
బెంగాల్ సచివాలయానికి బాంబు బెదిరింపు
పశ్చిమబెంగాల్ సచివాలయం అయిన రైటర్స్ బిల్డింగ్కు బాంబు బెదిరింపు వచ్చింది.
పశ్చిమబెంగాల్ సచివాలయం అయిన రైటర్స్ బిల్డింగ్కు బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో మొత్తం సచివాలయంలో ఉద్యోగులందరినీ బయటకు పంపించేశారు. బాంబు ఏదైనా ఉందేమోనన్న అనుమానంతో బాంబు నిర్వీర్య దళాన్ని పిలిపించి తనిఖీలు చేయిస్తున్నారు.
అయితే బాంబు ఉందో లేదో కూడా ఇంతవరకు నిర్ధారణ కాలేదు. భవనంలో బాంబు ఉన్నట్లు ఒక ఈమెయిల్ అందడంతో వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లింది. సీనియర్ పోలీసు అధికారులు బాంబు నిర్వీర్య దళంతోను, పోలీసు కుక్కలతోను వెంటనే అక్కడకు చేరుకుని సిబ్బందిని ఖాళీ చేయించారు. మెయిల్ ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై కూడా తాము దర్యాప్తు చేస్తున్నట్లు కోల్కతా పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భవనంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.