నైజీరియాలో వంద మందిపైగా ఊచకోత | Over 100 killed in Islamist attack in Nigeria | Sakshi
Sakshi News home page

నైజీరియాలో వంద మందిపైగా ఊచకోత

Feb 17 2014 7:57 PM | Updated on Sep 2 2017 3:48 AM

నైజీరియాలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు.

కానో: నైజీరియాలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు.ఈశాన్య నైజీరియా బోర్నో రాష్ట్రంలో క్రై స్తవులు అధికంగా ఉండే ఇఘే గ్రామంపై దాడిచేసి దాదాపు వంద మందిని ఊచకోత కోశారు. శనివారం రాత్రి ఆరు ట్రక్కులు, ద్విచక్ర వాహనాలపై ఆయుధాలతో సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బార్నాబాస్ అనే రైతు వెల్లడించారు. ఈ ఘటనతో భీతిల్లిన చాలామంది గ్రామస్తులు ఇళ్లను వదలి పారిపోయారు.

 

ఆ దుండగులు బోకో హరామ్ ఇస్లామిస్ట్ బోకో హరామ్‌కు చెందినవారుగా అనుమానిస్తున్నట్లు స్థానిక సెనేటర్ అలీ డుమె ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు వెల్లడించారు. 60 మంది మతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని, మిగతావాటికి చేయాల్సి ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement