ముంబై గ్యాంగ్ రేప్ ఘటనపై షిండే ప్రకటన | Sakshi
Sakshi News home page

ముంబై గ్యాంగ్ రేప్ ఘటనపై షిండే ప్రకటన

Published Mon, Aug 26 2013 12:16 PM

Home Minister Sushil Kumar Shinde makes statement in Lok Sabha on Mumbai gangrape

న్యూఢిల్లీ : ముంబయిలో ఫోటో జర్నలిస్ట్పై అత్యాచార ఘటనకు సంబంధించి కేంద్ర హోమంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం లోక్సభలో ప్రకటన చేశారు. ఈ సంఘటనకు సంబంధించి అయిదుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. 20 బృందాలతో గాలించి నిందితుల్ని ముంబయి పోలీసులు పట్టుకున్నారని షిండే తెలిపారు. అయిదుగురి నిందితుల్లో ఇద్దరు తప్పు ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. వీలైనంత త్వరలో నిందితులకి శిక్ష పడేలా చూస్తామని షిండే హామీ ఇచ్చారు. అంతకు ముందు ఈ సంఘటనపై బీజేపీ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement