పండుగ వేడుకలో విషాదం; షాకింగ్‌ వీడియో

tragedy in festival celebration; two died at Aluru of Nizamabad

సాక్షి, నిజామాబాద్‌ : జనమంతా పండుగ వేడుకలో ఆనందిస్తున్నవేళ.. ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలి ఇద్దరు మరణించారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు మండలం ఆలూరులో శుక్రవారం ఈ విషాద సంఘటన జరిగింది.

దసరాకు ఒక రోజు ముందు గడీ మైసమ్మకు మొక్కు తీర్చడం ఆలూరులో ఆనవాయితీ. గ్రామస్తులంతా ఒక్కచోట చేరి వేడుక చేసుకున్నారు. కొందరు.. ఓ ఇంటి పైకెక్కి డప్పు విన్యాసాలను తిలకిస్తుండగా.. ఇంటి శ్లాబ్‌ ఒక్కసారిగా కూలి, కిందున్నవాళ్లపై పడిపోయింది.

ఈ ఘటనలో యశోద అనే యువతి, హారిక అనే చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో గర్భిణికి తీవ్రగాయాలు, ఇంకొ 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే నిల్చున్న గ్రామస్తొడరు ప్రమాదాన్ని వీడియో తీశాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top