ఆలయాలపై దాడుల గురించి మాట్లాడరేం? | No religious place should be attacked, says Delhi High court | Sakshi
Sakshi News home page

ఆలయాలపై దాడుల గురించి మాట్లాడరేం?

Apr 24 2015 7:03 PM | Updated on Sep 3 2017 12:49 AM

ఆలయాలపై దాడుల గురించి మాట్లాడరేం?

ఆలయాలపై దాడుల గురించి మాట్లాడరేం?

అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను పరిరక్షించాల్సిన అవసరముందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

న్యూఢిల్లీ: అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను పరిరక్షించాల్సిన అవసరముందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ప్రార్థనా మందిరాలపై ఎలాంటి దాడులు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వేలాది సంవత్సరాలుగా భారత దేశంలో మత సామరస్యం పరిఢవిల్లుతోందని, ఇది ఇలాగే కొనసాగాలని జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ వ్యాఖ్యానించారు.

క్రైస్తవుల మత ప్రయోజనాలు కాపాడాలంటూ దాఖలైన 'పిల్'పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని చర్చిలపై దాడులు జరిగిన నేపథ్యంలో ఈ పిల్ దాఖలు చేశారు. మత సంబంధమైన ప్రయోజనాల కోసమే ఈ వ్యాజ్యం వేశారని, మతంతో సంబంధం లేకుండా అన్ని ప్రార్థనా మందిరాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అనిల్ సోని వాదించారు.

ఆలయాలు, గురుద్వారాలు, మసీదులపై కూడా దాడులు జరిగాయని... వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదని వాపోయారు. పిటిషనర్ అన్ని మతాల గురించి ఆలోచించాలని సూచించారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను సమానంగా కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement