్స్ Vs ఏజెంటిక్ కామర్స్సాధారణ ఈ-కామర్స్లో మీరు ఒక వెబ్సైట్కి వెళ్లి వస్తువులను వెతికి, ధరలను పోల్చి, మీరే ఆర్డర్ చేస్తారు. ఇక్కడ ఏఐ కేవలం ‘మీకు ఫలానా వస్తువులు నచ్చవచ్చు’ అని సిఫార్సులు మాత్రమే చేస్తుంది.ఏజెంటిక్ కామర్స్లో ఒక ఏఐ ఏజెంట్ ఉంటుంది. మీరు దానికి ఒక పని చెబితే (ఉదాహరణకు: వచ్చే వారం మా నాన్నగారి పుట్టినరోజు కోసం రూ.5000 బడ్జెట్లో ఒక మంచి వాచ్ కొనాలి), అది స్వయంగా ఇంటర్నెట్లో వెతుకుతుంది. రివ్యూలు చదువుతుంది. ఉత్తమమైన ధర ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటుంది. చివరగా మీ అనుమతితో లావాదేవీని పూర్తి చేస్తుంది.మోసాలకు తావులేని ఆటోమేషన్ఏఐ ఏజెంట్లు స్వయంగా ఖర్చు చేస్తాయంటే భద్రతపై ఆందోళన కలగడం సహజం. దీన్ని అరికట్టడానికి మాస్టర్ కార్డ్ టోకెనైజేషన్, పాస్ కీ వంటి అధునాతన భద్రతా ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఏజెంట్ లావాదేవీ చేయాలంటే వినియోగదారుడి అనుమతి తప్పనిసరి. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి కంపెనీ తన ప్లాట్ఫామ్ను మరింత బలోపేతం చేసింది. ఇది వినియోగదారుడి గత చరిత్రను విశ్లేషించి అసాధారణ మార్పులను వెంటనే గుర్తిస్తుంది. గ్రాఫ్ ఆధారిత సాంకేతికత ద్వారా సింథటిక్ ఐడెంటిటీలు, అంతర్జాతీయ మోసగాళ్ల నెట్వర్క్లను పసిగట్టడం మాస్టర్ కార్డ్ ప్రత్యేకతని కంపెనీ తెలిపింది.ఉద్యోగాల కోత కాదు..ఏజెంటిక్ ఏఐ రాకతో ఫిన్టెక్ రంగంలో ఉద్యోగాలపై ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు రాజ్పుత్ స్పందిస్తూ ‘కచ్చితంగా ఉద్యోగాల స్వరూపంలో మార్పు ఉంటుంది. అయితే ఉద్యోగాల కోత కంటే వివిధ జాబ్ రోల్స్పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది’ అని విశ్లేషించారు. మెకానికల్ పనులను ఏఐ చూసుకుంటే మానవులు మరింత సృజనాత్మక, వ్యూహాత్మక పనుల వైపు మళ్లాలని సూచించారు.ఇదీ చదవండి: రిటైర్మెంట్కు రెడీనా? -
ఏజెంటిక్ ఏఐ నిపుణులకు డిమాండ్
దేశీయంగా ఏజెంటిక్ ఏఐ, స్పెషలైజ్డ్ జెన్ఏఐ నిపుణులకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్–సరఫరా మధ్య 50 శాతం పైగా వ్యత్యాసం ఉండగా, ఆయా ఉద్యోగాల పోస్టింగ్ల ఏటా 35–40 శాతం పెరుగుతోంది. 28,000 జాబ్ పోస్టింగ్స్ ఆధారంగా క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రిపోర్టు ప్రకారం కంపెనీలు ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐని ప్రయోగాత్మక పరీక్షలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. దీనితో పూర్తి స్థాయి సామర్థ్యాలున్న నిపుణులను నియమించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతీయ ఏజెంటిక్ ఏఐ మార్కెట్ 3.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. 2024లో ఇది 276 మిలియన్ డాలర్లుగా నమోదైంది. సిస్టంలు స్వయంగా నిర్ణయాలు, చర్యలు తీసుకోగలిగే మరింత అధునాతన కృత్రిమ మేథను ఏజెంటిక్ ఏఐగా వ్యవహరిస్తున్నారు.నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..సీనియర్ ఆర్కిటెక్చర్, సేఫ్టీ ఉద్యోగులకు జీతభత్యాలు సగటు స్థాయికంటే 20–28 శాతం అధికంగా ఉంటున్నాయి.70 –75 శాతం జీసీసీలు, భారీ కంపెనీలు అంతర్గతంగా నిర్మాణాత్మక ఏఐ శిక్షణ ప్రోగ్రాంల దన్నుతో 30–35 శాతం అడ్వాన్స్డ్ ఏఐ ఉద్యోగాలను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. మొత్తం అధునాతన ఏఐ నియామకాల్లో రిమోట్ ఉద్యోగుల వాటా 15–20 శాతం ఉండనుంది.మొత్తం ఏజెంటిక్ ఏఐ హైరింగ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల వాటా 54 శాతం స్థాయిలో ఉండనుంది.టెక్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సరీ్వస్) సంస్థలు తమ ఉత్పత్తుల్లో 68 శాతం ఏజెంటిక్ ఏఐని పొందుపరుస్తున్నాయి.ఏజెంటిక్ ఏఐ హైరింగ్లో మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్ వాటా 70 శాతం పైగా ఉంటోంది. కెరియర్ తొలినాళ్లలో ఉన్న వారి రిక్రూట్మెంట్ 20 శాతం మేర ఉంటోంది. గవర్నెన్స్, సేఫ్టీ, ప్రోడక్ట్ స్ట్రాటెజీ విభాగాల్లో లీడర్íÙప్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి.72 శాతం ఉద్యోగార్హతల్లో టూల్–కాలింగ్, ఆర్కె్రస్టేషన్ మొదలైన నైపుణ్యాలు ఉంటున్నాయి. 63 శాతం ఉద్యోగాలకు రిట్రీవల్–ఆగ్మెంటెండ్ జనరేషన్ టూల్ సామర్థ్యాలు ఉండాలని కంపెనీలు అడుగుతున్నాయి. లాంగ్గ్రాఫ్, ఆటోజెన్, క్రూఏఐ నైపుణ్యాలకు డిమాండ్ 43 శాతం మేర పెరిగింది.మూడేళ్ల క్రితం కనిపించని చాలా మటుకు ఉద్యోగాలకు ప్రస్తుతం డిమాండ్ నెలకొంది. ఏఐ ఆర్కెస్ట్రేషన్ ఇంజినీర్లు, ఏజెంట్ బిహేవియర్ అనలిస్టులు, ఏజెంట్ సేఫ్టీ అండ్ గవర్నెన్స్ స్పెషలిస్టులు, వెక్టార్ డేటాబేస్ ఆర్కిటెక్టులు, ఏజెంట్ లైఫ్సైకిల్ మేనేజర్లు, ఏజెంటిక్ ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి.భారత్లో టెక్నాలజీ నిపుణులకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ అనేది కొత్త నైపుణ్యం మాత్రమే కాదు, కెరియర్కి దిశా నిర్దేశం చేస్తోంది. ప్రాంతాలవారీగా చూస్తే ఏజెంటిక్ ఏఐ హైరింగ్లో బెంగళూరు, హైదరాబాద్ల వాటా దాదాపు 62 శాతంగా ఉంది. గవర్నెన్స్, వినియోగం, వర్క్ఫ్లో నిర్వహణలకు కేంద్రాలుగా ఎన్సీఆర్, పుణె, చెన్నై ఎదుగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం హైరింగ్లో కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, అహ్మదాబాద్లాంటి ద్వితీయ శ్రేణి నగరాల వాటా దాదాపు 10 శాతంగా ఉంది. -
డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐదే పెద్ద పాత్ర
న్యూఢిల్లీ: దేశంలో శరవేగంగా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులపై జెనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ గణనీయమైన ప్రభావం చూపించనున్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. యూపీఐ ఇకపైనా కీలకంగా ఉంటుందంటూ.. అదే సమయంలో తదుపరి దశ డిజిటల్ చెల్లింపులను క్రెడిట్కార్డులు, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) నడిపించొచ్చని అంచనా వేసింది. ఫిన్టెక్, చెల్లింపుల రంగంలో కీలక స్థానాల్లో ఉన్న 175 మంది అభిప్రాయాలను పీడబ్ల్యూసీ ఇండియా తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. క్రెడిట్ కార్డు కీలక విభాగంగా ఉంటుందని 65 శాతం మంది చెప్పారు. కార్డు చెల్లింపులు బలంగా వృద్ధి చెందుతాయని 95 శాతం మంది భావిస్తున్నారు. చెల్లింపుల వ్యవస్థ ముఖచిత్రంపై జెనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ఎంతో ప్రభావం చూపించనున్నట్టు 73 శాతం మంది చెప్పారు. ఐదేళ్లలో మూడింతలు భారత్లో డిజిటల్ చెల్లింపులు ఇక మీదట అధిక వృద్ధి వేగంతో కొనసాగుతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. 2030 మార్చి నాటికి మూడింతలు అవుతాయని అంచనా వేసింది. ఆవిష్కరణలకుతోడు రుణ సేవల విస్తరణ, నియంత్రణ సంస్థల మద్దతు, సరికొత్త టెక్నాలజీలను స్వీకరించడం, మారుతున్న వినియోగదారుల వైఖరి డిజిటల్ చెల్లింపుల వేగాన్ని నడిపిస్తాయని పేర్కొంది. ‘‘భారత్లో చెల్లింపుల ఎకోవ్యవస్థ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. వచ్చే ఐదేళ్లలో యూపీఐ ఆవిష్కరణలు, సేవల విస్తరణ కొనసాగుతుంది. రుణాల్లో వృద్ధి, బీమా, సంపద కలయికతో డిజిటల్ చెల్లింపులు పెరుగుతాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ మిహిర్గాంధీ తెలిపారు. వివిధ సాధనాల మధ్య అనుసంధానత ద్వారా ఆవిష్కరణలు–విస్తరణ మధ్య సమతూకం ఉండేలా చూడడం అవసరమన్నారు. 90% చెల్లింపులవే..భారత డిజిటల్ చెల్లింపులకు యూపీఐ వెన్నెముకగా నిలుస్తున్నట్టు, 2024–25లో రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం యూపీఐ రూపంలోనే ఉన్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. క్రెడిట్ కార్డు లావాదేవీలు 2023–24లో 100 మిలియన్ దాటగా, 2030 మార్చి నాటికి 200 మిలియన్కు చేరుకుంటాయని పేర్కొంది. వినియోగదారులు యూపీఐ, క్రెడిట్కార్డులకు ప్రాధాన్యం ఇస్తుండడంతో డెబిట్ కార్డుల వినియోగం ఇకమీదటా తగ్గనున్నట్టు తెలిపింది. -
ఏజెంటిక్ ఏఐ.. ఉద్యోగ విప్లవం.. ఏమిటి దీని ప్రత్యేకత?
సాధారణంగా ఏఐ అంటే.. మనం ఏదైనా అడిగితే జవాబు చెప్పే చాట్బాట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఒక పాట ప్లే చేయమనగానే చటుక్కున ప్లే చేసే స్మార్ట్ స్పీకర్ లాంటిది. కానీ, ‘ఏజెంటిక్ ఏఐ’ దీనికి భిన్నమైనది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో మార్పులు, ఏయే ఉద్యోగాలకు ముప్పు రావచ్చు అంటూ ఈ మధ్య మనం చాలా వింటున్నాం. అయితే, అందరూ ఊహిస్తున్న దానికంటే చాలా పెద్ద మార్పు మన ముందుకు రాబోతోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలో ఏకంగా కోటికి పైగా ఉద్యోగాలను ఓ కొత్త రకం ఏఐ పూర్తిగా మార్చనుంది. అదే ’ఏజెంటిక్ ఏఐ’. అయితే ఈ మార్పు వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇది యువతకు కొత్త అవకాశాలు, దారుల్ని తెరుస్తోంది. ఈ ఏఐతో పని వేగం పెరిగి, పనులన్నీ సులభంగా మారిపోనున్నాయి.రిటైల్ రంగంవ్యాపారాలు ఎదుర్కొనే అతి పెద్ద సవాళ్ళలో ఒకటి.. మార్కెట్ ట్రెండ్లు, వినియోగదారుల నుంచి వచ్చే సమాచారాన్ని వేగంగా విశ్లేషించడం. ఏజెంటిక్ ఏఐ ఈ సమస్యను తీరుస్తుంది. ఈ రంగంలో 76 లక్షల ఉద్యోగాలు మార్పునకు గురవుతాయట. ఏఐ ఏజెంట్లు కస్టమర్ల ఇష్టాలను బట్టి వారికి నచ్చే వస్తువులను చూపించడం, ఎప్పుడు ఏ వస్తువు స్టాక్లో ఉందో తెలుసుకోవడం, కస్టమర్ సర్వీస్కు జవాబులు చెప్పడం వంటివి చేస్తాయి. ఈ ఏఐ వల్ల ఉద్యోగులకు విలువైన సమయం ఆదా అవుతుంది. వారు మార్కెట్ మార్పులకు స్పందించడంపై దృష్టి పెట్టొచ్చు. అయితే, ఈ ఏఐ నిర్ణయాలకు మనుషుల పర్యవేక్షణ చాలా ముఖ్యం. ఆటోమేషన్, మానవ నిర్ణయాల మధ్య సమతుల్యత సాధించొచ్చు.విప్లవాత్మక మార్పులు!ఈ ఏజెంటిక్ ఏఐ మన రోజువారీ జీవితాన్ని, ముఖ్యంగా పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది అంటున్నారు టెక్ నిపుణులు.పని విధానంలో మార్పులు: మనం చేసే కొన్ని పనులు బోరింగ్గా, రోజూ ఒకే రకంగా ఉంటాయి. ఈ ఏఐ ఆ రొటీన్ పనులను పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తీసుకుంటుంది. దీంతో మనుషులు క్రియేటివ్గా ఆలోచించడం, కొత్త వ్యూహాలు రూపొందించడం లాంటి కీలకమైన పనులపై దృష్టి పెట్టొచ్చు.కొత్త ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలు: ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు మారినా, కొత్త ఉద్యోగాలూ పుట్టుకొస్తాయి. ఉదాహరణకు, డేటా ఎంట్రీ చేసేవాళ్లు ఏఐని ఎలా ఉపయోగించాలి అని గైడ్ చేసే ‘ఏఐ సూపర్ వైజర్’గా మారొచ్చు. ఈ మార్పును ఎదుర్కోవడానికి మనం ఏఐ టూల్స్ వాడటం, సృజనాత్మకంగా ఆలోచించడం వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఏయే రంగాల్లో..‘సర్వీస్నౌ ఏఐ స్కిల్స్ రీసెర్చ్ 2025’ ప్రకారం, కొన్ని కీలక రంగాల్లో ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ రంగంలో ఏకంగా 80 లక్షల ఉద్యోగాలు మారబోతున్నాయి. ఏఐ ఏజెంట్లు ఒక వస్తువు తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను మేనేజ్ చేయడం, యంత్రాలు ఎప్పుడు పాడైపోతాయో ముందే చెప్పడం, ఉత్పత్తి వేగాన్ని పెంచడం వంటివి చేస్తాయి. దీంతో మనుషులు యంత్రాల పర్యవేక్షణ, మరమ్మతులు వంటి పనులు చేయాల్సి రావొచ్చు.విద్యారంగంఈ రంగంలో 25 లక్షల ఉద్యోగాలు మారనున్నాయి. ఏఐ ఏజెంట్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చదువుకునే ప్రణాళికలు తయారు చేయడం, అసై¯Œ మెంట్లను కరెక్ట్ చేయడం, వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వంటివి చేస్తాయి. దీంతో టీచర్లు క్లాస్రూమ్లో విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడం, వారికి మార్గదర్శకత్వం చేయడం వంటి వాటిపై ఫోకస్ చేయవచ్చు.ఏఐతో కలిసి పనిచేయాలిఇది కేవలం ఆటోమేషన్ మాత్రమే కాదు. పని అంటే ఏంటో తిరిగి నిర్వచించుకునే సమయం. ఈ ఏఐ విప్లవం వల్ల దేశ యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, కొత్త రకాల ఉద్యోగాలు చేయడానికి అపారౖమెన అవకాశాలు లభిస్తాయి. ఏఐతో కలిసి పనిచేయడం ఎలాగో నేర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో మనం మరింత మెరుగ్గా రాణించగలుగుతాం. ఏజెంటిక్ ఏఐ అనేది మన శత్రువు కాదు, మన పనిని సులభతరం చేసే ఒక స్మార్ట్ పార్ట్నర్.– సుమీత్ మాథుర్, ఎస్వీపీ–ఎండీ, సర్వీస్నౌ ఇండియాడేటా సెక్యూరిటీ సమస్యఏజెంటిక్ ఏఐ వల్ల డేటా సెక్యూరిటీ విషయంలో కంపెనీలకు ఇంకా పూర్తి స్పష్టత రాలేదని సర్వీస్నౌ నివేదిక చెబుతోంది. ఇందుకోసం ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయో తమకు తెలియడం లేదని 26 శాతం కంపెనీలు చెప్పాయట.


