గుజరాత్‌లోకి 13 మంది ఉగ్రవాదుల చొరబాటు! | Gujarat security stepped up after terror alert by intelligence agencies | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లోకి 13 మంది ఉగ్రవాదుల చొరబాటు!

Aug 11 2013 2:12 AM | Updated on Sep 1 2017 9:46 PM

గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలోకి 13 మంది ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా సంస్థ(ఐబీ) తెలిపింది. దీంతో జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

వల్సాద్: గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలోకి 13 మంది ఉగ్రవాదులు  చొరబడినట్లు నిఘా సంస్థ(ఐబీ) తెలిపింది. దీంతో జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా జిల్లాలోకి వచ్చారని తమకు ఐబీ చెప్పడంతో నిఘా, భద్రతలను పటిష్టం చేశామని ఎస్పీ నిపుణా తోర్వానే శనివారం తెలిపారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, తీరప్రాంతాల్లో భద్రత పెంచామని, హోటళ్లలో తనిఖీ చేశామని చెప్పారు. పంద్రాగస్టు నేపథ్యంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఢిల్లీలో భారీ దాడులకు పాల్పడే అవకాశముందని ఐబీ హెచ్చరించిన నేపథ్యంలో ఉగ్ర ముష్కరుల చొరబాటు వెలుగు చూసింది.

Advertisement
 
Advertisement
Advertisement