మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఇక అది తప్పనిసరి | After income tax and PAN, Aadhaar mandatory to have a mobile phone connection | Sakshi
Sakshi News home page

మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఇక అది తప్పనిసరి

Mar 25 2017 1:12 PM | Updated on Sep 5 2017 7:04 AM

మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఇక అది తప్పనిసరి

మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఇక అది తప్పనిసరి

పాన్ కార్డు దాఖలు చేయడానికి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్న కేంద్రప్రభుత్వం, మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ తప్పనిసరిచేస్తూ ఆదేశాలు జారీచేసింది.

న్యూఢిల్లీ : ఆధారే ఇక అన్నింటికీ ఆధారం అయిపోతుంది. పాన్ కార్డు దాఖలు చేయడానికి,  ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్న కేంద్రప్రభుత్వం, మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ తప్పనిసరిచేస్తూ ఆదేశాలు జారీచేసింది.  మొబైల్ సబ్స్క్రైబర్లకు(పోస్టుపెయిడ్, ప్రీపెయిడ్) ఇచ్చిన అన్ని లైసెన్సులను ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియతో పునఃధ్రువీకరించాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం(డీఓటీ)  ఆదేశించింది. 2018 ఫిబ్రవరి 6 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేయాలని టెలికాం కంపెనీలను ఆదేశిస్తూ డిఓటీ  ఓ ప్రకటన జారీచేసింది. ఈ తేదీ అనంతరం ఏదైనా మొబైల్ ఫోన్ నెంబర్ ఆధార్తో లింకయి లేకపోతే అవి అక్రమమైనవిగా నిర్ధారించాల్సి వస్తుందని పేర్కొంది.
 
కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న వారు కూడా తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పద్ధతి ద్వారా పొందాలని  తెలిపింది. దేశంలోని అన్ని మొబైల్ నెంబర్ల యూజర్ల గుర్తింపునకు సంబంధించిన వివరాలను ఏడాది లోపు సేకరించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ  ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుత మొబైల్ యూజర్ల కనెక్షన్లకు ఆధార్ ను తప్పనిసరి చేసింది. అంతేకాక భవిష్యత్తులో సిమ్ కార్డు తీసుకోవాలనుకునే వారు కూడా ఆధార్ ఆధారిత  ఈ-కేవైసీ ద్వారానే జారీచేసేలా టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement