రైతులను ఆదుకోండి: వెంకయ్యనాయుడు | Venkaiah Naidu on Untimely Rain, Hailstorm-hit States | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకోండి: వెంకయ్యనాయుడు

Apr 14 2015 1:54 AM | Updated on Sep 3 2017 12:15 AM

రాష్ట్రంలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లిన విషయాన్ని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, రాధామోహన్‌సింగ్‌ల దృష్టికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీసుకెళ్లారు.

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లిన విషయాన్ని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, రాధామోహన్‌సింగ్‌ల దృష్టికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీసుకెళ్లారు. పలు ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షాలు, నష్టంపై వారికి వివరించి.. రైతులను ఆదుకోవాల్సిందిగా కోరారు. దీంతోపాటు తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఆరా తీశారు.

ఇక వర్షాల కారణంగా ఏర్పడిన నష్టం వివరాలను పరిశీలించడంతో పాటు రైతు ఉపశమన చర్యల కోసం వెంకయ్యనాయుడు బుధవారం బాధిత జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, మదన్ భాయ్ ఖండారియా కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement