రూ. 70 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత | BSF seizes 14 kg heroin valued at Rs.70 crore in Punjab | Sakshi
Sakshi News home page

రూ. 70 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Sep 13 2015 6:42 PM | Updated on Sep 3 2017 9:20 AM

రూ. 70 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

రూ. 70 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

పంజాబ్లో పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు.

చండీగఢ్: పంజాబ్లో పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. ఫిరోజ్పూర్ సెక్టార్లో 14 కిలోల హెరాయిన్ను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 70 కోట్లు రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు.

స్మగ్లర్లు పాకిస్థాన్ నుంచి హెరాయిన్ను భారత్కు తరలించేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. కాగా స్మగ్లర్లు తప్పించుకుని పారిపోయారు. ఈ ఏడాదిలో బీఎస్ఎఫ్ జవాన్లు పంజాబ్లో 164 కిలోలకుపైగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement