ప్రధాని నరేంద్ర మోడీ తాజా కేబినెట్ 46 మందితో కొలువుతీరింది
	న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తాజా కేబినెట్ 46 మందితో కొలువుతీరింది. ఈ మంత్రివర్గంలో 24 మందికి కేబినెట్ హోదా,  10 మందికి సహాయ మంత్రులు హోదా, 12 మందికి స్వతంత్ర హోదా  దక్కింది. ఇక రక్షణ శాఖను మోడీ తన ఆధ్వర్యంలోనే ఉంచుకోవాలని భావించినా.. ఆ స్థానాన్ని అరుణ్ జైట్లీకి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. నరేంద్ర మోడీ కేబినెట్ లో  ఆయా శాఖలు లభించే అవకాశం ఉన్న అభ్యర్థుల వివరాలు..
	
	రాజ్నాథ్ సింగ్ -హోంశాఖ
	అరుణ్జైట్లీ - ఆర్ధిక, రక్షణ శాఖ
	రాధా మోహన్ సింగ్- వ్యవసాయ శాఖ
	గడ్కరీ- రవాణా శాఖ
	సదానంద గౌడ - రైల్వేశాఖ
	సుష్మాస్వరాజ్ - విదేశాంగ శాఖ
	వెంకయ్యనాయుడు- పట్టణాభివృద్ధి శాఖ
	మేనకా గాంధీ- మహిళ, శిశు సంక్షేమ శాఖ
	అనంత్కుమార్ - పార్లమెంటరీ వ్యవహారాలు
	రవిశంకర్ ప్రసాద్- న్యాయశాఖ శాఖ
	అశోక్గజపతిరాజు - పౌరవిమానయాన శాఖ
	స్మృతి ఇరానీ - మానవవనరుల అభివృద్ధి శాఖ
	నిర్మలాసీతారామన్ - వాణిజ్య శాఖ (స్వతంత్ర)
	జవదేకర్ - సమాచార ప్రచార శాఖ(స్వతంత్ర)
	పియూష్ గోయల్ - విద్యుత్, బొగ్గు శాఖ (స్వతంత్ర)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
