టీఆర్‌ఎస్ కార్యకర్తలపై కందిరీగల దాడి | TRS activists attack on the wasp | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ కార్యకర్తలపై కందిరీగల దాడి

Apr 26 2015 12:34 AM | Updated on Apr 3 2019 8:52 PM

టీఆర్‌ఎస్ కార్యకర్తలపై కందిరీగల దాడి - Sakshi

టీఆర్‌ఎస్ కార్యకర్తలపై కందిరీగల దాడి

కందిరీగల దాడి నుంచి మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్తకోట ప్రభాకర్‌రెడ్డిలు తప్పించుకున్నారు.

తప్పించుకున్న హరీశ్‌రావు

తూప్రాన్ : కందిరీగల దాడి నుంచి మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్తకోట ప్రభాకర్‌రెడ్డిలు తప్పించుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రమాయిపల్లి వద్ద ఓ ప్రైవేట్ అతిథి గృహంలో శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.

కొందరు కార్యకర్తలు పక్క మామిడితోటలో కాయలు కోయగా.. అక్కడున్న కందిరీగలు చెదిరి సమావేశ మందిరంలోకి చొరబడ్డాయి. విషయం తెలుసుకున్న మంత్రి, ఎంపీలు కారెక్కి వెళ్లిపోయారు. కందిరీగల దాడిలో పలువురు గాయపడ్డారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement