హీరోయిన్ అరుంధతి నాయర్ వారం రోజులుగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
మార్చి 16న ఓ ఇంటర్వ్యూకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆమె స్కూటీని ఓ కారు ఢీ కొట్టింది.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
తలకు బలమైన గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికీ కదల్లేని స్థితిలో వెంటిలేటర్పైనే పోరాడుతోంది.
ఆస్పత్రి ఖర్చులు భరించే స్థోమత లేదని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేయండని ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు.
కనీసం తనతో పని చేసినవారైనా సాయం చేస్తారని చూడగా నిరాశే ఎదురైంది.
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఎవరూ ఇంతవరకు సాయం చేయడానికి ముందుకు రాకపోవడం బాధాకరం అని అరుంధతి స్నేహితురాలు, నటి రమ్య వాపోయింది. అరుంధతి..
విజయ్ ఆంటోని 'సైతాన్', పిస్తా, విరుమండికుమ్ శివనందికుమ్ వంటి పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది.


