లాక్డౌన్ పొడిగిస్తే సహకరిద్దాం : హరీశ్ రావు
సాక్షి, సిద్దిపేట : లాక్డౌన్ పొడిగిస్తే సహకరిద్దామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాణాలకంటే ముఖ్యమేది కాదని, లాక్ డౌన్ పొడిగిస్తే సహకరిద్దామని తెలిపారు. సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యమన్నారు. లాక్ డౌన్ ముగిసే దాకా ఇంటి నుండి బయటకు రావద్దని సూచించారు.
ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని, ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇటలీ, అమెరికా పరిస్థితి మనకొద్దంటే.. స్వీయ నియంత్రణ పాటిస్తే మేలు అన్నారు.