పాకిస్థాన్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన ఉత్తర వజీరిస్థాన్లోని షావల్లో పాక్ సైన్యం వైమానిక దాడులు చేసింది.
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన ఉత్తర వజీరిస్థాన్లోని షావల్లో పాక్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 14 మంది తీవ్రవాదుల మరణించారని సైనిక దళాల ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే మరణించిన తీవ్రవాదులు ఏ దేశానికి చెందిన వారు అనే విషయాన్ని మాత్రం తెలపలేదు.
ఉత్తర వజీరిస్థాన్లోని తీవ్రవాదులను మట్టుబెట్టే లక్ష్యంతో 2014 జూన్ నుంచి భద్రత దళాలు దాడులు జరుపుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 3 వేల మందికిపైగా తీవ్రవాదులు మరణించారని చెప్పారు. అలాగే 300 మంది సైనికులు కూడా మృతి చెందారని సైనిక దళాల ఉన్నతాధికారి వివరించారు.