బతికుండగా భద్రాచలం విలీనం కానివ్వను: రేణుక | Bhadrachalam in Seemandhra over my dead body: Renuka chowdary | Sakshi
Sakshi News home page

బతికుండగా భద్రాచలం విలీనం కానివ్వను: రేణుక

Nov 28 2013 1:13 AM | Updated on Aug 14 2018 3:55 PM

బతికుండగా భద్రాచలం విలీనం కానివ్వను: రేణుక - Sakshi

బతికుండగా భద్రాచలం విలీనం కానివ్వను: రేణుక

కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రేణుకా చౌదరి బుధవా రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు.

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రేణుకా చౌదరి బుధవా రం  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి జాబితా నుంచి తొలగించిన తరువాత ఆమె తొలిసారిగా దిగ్విజయ్‌ను కలిశారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘భద్రాచలంను సీమాంధ్రలో విలీనం చేసే ప్రసక్తే లేదు. కచ్చితంగా అడ్డుకుంటా. సీమాంధ్రలో విలీనం చేయాలంటే నేను బతికుండగా అది జరగదు.  కాదూ కూడదంటే నా శవంపై తీసుకెళ్లాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement