పతంజలి ప్రకటనలపై 33 ఫిర్యాదులు | 33 Complaints Received Against Patanjali Advertisements | Sakshi
Sakshi News home page

పతంజలి ప్రకటనలపై 33 ఫిర్యాదులు

Aug 2 2016 6:02 PM | Updated on Mar 28 2019 6:26 PM

యోగా గురు రామ్ దేవ్ పతంజలి ఉత్పత్తుల ప్రకటనలపై 30 ఫిర్యాదులు అందాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి మంత్రి రాజవర్దన్ రాథోడ్ లోక్ సభకు తెలిపారు.

న్యూఢిల్లీ: యోగా గురు రామ్ దేవ్ పతంజలి  ఉత్పత్తుల ప్రకటనలపై  30  ఫిర్యాదులు  అందాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి  మంత్రి రాజవర్దన్ రాథోడ్  లోక్ సభకు తెలిపారు.   పతంజలి ఆయుర్వేదం లిమిటెడ్ ప్రకటనలకు  వ్యతిరేకంగా ఏప్రిల్ 2015 , జూలై 2016 మధ్య కాలానికి  30కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని పార్లమెంట్ కు ఇచ్చిన  లిఖిత పూర్వక సమాధానంలో  తెలియజేసారు. దీంతో మొత్తం ఈ సంవత్సరానికి 33 కంప్లయిట్స్ నమోదయ్యాయన్నారు.

కన్జూమర్ ఫిర్యాదుల కౌన్సిల్ (సీసీసీ) పరిశోధనలను ప్రకారం ప్రకటనల స్వీయ నియంత్రణపై ఈ ఫిర్యాదులందాయన్నారు.   వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం ప్రకారం మొత్తం 21  ఫిర్యాదుల్లో , 17 అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  నిబంధనలు ఉల్లంఘించినట్టుగా  పరిగణించినట్టు  చెప్పారు. ఆరు  ఉత్పత్తి ప్యాకేజింగ్ సమాచార ప్రకటనలు కూడా,   అడ్వర్టైజింగ్ కంటెంట్ స్వీయ నియంత్రణ కోల్పోయినట్టుగా గుర్తించామనీ, ఏఎస్సీఐ కోడ్ ఉల్లంఘనగానే  భావించినట్టు మంత్రి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement