కుట్రపన్ని కాల్చి చంపారు: సీపీఎం | Killing of prisoners brazen murder: CPI-M | Sakshi
Sakshi News home page

కుట్రపన్ని కాల్చి చంపారు: సీపీఎం

Apr 8 2015 6:58 PM | Updated on Aug 13 2018 8:10 PM

తెలంగాణలో జరిగిన ఐదుగురు అండర్ ట్రయల్ ఖైదీల ఎన్కౌంటర్ బూటకమని సీపీఎం పేర్కొంది.

న్యూఢిల్లీ: తెలంగాణలో జరిగిన ఐదుగురు అండర్ ట్రయల్ ఖైదీల ఎన్కౌంటర్ బూటకమని సీపీఎం పేర్కొంది. పోలీసులు ముందుగానే కుట్ర పన్ని వారిని కాల్చిచంపారని చేశారని ఆరోపించింది. ఈ ఘటనను సిగ్గుమాలిన చర్యగా వర్ణించింది. సిమి తీవ్రవాదులు ఇద్దరు పోలీసులను కాల్చిచంపినందుకు ప్రతీకారంగా ఈ ఎన్కౌంటర్ చేశారని ఆరోపించింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకోలేరని పేర్కొంది.

ఈ కాల్పుల ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని, బాధ్యులైన పోలీసుల నుంచి వివరణ తీసుకోవాలని డిమాండ్ చేసింది. తీవ్రవాది వికారుద్దీన్ సహా ఐదుగురు ఖైదీలను నల్లగొండ జిల్లాలో పోలీసులు మంగళవారం ఎన్కౌంటర్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement